ముదిమిని మురిపిద్దాం
బతుకు భారమని.. ఇక జీవించలేమని ఆరు నెలల కిందట జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు తనను ఆదరించే వారు లేరనే వ్యథతో తాను పడుకున్న మంచానికి నిప్పు పెట్టుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. అడపాదడపా ఇలాంటి సంఘటనలు
నేడు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం
ఈనాడు, కరీంనగర్
బతుకు భారమని.. ఇక జీవించలేమని ఆరు నెలల కిందట జగిత్యాల జిల్లాకు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే జిల్లాకు చెందిన ఓ వృద్ధుడు తనను ఆదరించే వారు లేరనే వ్యథతో తాను పడుకున్న మంచానికి నిప్పు పెట్టుకుని ఆత్మాహుతి చేసుకున్నాడు. అడపాదడపా ఇలాంటి సంఘటనలు జిల్లాలో కలవరపరుస్తున్నాయి. మలివయస్సులోని వారి వ్యథను చూపుతున్నాయి.
కరీంనగర్ సమీపంలోని ఓ గ్రామంలో రెండు నెలల కిందట కన్న కొడుకులు తమను పట్టించుకోవడం లేదని ఉన్న ఇల్లును ఆస్తిని తీసుకున్నారని బాధతో ముదిమి వయస్సులో ఉన్న ఇద్దరు రోడ్డు పక్కన జీవనాన్ని సాగిస్తున్నారు. ఇదే విధంగా తిమ్మాపూర్ మండలంలోని వృద్ధ దంపతులు కూడా ఇదే విధంగా అయినవారికి దూరమయ్యామనే వేదనను కనిపించిన వారికి వినిపించారు.
వారిని చూస్తే చేతులు జోడించాలనిపిస్తుంది.. వారి ఆప్యాయత పలకరింపును చూసి ఆనందమనిపిస్తుంది. ముఖంపై పడిన ముడతలు వారి జీవన అనుభవాలకు నిదర్శనం. అలాంటి వృద్ధుల విషయంలో అక్కడక్కడ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గడ్డాలొచ్చే దాకా బిడ్డల్ని పెంచిన పెద్దలకు మలివయస్సులో కానరాని కష్టాలు ఎదురవుతున్నాయి. సూటిపోటి మాటలు.. చీత్కారాలు దరిచేరుతున్న వారి జీవితాలకు భరోసానిచ్చేలా పరిస్థితులు మారాల్సిన అవసరముంది. నేడు ‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనమిలా..
అనాథాశ్రమాలే దిక్కు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు వృద్ధాశ్రమాలలో తలదాచుకుంటున్న వారి సంఖ్య దాదాపుగా 850కిపైగా ఉంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో 60 మంది ఉంటుండగా జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లోనూ వీరికి తోడ్పాటునిచ్చేలా పలు స్వచ్ఛంద సంస్థలు సహకారాన్ని అందిస్తున్నాయి. కన్నకొడుకులు, కూతుళ్లున్న చాలా మంది తప్పనిసరైన పరిస్థితుల్లో అయినవాళ్లకు దూరంగా బతుకును సాగిస్తున్నారు. స్థానికంగానే కాకుండా ఇక్కడి వారిలో చాలామంది రాష్ట్ర రాజధాని సమీపంలో ఉన్న ఆశ్రమాల్లో చివరి దశకు చేరిన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ వీరికి కొంత ఆర్థిక భరోసా ఇస్తున్నా.. ఇద్దరు వృద్ధ దంపతుల్లో ఒకరికి మాత్రమే పింఛన్ వస్తుండటంతో ఇబ్బంది నెలకొంది.
చట్టం వచ్చినా అంతంతే..!
ఆసరాలేని మలివయస్సు వారిని చేరదీసి వారిని అన్నిరకాలుగా బాగా చూసుకునేందుకు వృద్ధుల పోషణ చట్టం-2007లో అమలులోకి వచ్చింది. తల్లిదండ్రులు, సీనియర్ పౌరుల పోషణ, సంక్షేమ బాధ్యతల్ని ప్రభుత్వమే తీసుకుని వారి సంఖ్యను బట్టి వృద్ధాశ్రమాలను నెలకొల్పాలి. ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా వారికి అన్నిరకాలుగా ఆరోగ్యం, ఆహారం, వసతి రూపంలో అండగా నిలబడాలి. కాని అనుకున్న విధంగా వారి సంరక్షణకు నిధులు రాకపోవడంతో దాతల సహకారంతో ఉన్న ఆశ్రమాలు అతి కష్టంగా నెట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా వారి ఆరోగ్య పరీక్షలు అవసరమైన చికిత్సల విషయంలో మరింత చొరవ నాలుగు జిల్లాల పరిధిలో పెరగాల్సిన అవసరముంది. పైగా తమను పిల్లలు చూసుకోవడం లేదని ఠాణా మెట్లెక్కేవారికి పోలీసులు, ఇతర శాఖల అధికారుల సహకారం సంపూర్ణంగా అందితే మేలు జరగనుంది.
ఇలా భరోసానిస్తేనే..!
* మనం కూడా పెద్దాయ్యాక వృద్ధులమవుతామే విషయాన్ని యువ దంపతులు గుర్తించాలి. తమ పిల్లలకు తాతా నానమ్మల ప్రాధాన్యం తెలియజేయాలి.
* ఓపికగా వారి బాధను కష్టాలను అడిగి తెలుసుకోవాలి. వృద్ధాప్యంలో వారిలో కనిపించే ఒకరకమైన ఇబ్బందిని అర్థం చేసుకుని వారి మాటలకు విలువనివ్వాలి.
* ఆస్తులను పంచుకున్నట్లు అమ్మానాన్నలను పంచుకునే పరిస్థితి మారాలి. వారితో మసులుకునే ప్రేమ ఆప్యాయతల్ని, అనుబంధాల్ని చిన్నారులకు తెలియజేయాలి.
* 60 ఏళ్లు దాటిన అమ్మానాన్నలకు సరైన ఆసరాను ఇంట్లో కల్పించాలి. వారిపై విసుగు చూపకుండా.. వారి బాగోగులను బాధ్యతగా భావించి చూసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
మలేరియా నిర్మూలనకు కృషి
[ 26-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా