పనితీరుకు పరీక్షలు
దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రంలోని గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కృషి చేస్తోంది.
నగరాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం పోటీలు
ప్రజాభిప్రాయ సేకరణకే ప్రాధాన్యం
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం
అభివృద్ధికి నోచుకోని ఓ ప్రధాన రహదారి
దేశవ్యాప్తంగా పట్టణాలు, నగరాల సర్వతోముఖాభివృద్ధికి కేంద్రంలోని గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కృషి చేస్తోంది. స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో నగరాలు, పట్టణాలను చెత్త రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేలా ఎనిమిదేళ్లుగా పోటీలు నిర్వహిస్తూ ర్యాంకులు ప్రకటిస్తున్న కేంద్రం.. తాజాగా మౌలిక వసతులపై కల్పనకు ప్రాధాన్యం ఇస్తోంది.
బహిరంగ మల, మూత్ర విసర్జన రహితం, చెత్త నుంచి సంపాదన లక్ష్యంతో కేంద్రం ‘స్వచ్ఛ సర్వేక్షన్’ పోటీలు నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికలు ఆరేళ్లుగా ఈ పోటీలో పాల్గొంటున్నాయి. కరీంనగర్ నగరపాలిక ర్యాంకు 2021లో 74 కాగా, 2022లో కాస్త మెరుగుపడి 67వ ర్యాంకులో నిలిచింది. రామగుండం నగరపాలిక 2021లో 93వ ర్యాంకులో ఉండగా 2022లో చెత్త నిర్వహణపై నగరపాలిక నిర్లక్ష్యానికి నిదర్శనంగా 136వ ర్యాంకునకు పడిపోయింది. ప్రజాభిప్రాయ సేకరణ, చెత్త సేకరణ, నిర్వహణ, బహిరంగ మలమూత్ర విసర్జన రహితం, చెత్త రహిత నగరం, వాటర్ ప్లస్ తదితర అంశాల ఆధారంగా కేంద్రం మార్కులు కేటాయిస్తున్న నేపథ్యంలో 2023లోనైనా మెరుగైన ర్యాంకులు సాధించడానికి పురపాలికలు తగిన ప్రణాళికలు అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
యంత్రంతో భూగర్భ కాలువలో మురుగు తొలగిస్తున్న కార్మికుడు
సదుపాయాలపై దృష్టి
దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లోని ఆర్థిక, సామాజిక, విద్య, వైద్య, రవాణా, రక్షణ, ట్రాఫిక్, చెత్త నిర్వహణ, నీటి సదుపాయం, మురుగు నిర్వహణ, గృహ నిర్మాణం, పర్యావరణం, ప్రణాళిక తదితర సదుపాయాలపై ‘అర్భన్ ఔట్కమ్స్ ప్రేమ్వర్క్సు’ దృష్టి సారిస్తోంది. ఇప్పటికే ఆయా నగరాలు, పట్టణాలకు సంబంధించిన వివిధ అంశాలపై మూడేళ్ల సమాచారాన్ని ఇప్పటికే కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని కేంద్రం ఆయా నగరాలు, పట్టణాల పురోగతిని అంచనా వేస్తుంది. ప్రజల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యం ఉండనుండగా ‘ఈజీ ఆఫ్ లివింగ్’లో ప్రజలు ఇవ్వాల్సిన సమాచారంపై పాలకవర్గం, అధికారులు విస్తృతంగా ప్రచారం చేపట్టాల్సి ఉంది. వెబ్సైట్లో లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అందులో అడిగే 17 ప్రశ్నలకు ప్రజలు 1 నుంచి 5 వరకు రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈజీ ఆఫ్ లివింగ్పై గోడలపై రాతలు, హోర్డింగ్ల ఏర్పాటు, ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడం, పత్రికల్లో కథనాలు, అవగాహన సదస్సులకు వేర్వేరుగా 100 మార్కులు ఉంటాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని ఐదు విభాగాల్లో ఉత్తమ నగరాలు, పట్టణాలకు కేంద్రం అవార్డులను ప్రకటించనుంది.
రమేశ్నగర్ కూడలిలో పేరుకుపోయిన చెత్త
మురుగు నిర్వహణే కీలకం
అండర్ డ్రైనేజీ నిర్వహణలో కార్మికులకు బదులుగా అత్యాధునిక యంత్రాలను వినియోగించాలనే లక్ష్యంతో ‘మ్యాన్ హోల్ టు మిషన్ హోల్’ నినాదంతో కేంద్రం ‘సఫాయి మిత్ర సురక్షా ఛాలెంజ్’ కార్యక్రమాన్ని మూడు విభాగాల్లో చేపట్టింది. రాయితీపై యంత్రాలను ఇప్పించడం, వాటి వినియోగం, పారిశుద్ధ్య కార్మికుల రక్షణ చర్యలు ఇందులో కీలకం. ప్రజల ఫిర్యాదులపై టోల్ఫ్రీ నంబరు వినియోగం, సెప్టిక్ ట్యాంకుల పరిశుభ్రత, పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ, సంక్షేమం, మురుగు నిర్వహణ, తదితర అంశాల్లో మొత్తం 1000 మార్కులతో పోటీ ఉంటుంది. జనాభా ప్రతిపాదికన గతేడాది దేశంలోని 243 నగరాలు, పట్టణాలు ఈ పోటీలో పాల్గొనగా మూడో విభాగంలో రామగుండం నగరపాలిక రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. సుమారు రూ.6 కోట్లతో అత్యాధునిక యంత్రాలను కొనుగోలు చేయడంతో మార్కులు పెరిగి మూడో స్థానం వచ్చేందుకు దోహదపడగా వాటిని వినియోగించకుండా మూలన పడేయడంతో ఈ సారి మార్కులు తగ్గే అవకాశముంది. సఫాయిమిత్ర సురక్షా ఛాలెంజ్ మార్గదర్శకాలను సంపూర్ణంగా అమలు చేస్తే మెరుగైన ర్యాంకును కైవసం చేసుకునే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ