ఇచ్చిందే తిను.. పెట్టిందే మెనూ..!
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందించే ఆహారంలో నాణ్యతతో పాటు మెనూ పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రిలో దుస్థితి
పట్టించుకోని వైద్యబృందం
న్యూస్టుడే, కరీంనగర్ సంక్షేమ విభాగం
జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి, మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందించే ఆహారంలో నాణ్యతతో పాటు మెనూ పాటించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మెనూలో ఒకటి ఉంటే మరొకటి అందిస్తున్నారు. ఆసుపత్రిలో అందించే అన్నం కంటే బయట దాతల సహాయంతో అందిస్తున్న అన్నం బాగుంటుందని రోగుల బంధువులు చెబుతున్నారు. పలువురు సర్కారు దావాఖానాలో ఇలానే ఉంటుందనగా మరికొందరు ఆసుపత్రి ఆవరణలో నిర్వహిస్తున్న అన్నదాన కేంద్రం నుంచి భోజనాన్ని తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. సర్కారు దవాఖానాలో రోగులకు అందిస్తున్న ఆహారంపై ‘న్యూస్టుడే’ బుధవారం పరిశీలన చేయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ప్రతి రోగికి వైద్య సిబ్బంది సూచన మేరకు శస్త్రచికిత్స జరిగిన రోగులు, సాధారణ రోగులకు ఆహారం అందించాలి. శస్త్రచికిత్స జరిగిన వారికి మూడు రోజుల వరకు పాలు, బ్రెడ్డు, ఇడ్లి, ఉప్మా అందించాలి. సాధారణ రోగులకు రెండు పూటలా సన్న బియ్యంతో అన్నం, ఒక ఆకుకూర, ఒక కూరగాయ, సాంబార్, ఒక కోడిగుడ్డు, ఒక సీజనల్ పండు, ఒక కప్పు పెరుగు అందించాలి. కాగా బుధవారం కేవలం రెండు కూరలు ఇచ్చారు. ఆకుకూర లేదు. పాలు, బ్రెడ్డు, ఒక కోడిగుడ్డు, ఒక అరటిపండు అందించారు. అందులో వంకాయటమాట కూర కొంతవరకు బాగానే ఉన్నా పప్పు మొత్తం పలచగా ఉంది. ఇక పాల విషయానికి వస్తే నీళ్లలో పాలు కలిపారా? పాలల్లో నీళ్లు కలిపారా ? అన్న సందేహం తలెత్తుతోంది. బ్రెడ్డు గట్టిగా ఉంది. సీజనల్ పండుకు బదులు ఎప్పుడూ అరటిపండునే అందిస్తున్నారు. బీపీటీ బియ్యంతో అన్నం వడ్డిస్తున్నామని చెబుతున్నా అన్నం దొడ్డుగా ఉంటుంది. కప్పు పెరుగుకు బదులు మజ్జిగ ఇస్తున్నారు. సాంబారు కనిపించేనే లేదు.
అన్నం కోసం వరుసలో నిల్చున్న బాలింతల బంధువులు
బాలింతలకు తప్పని ఇబ్బందులు
జిల్లా మాతా, శిశు ఆరోగ్య కేంద్రంలో గర్భిణులు, బాలింతలు ఉంటారు. వారికి ఆహారం విషయంలో వైద్య సిబ్బంది అవగాహన కల్పించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. బాలింతలకు కూరలు అందిస్తున్నప్పటికీ కారం, పచ్చడితో తింటున్నారు. ఆసుపత్రిలో కందిపప్పు, వంకాయ టమాట కూర అందిస్తున్నారు. కందిపప్పు అని తెలియకపోవడంతో పెసరుపప్పు అని తినడం మానేశారు. వంకాయతో ఎలర్జీలు వస్తాయని భయపడి కారం, పచ్చడితో తింటున్నారు. కూరల విషయంలో బాలింతలకు అవగాహన కల్పించాలి. అక్కడ పూర్థిస్తాయి అధికారి పర్యవేక్షణ లేకపోవడంతో ఇచ్చిందే మెనూగా కొనసాగుతోంది.
కారం, పచ్చడితో భోజనం చేస్తున్న బాలింత
పరిశీలించి చర్యలు తీసుకుంటాం
-రత్నమాల, ఆస్పత్రి సూపరింటెండెంట్
ప్రతి రోగికి మెనూ కోసం రోజుకు రూ.100 చెల్లిస్తున్నాం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?