logo

నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం

మధ్యమానేరు నిర్వాసితులందరికి పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు.

Published : 03 Oct 2022 04:59 IST


చీర్లవంచలో పరిహారం చెక్కులను అందజేస్తున్న ఎమ్మెల్యే రమేశ్‌బాబు,
ఎంపీపీ వజ్రమ్మ, జడ్పీటీసీ సభ్యుడు రవి, ఆర్డీవో శ్రీనివాస్‌రావు

వేములవాడ : మధ్యమానేరు నిర్వాసితులందరికి పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు. వేములవాడ మండలంలోని చీర్లవంచలో 36 మంది నిర్వాసితులకు ఆదివారం ఇళ్ల పరిహారం చెక్కులను అందజేశారు. అంతకు ముందు వేములవాడ మండలంలోని మారుపాక, గ్రామీణ మండలలోని పోశెట్టిపల్లిలో దళిత బంధు యూనిట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ బూర వజ్రమ్మ, జడ్పీటీసీ సభ్యుడు మ్యాకల రవి, ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, పవన్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ హన్మాండ్లు, సింగిల్‌ విండో ఛైర్మన్‌ కృష్ణదేవరావు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యుడు ప్రజలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని