చిత్ర వార్తలు
రూరల్ మండలం నగునూరులోని శ్రీదుర్గాభవాని ఆలయంలో దుర్గాభవాని నవరాత్రుల్లో భాగంగా సోమవారం అమ్మవారు దుర్గామాత అలంకరణలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు పవనకృష్ణశర్మ అమ్మవారికి విశేష హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సింహ వాహనంపై దుర్గాభవాని అమ్మవారు
నగునూరు(కరీంనగర్ గ్రామీణం), న్యూస్టుడే: రూరల్ మండలం నగునూరులోని శ్రీదుర్గాభవాని ఆలయంలో దుర్గాభవాని నవరాత్రుల్లో భాగంగా సోమవారం అమ్మవారు దుర్గామాత అలంకరణలో సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు పవనకృష్ణశర్మ అమ్మవారికి విశేష హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు
దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఫెర్టిలైజర్ సిటీలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రుద్ర చండీ హోమం నిర్వహించారు. అమ్మవారిని దుర్గాదేవి రూపంలో అలంకరించారు. ఆలయ పూజారి కర్నె అశోక్శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. - న్యూస్టుడే, ఫెర్టిలైజర్ సిటీ
సింహ వాహనంపై శ్రీవారు
కోరుట్ల పట్టణంలోని పురాతన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి సింహ వాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. పూజారి బీర్నంది నర్సింహాచారి ఆధ్వర్యంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి కొలిచారు. ప్రత్యేక రథంపై స్వామివారిని పట్టణంలోని పురవీధుల్లో శోభాయాత్ర చేపట్టారు. - న్యూస్టుడే, కోరుట్ల
మహాగౌరి రూపం.. కుమారిపూజ
జగిత్యాల పట్టణంలో శరన్నవరాతులు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. సేవాసమితులు, భక్త బృందాల ఆధ్వర్యంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కనకదుర్గ సేవాసమితి ఆధ్వర్యంలో అమ్మవారు మహాగౌరి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. సామూహిక కుమారిపూజ, అభిషేకం, నక్షత్ర హారతి, చండీ హవనం కార్యక్రమంలో భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.- న్యూస్టుడే, జగిత్యాల విద్యానగర్
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రధాన ఆలయంతో పాటు శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాగౌరీ రూపంలో అమ్మవారిని అలంకరించగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈఓ సంకటాల శ్రీనివాస్, ఇందారపు రామయ్య, సభ్యులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు. దేవస్థానంలో సోమవారం రాత్రి నంది వాహనంపై శ్రీ రామలింగేశ్వరస్వామి వారి సేవను ఊరేగించారు. రాత్రి 8 గంటలకు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు శ్రీ రామలింగేశ్వరస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నంది వాహనంపై ఆసీనులను చేశారు. - న్యూస్టుడే, ధర్మపురి
రహదారి ఆక్రమణ.. వాహనదారుల తంటాలు
గోదావరిఖని అడ్డగుంటపల్లి నుంచి ఇందిరానగర్, గౌతమినగర్, మార్కండేయకాలనీ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా కంకరతో నింపడంతో అటుగా వెళ్లాల్సిన వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భవన నిర్మాణదారులు మూడు రోజులుగా ఇలాగే రోడ్డుపై వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. - న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు