logo

స్వచ్ఛ పురస్కారం అందజేత

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జగిత్యాల జిల్లా దేశంలో ద్వితీయస్థానం, రాష్ట్రంలో ప్రథమస్థానం నిలిచిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అవార్డుకు ఎంపిక చేయగా జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆదివారం దిల్లీ విజ్ఞాన్‌భవన్‌ జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి గజేంద్రషెకావత్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

Published : 03 Oct 2022 04:59 IST


కలెక్టర్‌ రవిని అభినందిస్తున్న కేంద్రమంత్రి

జగిత్యాల, న్యూస్‌టుడే: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జగిత్యాల జిల్లా దేశంలో ద్వితీయస్థానం, రాష్ట్రంలో ప్రథమస్థానం నిలిచిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అవార్డుకు ఎంపిక చేయగా జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి ఆదివారం దిల్లీ విజ్ఞాన్‌భవన్‌ జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి గజేంద్రషెకావత్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. కలెక్టర్‌తోపాటు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎస్‌.వినోద్‌, జిల్లా పంచాయతీ అధికారి పి.నరేష్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కోఆర్డినేటర్లు హరిణి, చిరంజీవి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి షెకావత్‌ కలెక్టర్‌ రవిని ప్రత్యేకంగా అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని