తారా జువ్వలు.. కళా వెలుగులు
‘రావనా చందనాలో వెన్నెలా’.. అంటూ పల్లె పాటల మధురిమను పంచారు. ‘గోగులు పూసె.. గోగులు కాసె ఓలచ్చ గుమ్మడి’..అంటూ జానపదాల గొప్పతనం తెలియజెప్పి కళోత్సవ ముగింపు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. అంటూ వందేమాతరం శ్రీనివాస్ ఆకట్టుకున్నారు.
అట్టహాసంగా ముగిసిన ఉత్సవాలు
ఈనాడు, కరీంనగర్, న్యూస్టుడే- కరీంనగర్ సాంస్కృతికం
‘రావనా చందనాలో వెన్నెలా’.. అంటూ పల్లె పాటల మధురిమను పంచారు. ‘గోగులు పూసె.. గోగులు కాసె ఓలచ్చ గుమ్మడి’..అంటూ జానపదాల గొప్పతనం తెలియజెప్పి కళోత్సవ ముగింపు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా.. అంటూ వందేమాతరం శ్రీనివాస్ ఆకట్టుకున్నారు. గోదావరిఖనికి చెందిన మధుప్రియ తన పాటలతో ప్రేక్షకుల్ని ‘ఫిదా’ చేసింది. జానపద నృత్యకారిణులు నాగదుర్గ, జాను నృత్యాలకు సభికుల నుంచి కరతాళ ధ్వనుల మోతే వినిపించింది. గాయకులు వాణి ఒల్లాలా, వడ్లకొండ అనిల్, స్వర్ణలు పాటలు పాడి కార్యక్రమానికి వన్నె తెచ్చారు. మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి చేసిన ధ్వని అనుకరణ ఆహుతుల్ని ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన పురపాలిక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకు వేదిక ముందు కూర్చుని ప్రదర్శన ఆసక్తిగా తిలకించారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్, వేదికపై మంత్రి గంగుల
కరీంనగర్ అంటే అభిమానం : కేటీఆర్
కరీంనగర్లోని మిషన్ ఆస్పత్రిలోనే తాను పుట్టానని.. అందుకే కరీంనగర్ అంటే ప్రత్యేకమైన అభిమానమని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరీంనగర్ అంటే అభిమానమనే విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కళాకారుల ప్రదర్శనలు వారిలోని ప్రతిభను తెలియజేశాయన్నారు. మైవిలేజ్ షో ద్వారా సామాజిక మాధ్యమాల్లో గంగవ్వ ప్రత్యేక గుర్తింపును అందుకుందని.. త్వరలోనే లంబాడిపల్లికి వెళ్లి కలుస్తానని చెప్పారు. గంగవ్వ తాను హీరో మహేశ్బాబు మాదిరిగా ఉన్నానని అన్నదని.. మహేశ్బాబు ఈ మాటలు వింటే ఫీలవుతాడని కేటీఆర్ తన మాటలతో అందరిని నవ్వించారు. కళోత్సవాలు అంటే చిన్నవి అనుకున్న.. కాని కరీంనగర్ భీముడిగా తాను పిలిచే కమలాకర్ ఇంత గొప్పగా నిర్వహిస్తున్నాడనే విషయం ఇక్కడికి వస్తేనే తెలిసిందన్నారు. ఆయనే ప్రత్యేకంగా హెలికాప్టర్ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చారని తెలిపారు. ఈ తరహా ఉత్సవాల్ని ఏటా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహిస్తామని తెలిపారు. వందేమాతరం శ్రీనివాస్ పాడిన ఎర్రజెండా పాట బాగుందని.. కాని ఇప్పుడు ఎరుపు, తెలుపు కలిసిన గులాబీ జెండాతో రాష్ట్రం బాగుందని మంత్రి చెప్పారు. పలువురు కళాకారులను మంత్రులు సన్మానించారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తన శక్తి ఉన్నంత వరకు ఇలాంటి కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తానని చెప్పారు.
నాగదుర్గ నృత్యం
శివారెడ్డి మిమిక్రీ
కళాకారిణి నృత్యం
ఆలపిస్తున్న వందేమాతరం శ్రీనివాస్
బతుకమ్మలతో ఇజ్రాయెల్ వనితలు
నగరంలో మధ్యప్రదేశ్ కళాకారుల ప్రదర్శన
వేదికపై బాల భవన్ చిన్నారుల ప్రదర్శన
కళాకారులతో నృత్యం చేస్తున్న మంత్రి గంగుల
హాస్యనటులు, నృత్యకారుల హంగామా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?