‘స్వచ్ఛత’ ర్యాంకులో మెరుగు
కరీంనగర్ నగరపాలిక ‘స్వచ్ఛత’ ర్యాంకు మెరుగు పడింది. గతేడాది వచ్చిన ర్యాంకు కంటే తన స్థానాన్ని పదిల పర్చుకుంది. దిల్లీలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ్ అమృత్ మహోత్సవ్ సమావేశంలో ర్యాంకులు ప్రకటించింది.
జాతీయస్థాయిలో 67, రాష్ట్రంలో 3వ స్థానం
జీఎఫ్సీలో వెనుకబడిన కరీంనగర్ నగరపాలిక
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్
కరీంనగర్లో ఐదు నెలల కిందట సర్వేలో భాగంగా చెత్త సేకరణపై వివరాలు సేకరించి నిక్షిప్తం చేస్తున్న కేంద్ర బృందం
కరీంనగర్ నగరపాలిక ‘స్వచ్ఛత’ ర్యాంకు మెరుగు పడింది. గతేడాది వచ్చిన ర్యాంకు కంటే తన స్థానాన్ని పదిల పర్చుకుంది. దిల్లీలో శనివారం నిర్వహించిన స్వచ్ఛ్ అమృత్ మహోత్సవ్ సమావేశంలో ర్యాంకులు ప్రకటించింది. కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశ వ్యాపంగా 4,354 నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్-2022 పేరుతో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మేలో వేర్వేరు రకాల విభాగాల్లో సర్వే నిర్వహించారు. 60 డివిజన్లలో వారం రోజుల పాటు బృందం పర్యటించి పారిశుద్ధ్య పనుల నిర్వహణపై నగర పరిశుభ్రత, క్షేత్రస్థాయిలో ఇంటింటా చెత్త సేకరణ, మురుగుకాల్వలు శుభ్రత, సులభ్కాంప్లెక్స్లు, బహిరంగ మలమూత్ర విసర్జన వంటివి తనిఖీ చేశారు. రద్దీ ప్రాంతాలు ఎంచుకొని నగర శుభ్రతపై పౌరుల నుంచి వివరాలను అడిగి నమోదు చేశారు. అయితే అవార్డుల సాధనలో కావాల్సిన స్కోరును సాధించలేక వెనుకబడుతోంది. జాతీయ స్థాయిలో 67వ ర్యాంకుతో మెరుగ్గా ఉండగా, రాష్ట్రస్థాయిలో 3వ స్థానానికి పడిపోయింది.
సఫాయిమిత్రలోనే గుర్తింపు
గతేడాది సఫాయిమిత్ర సురక్ష ఛాలెంజ్లో దేశంలోని మూడు లక్షల జనాభాలో పోటీ పడి జాతీయస్థాయిలో రెండో ర్యాంకు సాధించి రూ.4కోట్ల నగదు పురస్కారం సాధించింది. అప్పటి తరహాలో గట్టి పట్టుదల ఈసారి స్వచ్ఛ సర్వేక్షణ్లో కనిపించలేదని తెలుస్తోంది. ప్రధానంగా కన్సల్టెన్సీని నియమించుకోకపోవడం, క్షేత్రస్థాయిలో సర్వేకు వచ్చేంత వరకు ఇతర విభాగాల అధికారులు, ఉద్యోగులు సహకరించకపోవడం కారణంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మురుగురహిత నగరంలో సున్నా
నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జనరహిత నగరంగా గుర్తింపు సాధించడంతో స్వచ్ఛ సర్వేక్షణ్లో మార్కులు కలిసి వస్తున్నాయి. మురుగు రహిత నగరం(జీఎఫ్సీ) రేటింగ్లో మార్కులు సాధించేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. ఇందులో 1100 మార్కులకు సున్నా వచ్చాయి. అదేవిధంగా వాటర్+లో పోటీ పడగా అందులో కూడా చేజారింది. దానికి బదులుగా ఓడీఎఫ్++ వచ్చింది. దీంతో అవార్డులో, ర్యాంకుల్లో తేడా కొట్టొచ్చినట్లుగా కనిపించింది.
మరింత బాధ్యతగా పని చేస్తాం
- వై.సునీల్రావు, మేయర్, కరీంనగర్
స్వచ్ఛసర్వేక్షణ్లో ర్యాంకు మెరుగు పడటం సంతోషకరం. ఇదే స్ఫూర్తితో మరింత బాధ్యతగా పని చేస్తాం. రాబోవు రోజుల్లో కార్మికులకు సౌకర్యాలు కల్పించడంతో పాటు పారిశుద్ధ్య పనుల్లో వాహనాల వినియోగం పెంచుకోవడం జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు