పాఠకులకు చేరువగా మరిన్ని సేవలు
పుస్తక నిలయాలైన గ్రంథాలయాల్ని ఆధునిక బాట పట్టిస్తానని.. ఏళ్లతరబడి వెంటాడుతున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తానని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఛైర్మన్గా బాధ్యతల్ని స్వీకరించిన ఆయన ‘ఈనాడు - ముఖాముఖి’లో పలు విషయాల్ని వెల్లడించారు.
జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ అనిల్కుమార్గౌడ్
పుస్తక నిలయాలైన గ్రంథాలయాల్ని ఆధునిక బాట పట్టిస్తానని.. ఏళ్లతరబడి వెంటాడుతున్న సమస్యలను ఒక్కోటిగా పరిష్కరిస్తానని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ పొన్నం అనిల్కుమార్గౌడ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఛైర్మన్గా బాధ్యతల్ని స్వీకరించిన ఆయన ‘ఈనాడు - ముఖాముఖి’లో పలు విషయాల్ని వెల్లడించారు. ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చే యువతకు అన్ని రకాల కొలువులకు ఉపయుక్తమైన సమాచారంతో కూడిన పుస్తకాలన్నింటిని అందుబాటులో ఉంచుతానని.. మొక్కుబడిగా మారుతున్న సేవల్లో మంచి మార్పులను తీసుకొస్తానంటున్న తీరు ఛైర్మన్ మాటల్లోనే...
ఆధునికీకరణ దిశగా..
యువత సహా అన్ని వర్గాలను చైతన్యపరిచే వాటిలో గ్రంథాలయాల పాత్ర కీలకం. జిల్లాలో ఉన్న 13 పఠనాలయాల్లో వసతులు, సౌలభ్యాల కల్పనలో మంచి మార్పుని తీసుకొచ్చేలా నా మొదటి ప్రాధాన్యం చేతల్లో చూపిస్తాను. ప్రాభవాన్ని కోల్పోతున్నాయనే విమర్శల నుంచి సరికొత్త వైభవం అందించేలా నా వంతు చొరవను చూపిస్తాను. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్కుమార్, మేయర్ సునీల్రావు సహకారంతోపాటు మంత్రి కేటీఆర్ దృష్టికి ఇప్పుడున్న సమస్యల్ని తీసుకెళ్లి పరిష్కరించేలా మెరుగైన ప్రగతిని పనితీరుతో చూపిస్తాను. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని ఆధునికీకరించే దిశగా పనులు త్వరలో ప్రారంభమవనున్నాయి. స్మార్ట్సిటీ నిధులు రూ.7కోట్లతో బహుళ అంతస్తుల్లో భవనం నిర్మించనున్నాం. తాత్కాలికంగా చదువరులకు ఇబ్బంది కావద్దనేలా రూ.50లక్షలతో షెడ్డుని ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా ఇక్కడ పఠనాలయాన్ని పక్కకు కొనసాగిస్తాం. పలుచోట్ల నిర్మాణ దశలో ఉన్న భవనాలను వీలైనంత తొందరగా అందుబాటులోకి తెస్తాం. ఖాళీగా ఉన్న పోస్ట్ల భర్తీకి అవసరమైన ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి పంపి ఇన్నాళ్ల ఇక్కట్లను తీర్చేలా ప్రత్యేక దృష్టి పెడతాను.
పోటీ పరీక్షలకు..
ఉద్యమ సమయం నుంచి ఒక యువకుడిగా, నిరుద్యోగిగా నాకు పుస్తకాల విలువ తెలుసు. పేద కుటుంబాలకు చెందిన వారే గ్రంథాలయాలకు వస్తారు. వారికి ఉపయోగపడే పోటీపరీక్షల పుస్తకాలన్నింటిని తెప్పిస్తాను. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 75,736 పుస్తకాలున్నాయి. వీటి సంఖ్యను రెండింతలుగా పెంచుతాను. 20,777 ఆంగ్ల పుస్తకాల్లో మరిన్ని కొత్తవి తేవాల్సిన అవసరముంది. 8,467 హిందీ, 4,434 ఉర్దూ, 225 సంస్కృత పుస్తకాలున్నాయి. పాత పుస్తకాల స్థానంలో కొత్తవాటి సంఖ్య పెంచాల్సి ఉంది. ఏ తరహా పుస్తకాలవసరమనేది గుర్తించి ఇక్కడికి నిత్యం చదువుకునేందుకు వస్తున్న సుమారు 400 మందికి అందించేలా చూస్తాను. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రభుత్వ కొలువులకు నోటిఫికేషన్లు వెలువడుతున్న దృష్ట్యా దాతల సహకారంతో ఉచిత శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పేలా అవసరమైన ప్రణాళికను రూపొందిస్తాం. ముఖ్యుల సలహాలు సూచనలతో అన్ని రకాల పుస్తకాలు ప్రతి పఠనాలయంలో ఉండేలా చూస్తాను. గ్రామ గ్రంథాలయాలు, పుస్తకాలు నిల్వ చేసేందుకు గతంలో ఏర్పాటు చేసిన కేంద్రాల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకుని వాటి సంఖ్యను పెంచేలా చూస్తాను.
ఈ- లైబ్రరీ..
ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఉన్న కంప్యూటర్ల వినియోగాన్ని మరింతగా పెంచుతూ ఇక్కడికి వచ్చే వారికి అంతర్జాల సేవలతో కూడిన విజ్ఞానం అందించే విషయమై దృష్టిసారిస్తాను. ప్రస్తుతం సమాచార విజ్ఞానాన్ని చరవాణిల్లోనే వెతుకుతున్న దృష్ట్యా ఎలాంటి సేవలు ఈ- లైబ్రరీ రూపంలో అందితే బాగుంటుందనే సలహాల్ని నిపుణుల నుంచి తీసుకుంటాను. అయిదేళ్ల కిందట రాష్ట్ర వ్యాప్తంగా పాఠకుల సౌకర్యార్థం ఈ- లైబ్రరీని ఏర్పాటు చేయాలని నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించారు. డీఈఎఫ్( డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్) చొరవతో మార్పునకు ప్రయత్నించారు. అదే తరహాలో జిల్లాలో అంతర్జాలం సహా కంప్యూటర్ పరిజ్ఞానం పరంగా ఏ తరహా సేవలు యువతకు చేరువ చేస్తే బాగుంటుందనే విషయమై ముఖ్యుల సూచనలతో త్వరలోనే మంచి నిర్ణయాన్ని తీసుకుంటాను. సిబ్బంది సమయపాలన సహా అన్నిచోట్ల మెరుగైన సేవలు అందేలా ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత