పూల సింగిడి..సద్దుల సందడి
పుడమిపై పూల పుంత చెంతనే ఉన్నట్లు.. అంబరాన్నంటిన సద్దుల సంబురం.. తీరొక్క పువ్వు మురిసేలా సాగింది. ఆడపడుచుల పెదాలపై నాట్యమాడిన పాటలు.. పరిమళాలు వెదలజల్లిన బతుకమ్మలు.. గునుగు పూల గుసగుసలు.. తంగేడు పూల తళుకులు.. అతివల గాజుల చప్పట్ల మోతలు.. ఇలా అన్ని కలిసిన వైభవం జిల్లాలో పెద్ద బతుకమ్మ పండుగ రూపంలో ఘనంగా ముగిసింది.
మహిళల ఆటాపాటలు
ఘనంగా ముగిసిన బతుకమ్మ పండుగ
- ఈనాడు కరీంనగర్, కరీంనగర్ సాంస్కృతికం
పుడమిపై పూల పుంత చెంతనే ఉన్నట్లు.. అంబరాన్నంటిన సద్దుల సంబురం.. తీరొక్క పువ్వు మురిసేలా సాగింది. ఆడపడుచుల పెదాలపై నాట్యమాడిన పాటలు.. పరిమళాలు వెదలజల్లిన బతుకమ్మలు.. గునుగు పూల గుసగుసలు.. తంగేడు పూల తళుకులు.. అతివల గాజుల చప్పట్ల మోతలు.. ఇలా అన్ని కలిసిన వైభవం జిల్లాలో పెద్ద బతుకమ్మ పండుగ రూపంలో ఘనంగా ముగిసింది. ప్రకృతి ఒడిలో పూసిన విరుల జాతరను ఊరూవాడల్లో సోమవారం అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు. పల్లె, పట్టణాల్లోని వాకిళ్లన్ని మురిసేలా.. సంప్రదాయ వేడుకకు వన్నె తెచ్చేలా మహిళలంతా ఒకచోట గుమిగూడి ఉయ్యాల పాటలతో కొత్త శోభను అద్దారు. ఎక్కడ చూసినా సింగిడిల మురిపమే కనిపించింది. డప్పుల దరువుల మధ్యన చెరువుల చెంతకు చేరిన బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు. ‘వెళ్లిరా బతుకమ్మ.. వచ్చే ఏడాది మళ్లీ రావమ్మా..’అంటూ బతుకమ్మను ఆడబిడ్డలు ఘనంగా సాగనంపారు. వాయినాలను ఇచ్చి పుచ్చుకొని ఇంటి బాట పట్టారు.
నగరంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్రావులు రమాసత్యనారాయణ ఆలయం, సీతారాంపూర్, రాంనగర్ మార్క్ఫెడ్ మైదానం, లేక్ పోలీసుస్టేషన్, గౌతమినగర్, హనుమాన్నగర్ ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొని అనంతరం నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాశక్తి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్కుమార్ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. రాంనగర్లో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి, హరిశంకర్ల ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని అన్ని బతుకమ్మ కూడళ్లలో రంగులు వేయించారు. పెద్ద ఎత్తున మహిళలు ఇక్కడికి తరలివచ్చి బతుకమ్మ ఆడారు. గంజ్, టవర్ సర్కిల్లో పెద్ద పెద్ద బతుకమ్మలు వైవిధ్యభరితంగా ఉండటంతో వందలాది మంది వాటిని వీక్షించి తరించారు. మహాశక్తి, రాంనగర్ రమాసత్యనారాయణస్వామి ఆలయం ప్రాంగణానికి పెద్ద ఎత్తున ఆడపడుచులు, మహిళలు తరలివచ్చి బతుకమ్మ వేడుకలతో మురిసిపోయారు. భగత్నగర్ శివాలయం ప్రాంగణం, జ్యోతినగర్, రాంచంద్రాపురికాలనీ, కోతి రాంపూర్, మంకమ్మతోట, కట్ట రాంపూర్, సంతోష్నగర్, సూర్యనగర్, భాగ్యనగర్, విద్యానగర్, ఆదర్శనగర్, హౌజింగ్బోర్డు కాలనీ, సప్తగిరికాలనీ, శ్రీనగర్ కాలనీలో గుంపులుగా మహిళలు బతుకమ్మలను ఎత్తుకొని కూడళ్లకు చేరుకొని రాత్రి 9 గంటల వరకు ఆటపాటలతో సందడి చేశారు. పద్మనాయక కల్యాణమండపంలో జువ్వాడి మనోహర్రావు, కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మానేరు డ్యాం, మానకొండూరు చెరువు వద్ద నిమజ్జనం చేశారు.
పద్మనాయక కల్యాణమండపంలో వేడుకలు
హుజూరాబాద్లో..
బతుకమ్మతో ఎంపీ బండి సంజయ్కుమార్ దంపతులు
బతుకమ్మను నిమజ్జనం చేస్తున్న మంత్రి గంగుల, నారదాసు
బతుకమ్మ పేరుస్తున్న మంత్రి కొప్పుల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్