నిధుల సద్వినియోగం.. అభివృద్ధి పథం
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగించుకంటూ పాలకుర్తి మండలంలోని ఎల్కలపల్లి గ్రామం అభివృద్ధిపథంలో ముందుకు సాగుతోంది. రామగుండం ఎన్టీపీసీ పునరావాస గ్రామం కావడంతో కొన్నేళ్లుగా ఎన్టీపీసీ యాజమాన్యం సామాజిక బాధ్యతలో భాగంగా సామాజిక భవనం, పాఠశాలకు అదనపు తరగతి గదులు, శుద్ద జలకేంద్రం, గ్రామంలో వీధి దీపాలతో పాటు వివిధ సదుపాయాలను కల్పించారు.
పునరావాస గ్రామంలో ప్రగతి కాంతులు
న్యూస్టుడే, ఎల్కలపల్లి ఫెర్టిలైజర్ సిటీ
పూర్తి కావచ్చిన స్వశక్తి మహిళా భవనం
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను సద్వినియోగించుకంటూ పాలకుర్తి మండలంలోని ఎల్కలపల్లి గ్రామం అభివృద్ధిపథంలో ముందుకు సాగుతోంది. రామగుండం ఎన్టీపీసీ పునరావాస గ్రామం కావడంతో కొన్నేళ్లుగా ఎన్టీపీసీ యాజమాన్యం సామాజిక బాధ్యతలో భాగంగా సామాజిక భవనం, పాఠశాలకు అదనపు తరగతి గదులు, శుద్ద జలకేంద్రం, గ్రామంలో వీధి దీపాలతో పాటు వివిధ సదుపాయాలను కల్పించారు. తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తూ గ్రామీణుల ఆరోగ్య సంరక్షణలో ఎన్టీపీసీ యాజమాన్యం చేదోడుగా నిలుస్తోంది. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణులు ఎదుర్కొంటున్న రహదారి సమస్య పరిష్కారానికి ఎన్టీపీసీ యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఇలా ఓవైపు ఎన్టీపీసీ యాజమాన్యం ఎల్కలపల్లి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుండగా మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్న నిధులతోను భవనాలు, రహదారుల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. కాలినడకకు సైతం ఇబ్బందిపడే ప్రాంతంలో సిమెంటు రహదారి నిర్మించడంతో ఆయా ప్రాంతవాసుల సమస్య పరిష్కారమైనట్లయింది.
రూ.కోటి నిధులతో పురోభివృద్ధి
డి.ఎం.ఎఫ్.టి., ఉపాధి హామీ పథకం తదితర నిధులు సుమారు రూ.కోటి వ్యయంతో గ్రామంలో పలు అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. రహదారుల నిర్మాణాలు దాదాపుగా పూర్తికాగా భవన నిర్మాణాలు సాగుతున్నాయి. డి.ఎం.ఎప్.టి. నిధులు రూ.18 లక్షలతో చింతల చెరువు సమీపంలో సామాజిక భవనం, రూ.5 లక్షలతో చింతల చెరువులో బతుకమ్మ ఘాట్, మరో రూ.18 లక్షలతో స్వశక్తి మహిళా భవన నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. బిల్లుల చెల్లింపులో జాప్యంతో కొద్దిపాటి పనులు నిలిచిపోగా వాటిని సైతం త్వరితగతిన పూర్తి చేయించేందుకు గ్రామ పంచాయతీ పాలకవర్గం, అధికారులు ప్రయత్నిస్తున్నారు. డి.ఎం.ఎఫ్.టి. నిధులు రూ.10 లక్షలతో అంగన్వాడీ పాఠశాల భవన నిర్మాణం పనులు చేపట్టగా స్లాబు పనులు పూర్తయి గోడలు నిర్మాణం చేస్తున్నారు. గ్రామంలో రెండు అంగన్వాడీ కేంద్రాలుండగా ఒకదానికి సొంత భవనం ఉండగా మరో దానికి లేకపోవడంతో స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నారు. తాజాగా మరో అంగన్వాడీ కేంద్రానికి సైతం సొంత భవన నిర్మాణం చేపడుతుండడంతో సమస్య పరిష్కారం కానుంది. సుమారు రూ.10 లక్షలతో చింతల చెరువు కట్ట మరమ్మతులు చేపట్టగా, మరో రూ.20 లక్షలతో గ్రామంలోని పలు ప్రాంతాల్లో సిమెంటు రహదారులు నిర్మించారు. ఉపాధి హామీ పథకం నిధులతో శ్మశాన వాటిక, చెత్త నిర్వహణ కేంద్రం, పలు ప్రాంతాల్లో మట్టి రోడ్ల నిర్మాణం చేపట్టారు. గ్రామ కూడళ్లలో హైమాస్టు లైట్లు ఏర్పాటు చేయడంతో గ్రామంలో వెలుగులు విరజిమ్ముతున్నాయి.
చింతల చెరువులో పూర్తయిన బతుకమ్మ ఘాఫట్ నిర్మాణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
నేటి నుంచి నామినేషన్లు షురూ!
[ 18-04-2024]
ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్తో అసలు అంకం షురూ అవనుంది. -
ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. -
కొప్పుల మొదటిసారి.. జీవన్ మూడోసారి
[ 18-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. -
క్లిక్ దూరంలో సమగ్ర సమాచారం
[ 18-04-2024]
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. -
రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం
[ 18-04-2024]
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. -
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. -
హాట్రిక్ విజేత..అరుదైన ఘనత
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. -
అక్కడ స్థానికేతరులే అధికం
[ 18-04-2024]
1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. -
వసతుల మెరుగుకు కార్యాచరణ
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. -
ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
[ 18-04-2024]
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. -
ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం
[ 18-04-2024]
నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్లు పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?
[ 18-04-2024]
గత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
-
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?