ప్రభుత్వ కళాశాలలు.. సమస్యలకు నిలయాలు
మెరుగైన విద్యతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం విద్యార్థులకు అవసరం.. బీర్పూర్, సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆయా కళాశాలలో దాదాపు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
మెట్ల కింద తరగతి నిర్వహిస్తున్న దృశ్యం
న్యూస్టుడే, సారంగాపూర్: మెరుగైన విద్యతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణం విద్యార్థులకు అవసరం.. బీర్పూర్, సారంగాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీస వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఆయా కళాశాలలో దాదాపు 600 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో బీర్పూర్లో 380, సారంగాపూర్లో 210 మంది తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో సగానికి పైగా బాలికలు ఉన్నారు. ఏటా ఫలితాల్లో జిల్లాల్లో ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ సమస్యలతో సతమతమవుతున్నారు.
పరికరాలు బీరువాలకు పరిమితం
కళాశాలలో ప్రయోగ పరికరాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించేందుకు ప్రత్యేక గది లేదు. దీంతో విలువైన పరికరాలు బీరువాలకే పరిమితం అవుతున్నాయి. విద్యార్థులకు సైతం ప్రయోగాలపై కనీస పరిజ్ఞానం ఉండటం లేదు. దీని కోసం గది నిర్మించాలని కోరుతున్నారు. గ్రంథాలయం లేకపోవడంతో విద్యార్థులకు పుస్తకపఠనంపై అవగాహన కొరవడుతోంది. చివరకు విద్యార్థులే వారి సొంత డబ్బులు, ఉపాధ్యాయుల సహకారంతో సమస్యల్ని తాత్కాలికంగా తీర్చుకుంటున్నారు.
బస్సు రాకపోవడంతో ఇబ్బందులు
ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వివిధ పరిసర గ్రామాల నుంచి విద్యార్థులు రావాలంటే బస్సుపై ఆధారపడాల్సిందే. అయితే వేళకు బస్సు రాకపోవడం, సాయంత్రం సమయంలో ఇంటికి వెళ్లడం ఇబ్బందిగా మారడంతో విద్యార్థులు కళాశాలకు రావడంలేదు. ఇది విద్యార్థుల హాజరు శాతంపై కూడా ప్రభావం చూపుతోంది. అధికారులు స్పందించి వేళకు బస్సు సౌకర్యాన్ని కల్పించాలని కోరుతున్నారు.
గ్రంథాలయం లేక తరగతిలోనే మూలన పడేసిన పుస్తకాలు
తరగతి గదుల కొరత
సారంగాపూర్ కళాశాలలో తరగతి గదులు కొరత ప్రధాన సమస్యగా మారింది. మూడు కోర్సుల్ని తెలుగు, ఆంగ్ల మ్యామాల్లో నిర్వహిస్తుండగా కేవలం ఆరు గదులు ఉన్నాయి. ఇందులో ఒక్కో తరగతిగదిలో గ్రంథాలయం, ప్రయోగశాల, శుద్ధజల కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా అధ్యాపకుల స్టాఫ్ రూమ్, మెట్ల కింద కూడా తరగతులు నిర్వహిస్తున్నారు. బీర్పూర్లో తరగతి గదులు ఉన్నప్పటికీ కింద గచ్చు చేయకపోవడంతో దుమ్ముతోపాటు వర్షం పడితే గదిలోకి నీరు వచ్చి చేరుతున్నాయి. బీర్పూర్లో ప్రహరీ లేకపోవడంతో ఏటా నాటిన మొక్కల్ని పశువులు పాడుచేస్తున్నాయి.
గ్రంథాలయాన్ని అందుబాటులోకి తేవాలి - శివంతి, విద్యార్థిని
గ్రంథాలయానికి ప్రత్యేక గది లేకపోవడం వల్ల పుస్తకాలకు దూరమవుతున్నాం. తరగతి గదికే పరిమితం అవ్వడం వల్ల ఇతర అంశాలపై అవగాహన ఉండటం లేదు. ఈ ఏడాదికి సంబంధించి కొత్త పాఠ్యపుస్తకాలు రాలేదు. దీంతో పాత పుస్తకాలనే చదవాల్సి వస్తోంది. వివిధ గ్రామాల నుంచి వచ్చి వెళ్లడం ఆలస్యం అవుతుండటం వల్ల కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి.
మెట్లకింద బోధన -వేణు, ఇన్ఛార్జి ప్రిన్సిపల్, సారంగాపూర్
కళాశాలలో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కనీసం తరగతి గదులు లేక అధ్యాపకుల విశ్రాంత గది, మెట్ల కింద బోధన చేయాల్సిన పరిస్థితి. ప్రయోగాలకు ప్రత్యేక గదులు లేకపోవడంతో పరికరాలు బీరువాల్లోనే పెడుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!