రెండు పడక గదుల ఇళ్లల్లో సమస్యల తిష్ఠ
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా లోపంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లాలోని మల్యాల మండల పరిధి నూకపల్లి, రామన్నపేట్, పోతారం గ్రామాల లబ్ధిదారులకు 65 ఇళ్లు నిర్మించి గతేడాది అందజేయగా 20 ఇళ్ల వరకు ఖాళీగా ఉన్నాయి.
నిర్మించిన ఏడాదికే శిథిలావస్థకు చేరిన వైనం
న్యూస్టుడే, జగిత్యాల గ్రామీణం, మల్యాల
ఇళ్లపై ట్యాంకులు ఏర్పాటు చేయని దుస్థితి
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా లోపంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. జగిత్యాల జిల్లాలోని మల్యాల మండల పరిధి నూకపల్లి, రామన్నపేట్, పోతారం గ్రామాల లబ్ధిదారులకు 65 ఇళ్లు నిర్మించి గతేడాది అందజేయగా 20 ఇళ్ల వరకు ఖాళీగా ఉన్నాయి. తాగునీటి కొరత, నిర్మాణంలో నాణ్యతా లోపం వంటి కారణాల వల్ల వాటిలో ఉండేందుకు ఆనాసక్తి చూపుతున్నారు. నల్లాలు ఏర్పాటు చేయకపోవడంతో నీరు వృథా అవుతోంది. ట్యాంకులకు నీరు ఎక్కకపోవడంతో అవస్థలు పడుతున్నారు.
రోడ్డు సౌకర్యమేది..
65 ఇళ్లలోని కుటుంబాలకు సరిపడా తాగునీటి సరఫరా జరగడం లేదు. చాలా ఇళ్లకు వాటర్ ట్యాంకులు అమర్చలేదు. పైపులైన్ల ఏర్పాటు సైతం పూర్తికాలేదు. మిషన్ భగీరథ ప్రాజెక్టు లైనుతో అనుసంధానం చేయడంతో నీటి సమస్యను అరికట్టవచ్చని స్థానికులు చెబుతున్నారు. ఇళ్లకు చేరుకోవడానికి మెరుగైన రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలంలో మట్టిరోడ్డులో ఇళ్లకు వెళ్లడం ఇబ్బందిగా మారుతోందని కాలనీ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
ఇళ్లలోకి వర్షం నీరు..
నాసిరకం ఫ్లోరింగ్ పనుల వల్ల వర్షం వస్తే ఇళ్లు ఉరుస్తున్నాయి. నిర్మాణంలో నాణ్యతా లోపం వల్ల పైకప్పు పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతోంది. ప్రారంభించిన ఏడాదికే ఇలాంటి సమస్యల్ని ఎదుర్కోవడంతో నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్లు, లైట్లు, స్విచ్ బోర్డులు వంటి విద్యుత్ పరికరాలను పూర్తి స్థాయిలో అందించలేదని తామే కొనుగోలు చేసుకున్నామని పేర్కొంటున్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయం
వేసవిలో నీటి ఎద్దడి - బంద పోచయ్య, నివాసితుడు
నీటి కొరత కారణంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాం. వేసవి కాలంలో నీటి సరఫరా కాకపోవడంతో బయట నుంచి నీటిని మోసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మిషన్ భగీరథ పైపులైను చేరువలోనే ఉన్నప్పటికీ కనెక్షన్ ఇవ్వడం లేదు. పైకప్పు నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల వర్షపు నీరు ఇళ్లలోకి వస్తోంది.
పరిశీలించి చర్యలు తీసుకుంటాం - జ్ఞానేశ్వర్, మల్యాల మండల ఏఈ
రెండుపడక గదుల ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిశీలిస్తాం. వర్షపు నీటి చమ్మ ఇళ్లలోకి రాకుండా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండో రోజు నలుగురు నామినేషన్
[ 20-04-2024]
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు రెండో రోజు శుక్రవారం కేవలం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ స్థానం కోసం భాజపా అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఆ పార్టీ నాయకులు ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు. -
ఆర్ఎం కార్యాలయానికి ఆరుగురు ఉద్యోగుల సరెండర్
[ 20-04-2024]
హుజూరాబాద్ ఆర్టీసీ డిపోనకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్థానిక డిపోలో పనిచేసే డ్రైవర్ రవీందర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఈ నెల 15న అనిశా అధికారులకు చిక్కిన విషయం విదితమే. -
ఉక్కపోతతో తల్లీబిడ్డల ఉక్కిరిబిక్కిరి
[ 20-04-2024]
భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి. -
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరం
[ 20-04-2024]
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరమని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు అన్నారు. వారికి చికిత్స అందేలా చూడాలని శుక్రవారం కరీంనగర్లో ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి వినతిపత్రం అందజేశారు. -
గంగుల, బండిల స్నేహం అందరికీ తెలుసు
[ 20-04-2024]
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ల మధ్య స్నేహం అందరికీ తెలుసునని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను ఓడించేందుకు గంగుల కమలాకర్ భాజపాతో కుమ్మకైనట్లు ఆరోపించారు. -
వారసత్వ సంపద పరిరక్షణకు ఓటేద్దాం
[ 20-04-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. -
ఇదీ అన్నదాత ఎజెండా!
[ 20-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. భిన్న వ్యవసాయ ఉత్పత్తులతో రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. దేశ విదేశాలకు ఎగుమతి చేసే పసుపు, మామిడి, మొక్కజొన్న, సన్న వరి, చెరకు, ఆవాలు, ఎర్రజొన్న, తెల్లజొన్న, సజ్జ తదితర పంటల దిగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నా అన్నదాతను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. -
ఒక ఎంపీ.. అయిదు జిల్లాలు
[ 20-04-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది. -
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
[ 20-04-2024]
ఇటుక బట్టీ వద్ద నీటి తొట్టిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కుటుంబసభ్యులు పోలీసుల కథనం ప్రకారం.. -
శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి
[ 20-04-2024]
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థినులకు కరీంనగర్ కేజీబీవీలో నిర్వహిస్తున్న ఎప్సెట్ శిక్షణ తరగతులను సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి మల్లయ్య భట్టు శుక్రవారం సందర్శించారు. -
కరీంనగర్లో రూ.15.81 లక్షల పట్టివేత
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శుక్రవారం పోలీసులు కరీంనగర్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.15.81 లక్షల నగదును పట్టుకున్నట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది. -
ఇంటి నుంచే ఓటింగ్పై అధికారులకు శిక్షణ
[ 20-04-2024]
ఇంటినుంచే ఓటింగ్పై పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు మంథని శాసనసభ సెగ్మెంట్ అధికారి హనుమనాయక్ అవగాహన కల్పించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు శిక్షణ ఇచ్చారు. -
అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట
[ 20-04-2024]
ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం
[ 20-04-2024]
బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. -
కిట్టు సరే.. పరీక్ష చేసేవారేరీ?
[ 20-04-2024]
కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్కడక్కడ పైపులు పగిలి లీకేజీతో కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది. -
ఆరేళ్లుగా ఉపాధి కరవు
[ 20-04-2024]
వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాలకు పనులు కల్పించడం లేదు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. -
‘పసుపు బోర్డు పేరుతో మోసం’
[ 20-04-2024]
పసుపు బోర్డు పేరుతో ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.