చీకటి బతుకుల్లో వెలుగులు
‘తమసోమా జ్యోతిర్గమయ.. మృత్యుర్మా అమృతంగమయ’ సదాశయ ఆశయం... కాకతీయ వైద్య కళాశాలకు దేహదానం చేసిన కాళోజీ నారాయణరావు ఆదర్శం... ఆయన స్ఫూర్తితో టి.అశోక్కుమార్ మరణానంతరం దేహదానం చేయడం.. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ‘సదాశయ ఫౌండేషన్’ స్థాపనకు బీజం పడింది..
‘సదాశయానికి’ పద్నాలుగేళ్లు
నేత్ర, అవయవదానంపై విశేష కృషి
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం
గత నెలలో దిల్లీలో జరిగిన సదస్సులో కేంద్ర మంత్రి, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యిదర్శికి ‘సదాశయ’
ప్రత్యేక సంచిక అందిస్తున్న శ్రావణ్కుమార్
‘తమసోమా జ్యోతిర్గమయ.. మృత్యుర్మా అమృతంగమయ’ సదాశయ ఆశయం... కాకతీయ వైద్య కళాశాలకు దేహదానం చేసిన కాళోజీ నారాయణరావు ఆదర్శం... ఆయన స్ఫూర్తితో టి.అశోక్కుమార్ మరణానంతరం దేహదానం చేయడం.. రామగుండం పారిశ్రామిక ప్రాంతం కేంద్రంగా ‘సదాశయ ఫౌండేషన్’ స్థాపనకు బీజం పడింది.. నాటి నుంచి నేటి వరకు ‘సదాశయ ఫౌండేషన్’ చీకటి బతుకుల్లో వెలుగులు పూయిస్తోంది. కాళోజీ నారాయణరావు మృతి చెందినప్పుడు ఆయన కోరిక మేరకు మృతదేహాన్ని వైద్య విద్యార్థుల ప్రయోజనాల కోసం కాకతీయ వైద్య కళాశాలకు అందించారు. ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న టి.అశోక్కుమార్ తాను సైతం మరణానంతరం దేహదానం చేయనున్నట్లు ప్రకటించారు. దురదృష్టవశాత్తు 2006 మార్చి 17న మృతి చెందగా ఆయన కోరిక మేరకు మృతదేహాన్ని కాకతీయ వైద్య కళాశాలకు దానం చేశారు. ఈ రెండు సంఘటనల స్ఫూర్తితో దివంగత అశోక్కుమార్ సోదరుడు, సింగరేణి కార్మికుడైన శ్రావణ్కుమార్ తన స్నేహితులు, అభ్యుదయవాదుల సహకారంతో 2008 సంవత్సరంలో మహాత్మాగాంధీ జయంతి రోజైన అక్టోబరు 2న ‘సదాశయ ఫౌండేషన్’ను స్థాపించారు. పద్నాలుగేళ్లుగా నేత్ర, అవయవ, దేహదానంతో పాటు ప్లాస్టిక్ నివారణ, శబ్ద, వాయు కాలుష్య నివారణ, వరకట్న నిషేధం, గణపతి నవరాత్రోత్సవాల్లో మట్టి ప్రతిమలను కొలవడం, మహిళల వికాసం తదితర సామాజిక అంశాలపై పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా విస్తరణ
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఆవిర్భవించిన సదాశయ ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించి ‘తెలంగాణ రాష్ట్ర నేత్ర, అవయవదాతల సంఘం’ ఏర్పాటుకు కారణమైంది. ఇటీవల న్యూదిల్లీలో జరిగిన అవయవ, శరీర, నేత్రదానాల ప్రత్యేక సదస్సులో పాల్గొన్న శ్రావణ్కుమార్ భారత ఉపరాష్ట్రపతి ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటివరకు 600లకు పైగా నేత్ర, 80కి పైగా దేహ, 70కి పైగా అవయవదానాలు చేయించి ఎంతోమందికి పునరుజ్జీవం కల్పించారు. 50వేలకు పైగా మరణానంతరం తమ శరీరాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. నేత్రదానాలకు ముందుకు వచ్చిన వారి సంఖ్య అనేకం. సింగరేణి సహకారంతో వివిధ గనులు, సంస్థల్లో నేత్ర, అవవయదానంపై కార్మికుల్లో అవగాహన కల్గించారు. విద్యా సంస్థలు, ఆర్టీసీˆ తదితర ప్రభుత్వరంగ సంస్థల్లోను పలు అవగాహన సదస్సులు నిర్వహించారు.
అవార్డులతో మరింత ప్రోత్సాహం..
నేత్ర, అవయవ, దేహదానం, సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో కీలకపాత్రను పోషిస్తున్న సదాశయ ఫౌండేషన్ అనేకమైన అవార్డులు, రివార్డులను అందుకుంది. పర్యావరణ పరిరక్షణలో జీపీˆపీˆపీపీˆజీ ఆధ్వర్యంలో, సీˆనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ, వాసన్ ఐ బ్యాంకు, మధర్ థెరిసా సొసైటీ, తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం వివిద సంస్థలచే రెండు సార్లు జీవిత సాఫల్య పురస్కారాలు, జీవన్దాన్ ఆధ్వర్యంలో సత్కారాలు సదాశయ ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రావన్కుమార్ అందుకున్నారు. గత నెల 3, 4వ తేదీల్లో డిల్లీలో నిర్వహించిన నేత్ర, అవయవ, శరీర దాన సదస్సులో శ్రావన్కుమార్ పాల్గొన్నారు. సదస్సులో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, ఆరోగ్యశాఖ కార్యదర్శితో పాటు పలువురికి సదాశయ ఫౌండేషన్ రూపొందించిన ‘జీవ ప్రదాతలు’ ప్రత్యేక సంచికను అందించారు.
సామాజిక రుగ్మతలను రూపుమాపేలా...
నేత్ర, అవయవ, దేహదానంపై అహర్నిశలు శ్రమిస్తూనే మరోవైపు సమాజాన్ని పట్టి పీˆడిస్తున్న రుగ్మతలను రూపుమాపేందుకు కృషిని మొదలుపెట్టారు. శ్రావన్కుమార్ తన కొడుకులకు ఎలాంటి కట్న కానుకలు తీసుకోలేదు. పర్యావరణహితంగా పెళ్లి చేశారు. గణపతి నవరాత్రోత్సవాల్లో ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాలకు బదులుగా మట్టి విగ్రహాలను నెలకొల్పాలని చేపట్టిన సదాశయ ప్రచారానికి సంగరేణి యాజమాన్యం సంపూర్ణ సహకారం అందించింది. సంస్థ ఆధ్వర్యంలో బట్ట సంచులు పంపిణీ చేశారు. డిగ్రీ, పీˆజీ, ఇంజినీరింగు కళాశాలల్లో వరకట్న దురాచారంపై అవగాహన సదస్సులు, చర్చాగోష్టిలు నిర్వహిస్తోంది. నేత్ర, అవయవ, దేహదానంపై దాతల చిత్రాలు, వారి బంధువుల అభిప్రాయాలతో సదాశయ ఫౌండేషన్ విడుదల చేసిన రెండు ప్రత్యేక సంచికలు, కరపత్రాలు, బ్రోచర్లు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.
చట్టం తేవాలి.. ప్రోత్సహించాలి
-శ్రావణ్కుమార్, లింగమూర్తి, సదాశయ ఫౌండేషన్.
రాష్ట్రపతి నుంచి మొదలుకొని సామన్య పౌరుని వరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మరణానంతరం నేత్ర, దేహదానం, జీవన్మృతుడైతే అవయవదానం చేసేలా చట్టం తీసుకురావాలి. దాతలను, వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించాలి. దాతల కుటుంబీకులకు ప్రభుత్వ పథకాల్లో రాయితీలు కల్పించాలి. నేత్ర, అవయవ, దేహదానంపై పనిచేస్తున్న సంస్థలకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహాన్ని అందించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
-
‘దుబాయ్ ప్రయాణాలను రీషెడ్యూల్ చేసుకోండి’ - ఇండియన్ ఎంబసీ అడ్వైజరీ
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి