సరఫరా సమస్యలకు త్వరితగతిన పరిష్కారం
‘మంథని డివిజన్లో వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం.
ఆధునిక పరికరాలతో బిల్లు రీడింగ్
డీఈఈ గంగారామ్
న్యూస్టుడే, మంథని గ్రామీణం
‘మంథని డివిజన్లో వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా, విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నాం. వరదలతో దెబ్బతిన్న నియంత్రికలు, స్తంభాల బిగింపు పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నాం. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ నాణ్యమైన విద్యుత్తును అందించడానికి చర్యలు చేపట్టాం’ అని ఎన్పీడీసీఎల్ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(డీఈఈ) గంగారామ్ తెలిపారు. డివిజన్లో విద్యుత్తు సరఫరాకు సంబంధించి సమస్యలపై ఆయన ‘న్యూస్టుడే’కు ఇచ్చిన ముఖాముఖిలో వివరించారు.
ఈ ఏడాది గోదావరి వరదలతో దెబ్బతిన్న విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాల పునరుద్ధరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇలాగైతే యాసంగి సాగుకు ఇబ్బందులు ఎదురవుతాయి కదా!
గోదావరి వరదలతో దెబ్బతిన్న ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాం. డివిజన్లో 33 కేవీ స్తంభాలు 8, 11 కేవీ స్తంభాలు 494, ఎల్టీ స్తంభాలు 692, ట్రాన్స్ఫార్మర్లు 537 దెబ్బతిన్నాయి. రైతులు ఇబ్బందులు పడకుండా వాటిని తిరిగి బిగించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తాం.
వ్యవసాయ అవసరాలకు వినియోగించే ట్రాన్స్ఫార్మర్లు పాడయితే మరమ్మతుకు తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఏటా రైతులు నష్టపోతున్నారు.
పాడయిన ట్రాన్స్ఫార్మర్లకు మరమ్మతు చేసి 48 గంటల్లో తిరిగి బిగిస్తున్నాం. అయితే ట్రాన్స్ఫార్మరు మరమ్మతు కేంద్రం నుంచి గమ్యం చేరడానికి రవాణా సౌకర్యం అందుబాటులో లేని సందర్భంలో కొంత జాప్యం జరుగుతోంది.
విద్యుత్తు బిల్లులకు రీడింగ్ను సకాలంలో తీసుకోకపోవడంతో, స్లాబ్ మారి అధిక బిల్లులు వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యను అధిగమించలేరా?
రీడింగ్ తీయడంలో రెండు మూడు రోజులు ఆలస్యం జరిగినా బిల్లు ఎక్కువగా రాదు. రీడింగ్ నమోదుకు నవంబరు నుంచి అండ్రాయిడ్ యంత్రాలను వినియోగిస్తూ 17వ తేదీలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నాం. మంథని డివిజన్లో ప్రస్తుతం 27 అండ్రాయిడ్ పరికరాలతో రీడింగ్ నమోదు చేస్తున్నాం.
బేగంపేట ఉపకేంద్రం పరిధిలో ఒక ప్రాంతంలో విద్యుత్తు సమస్య తలెత్తితే సరి చేయడానికి మొత్తం ప్రాంతానికి సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో వినియోగదారులు అసౌకర్యానికి గురవుతున్నారు.
సమస్య ఉన్న ప్రాంతానికే విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నాం. ఉపకేంద్రం మొత్తానికి నిలిపివేస్తే సంస్థకే నష్టం జరుగుతోంది. అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం.
వ్యవసాయానికి కేవలం తొమ్మిది గంటలు మాత్రమే సరఫరా చేస్తున్నారు. అందులోనూ తరచూ అంతరాయం కలుగుతుందనే ఆరోపణలున్నాయి.
ప్రభుత్వ ఆదేశాల మేరకు గృహావసరాలకు 24 గంటల పాటు నిరంతర సరఫరా అందిస్తున్నాం. వ్యవసాయ అవసరాలకు సాయంత్రం 4.45 గం.ల నుంచి ఉదయం 4 గంటల వరకు సరఫరా చేస్తున్నాం. పంట కోతల సమయంలో కరెంటు అవసరం ఉండదు గనకే అంతరాయం ఉంటుంది. అదనులో ఎలాంటి ఇబ్బందులుండవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
నేటి నుంచి నామినేషన్లు షురూ!
[ 18-04-2024]
ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్తో అసలు అంకం షురూ అవనుంది. -
ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. -
కొప్పుల మొదటిసారి.. జీవన్ మూడోసారి
[ 18-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. -
క్లిక్ దూరంలో సమగ్ర సమాచారం
[ 18-04-2024]
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. -
రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం
[ 18-04-2024]
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. -
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. -
హాట్రిక్ విజేత..అరుదైన ఘనత
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. -
అక్కడ స్థానికేతరులే అధికం
[ 18-04-2024]
1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. -
వసతుల మెరుగుకు కార్యాచరణ
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. -
ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
[ 18-04-2024]
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. -
ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం
[ 18-04-2024]
నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్లు పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?
[ 18-04-2024]
గత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం