కిట్ సరే.. ప్రోత్సాహకమేదీ!
మాతా, శిశు మరణాలను అరికట్టి సర్కారు దవాఖానాల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స ప్రసవాలు తగ్గించడమే లక్ష్యంగా ‘అమ్మఒడి’లో భాగంగా గర్భిణులకు కేసీఆర్ కిట్ అందజేస్తోంది.
అమ్మఒడి నగదు సాయం పంపిణీలో జాప్యం
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి
పెద్దపల్లి ఎంసీహెచ్లో బాలింతకు కేసీఆర్ కిట్ అందజేస్తున్న ఎంపీపీ, అధికారులు
మాతా, శిశు మరణాలను అరికట్టి సర్కారు దవాఖానాల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల్లో శస్త్రచికిత్స ప్రసవాలు తగ్గించడమే లక్ష్యంగా ‘అమ్మఒడి’లో భాగంగా గర్భిణులకు కేసీఆర్ కిట్ అందజేస్తోంది. దీంతో పాటు మగ బిడ్డ పుడితే రూ.12 వేలు, ఆడపిల్ల పుడితే రూ.13 వేలను నాలుగు విడతల్లో మంజూరు చేస్తోంది. ఈ మేరకు గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డ పుట్టిన 6 నెలల వరకు విడతల వారీగా నగదు ప్రోత్సాహకాన్ని అందించాల్సి ఉంటుంది. కాగా ప్రభుత్వ ఆసుప్రతుల్లో ప్రసవం చేసుకున్న మహిళలకు ప్రోత్సాహకాలు అందించడంలో ఎడతెగని జాప్యం కనిపిస్తోంది. గతేడాది నుంచి పంపిణీ నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.
అమ్మఒడి పథకం కింద ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 10,606 మంది గర్భిణులు నమోదు చేసుకున్నారు. అందరికీ కలిపి దాదాపు రూ.30 లక్షల వరకు అందించాల్సి ఉండగా ఏ ఒక్కరికీ నగదు సాయం అందలేదు. కేవలం కేసీఆర్ కిట్లు మాత్రమే అందిస్తున్నారు. ప్రోత్సాహకం పంపిణీలో జాప్యంపై గ్రామాల్లో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలను లబ్ధిదారులు నిలదీస్తున్నారు. నగదు సాయం ఇంకెప్పుడిస్తారంటూ బాలింతలు, వారి కుటుంబసభ్యులు వైద్య సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు మాత్రం ప్రభుత్వం వద్ద నిధులు లేక జమ చేయడం లేదని చెబుతున్నారు.
ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణ
జిల్లాలో 18 గ్రామీణ, 6 అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి, గోదావరిఖని ప్రాంతీయ వైద్యశాల, సుల్తానాబాద్, మంథని సామాజిక ఆసుపత్రులున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు మొత్తం 10,606 ప్రసవాలు జరిగాయి. ఇందులో 4,300 సాధారణ, 6,306 శస్త్రచికిత్స ద్వారా నిర్వహించారు. అందరికీ కేసీఆర్ కిట్లు అందజేశారు. కేసీఆర్ కిట్ల పంపిణీతోనే ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా నగదు ప్రోత్సాహక పంపిణీలో జాప్యం జరుగుతుండటంతో పథకం లక్ష్యానికి విఘాతం కలుగుతోంది. సుదూర ప్రాంతాల నుంచి ప్రసవం కోసం ప్రభుత్వాసుపత్రులకు వచ్చిన వారు తమ ఖాతాలో డబ్బులు జమ కాలేదంటూ ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఖజనాలో నిధులు లేకపోవడంతో ఇప్పట్లో వీరికి నగదు ప్రోత్సాహకం అందేలా కనిపించడం లేదు.
ఏడాదిగా తిరుగుతున్నా : ఆకుల సరిత, కమాన్పూర్
సంవత్సర కాలంగా ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నా. ప్రసవానంతరం కేసీఆర్ కిట్ తప్ప నగదు సాయం ఇప్పటివరకు రాలేదు. ప్రోత్సాహకం కోసం వస్తే రేపు, మాపు అంటూ వాయిదా వేస్తున్నారే తప్ప ఎప్పుడు ఖాతాలో వేస్తారో ఆసుపత్రి సిబ్బంది చెప్పడం లేదు.
నిధులు లేకనే ఈ పరిస్థితి : ప్రమోద్కుమార్, జిల్లా వైద్యాధికారి
ప్రభుత్వం అందించే నగదు ప్రోత్సాహకాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలోనే జమ చేస్తోంది. నిధులు లేకపోవడంతోనే అందడం లేదు. కేసీఆర్ కిట్లకు కొరత లేదు. నిధులు రాగానే నగదు జమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు