logo

మల్లికార్జునస్వామి ఆశీస్సులతోనే ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చిత్రం విజయవంతం

శ్రీమల్లికార్జునస్వామి ఆశీస్సులతోనే ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చలనచిత్రం విజయవంతమైందని  ఓదెలలో దర్శకులు సంపత్‌నంది, అశోక్‌తేజ, నటుడు వశిష్ఠ ఎన్‌ సింహా  చెప్పారు. ఓదెలలో మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సహజత్వం

Published : 05 Oct 2022 05:16 IST

మాట్లాడుతున్న దర్శకులు సంపత్‌నంది, అశోక్‌తేజ

ఓదెల, న్యూస్‌టుడే: శ్రీమల్లికార్జునస్వామి ఆశీస్సులతోనే ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చలనచిత్రం విజయవంతమైందని  ఓదెలలో దర్శకులు సంపత్‌నంది, అశోక్‌తేజ, నటుడు వశిష్ఠ ఎన్‌ సింహా  చెప్పారు. ఓదెలలో మంగళవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సహజత్వం ఉట్టిపడేలా ‘ఓదెల రైల్వే స్టేషన్‌’ క్రైమ్‌ థ్రిల్లర్‌ చలన చిత్రాన్ని కొద్ది నెలల కిందట ఓదెలతో పాటు, పొత్కపల్లి  పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించి ఆగస్టు 26న ఓటీటీ వేదికగా విడుదల చేశామన్నారు.   రాబోవు రోజుల్లో అందరికీ నచ్చేలా మరిన్ని చలన చిత్రాలు చిత్రీకరించి  ఆదరాభిమానాలు పొందేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతకుముందు చిత్రం బృందం మల్లికార్జునస్వామి, శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ధర్మకర్తలు చిత్ర బృందాన్ని సన్మానించారు. కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ టి.కరుణాకర్‌రావు, స్థానిక నాయకులు ఆకుల మహేందర్‌, బోడకుంట చిన్నస్వామి, అల్లెంకి శేషుమూర్తి, గడిగొప్పుల సంతోష్‌, చింతం వెంకటస్వామి, మ్యాడగోని శ్రీకాంత్‌, పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని