రేషన్ కార్డులో పేరెక్కేదెప్పుడు..?
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది కానీ.. కుటుంబ సభ్యుల్లో కొత్తగా పేరు నమోదు చేసుకున్నవారి పేర్లను ఆమోదించడం లేదు.
న్యూస్టుడే, భగత్నగర్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసింది కానీ.. కుటుంబ సభ్యుల్లో కొత్తగా పేరు నమోదు చేసుకున్నవారి పేర్లను ఆమోదించడం లేదు. ఈ ప్రక్రియను చేపట్టడం లేదు. సుమారు ఏడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో కొత్తగా వివాహం చేసుకున్నవారి పేరు కుటుంబ సభ్యుల్లో చేరడం లేదు. వివాహం జరగ్గానే అమ్మాయి తల్లిదండ్రులు తమ కుటుంబ సభ్యుల నుంచి కుమార్తె పేరు తొలగించి, అత్తగారి ఇంట్లో చేర్చుకోవాలని సూచిస్తుండడంతో చాలామంది దరఖాస్తు చేసుకుంటున్నారు. తొలగింపునకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వం పేరు చేర్చడంలో మాత్రం అవకాశం కల్పించడం లేదు. పిల్లలు పుట్టాక వారి పేర్లను రేషన్ కార్డులో చేర్చడానికి దరఖాస్తు చేసుకుంటున్న వారికీ నిరాశే ఎదురవుతోంది.
ఈ చిత్రంలో కుటుంబంతో కలిసి కనిపిస్తున్న దమ్మన శ్యామ్ ప్రసాద్.. రాంనగర్లో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2017, మార్చి 31న తన కుమారుడు, కుమార్తె పేర్లను రేషన్ కార్డులో చేర్చడం కోసం మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సమస్య పరిష్కారం కాలేదు. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. జిల్లా వ్యాప్తంగా ఏకంగా 41,643 మంది రేషన్ కార్డులో పేరు నమోదు, పేరు మార్పిడి కోసం ఎదురుచూస్తున్నారు.
దరఖాస్తులకు మోక్షం ఎప్పుడో..?
రేషన్ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని కోరుతూ అధికారుల లెక్కల ప్రకారం 41,643 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇన్స్పెక్టర్ స్థాయిలో 13,756, తహసీల్ స్థాయిలో 997, డీఎస్వో స్థాయిలో 12,998 పెండింగ్లో ఉండగా 12,980 దరఖాస్తులు అఫ్రూవ్ చేశారు. 912 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. కనీసం అఫ్రూవ్ చేసిన వారిపేర్లను రేషన్ కార్డులో నమోదు చేసినా లబ్ధిదారులకు కొంత ఆర్థికంగా చేయూతగా ఉండేది కానీ ఆ దిశగా అడుగులు పడడం లేదు.
తొలగింపులో ముందు..
రేషన్కార్డు రద్దు చేయడంలో ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ‘360 డిగ్రీలు’ పేరిట కొత్త సాఫ్ట్వేర్ను తీసుకొచ్చింది. దీంతోనే రేషన్కార్డులు, లబ్ధిదారుల సమాచారాన్ని సేకరిస్తోంది. లబ్ధిదారుడికి కారు, ఐదెకరాల పైబడి వ్యవసాయం, ఆదాయపు పన్ను, తదితర అంశాలను పరిశీలిస్తూ అనర్హులకు ఆటోమెటిక్గా కార్డు రద్దు చేస్తోంది. ఇలా జిల్లాలో 1,406 కార్డులు తొలగిపోయాయి. ఇక కుటుంబ సభ్యుల్లో ఎవరు మృతి చెందినా వెంటనే తొలగిస్తున్నారు కానీ.. పుట్టినవారి పేర్లను నమోదు చేయడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూసేకరణలో జాప్యం
[ 28-03-2024]
భూసేకరణలో జాప్యమే జాతీయ రహదారుల విస్తరణకు శాపంగా మారుతోంది. జిల్లాలో ప్రధానంగా జగిత్యాల-కరీంనగర్ జాతీయ రహదారిగా మార్చి దశాబ్దం కావస్తున్నా.. నిర్మాణం మొదలు కావటం లేదు -
నత్తనడకన నిర్మాణాలు
[ 28-03-2024]
వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పల్లెదవాఖానాలు ఏర్పాటు చేసింది. గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర(సబ్సెంటర్ల)ను పల్లె దవాఖానాలుగా మార్చారు -
నిధులు వెచ్చించి.. పనులు వదిలేసి
[ 28-03-2024]
పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆధునిక సాంకేతికను జోడించి పెద్ద నగరాలకు దీటుగా పోటీ పడేందుకు ప్రణాళికలు చేసిన నగరపాలిక.. ఆ విధానం అమలులో వెనుకబడింది -
తాగునీటి వృథా వద్దు : కలెక్టర్
[ 28-03-2024]
అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు -
నిజామాబాద్ బరిలో జీవన్రెడ్డి
[ 28-03-2024]
కాంగ్రెస్ నిజామాబాద్ లోక్సభ స్థానం టికెట్ జీవన్రెడ్డికే దక్కింది. పార్టీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్న ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థిగా ప్రకటించింది -
తొలిమెట్టు నోడల్ అధికారులకు భత్యం
[ 28-03-2024]
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను పెంచేందుకు ప్రభుత్వం ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రత్యేక బోధన పద్ధతులతో కొనసాగుతున్న ఈ కార్యక్రమ పర్యవేక్షణకు మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించారు. -
అరచేతిలో వాతావరణ సమాచారం
[ 28-03-2024]
వాతావరణ సమాచారాన్ని ప్రతిఒక్కరి దైనందిన కార్యకలాపాల్లో భాగం చేయాలనే ఉద్దేశంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇటీవల ‘పంచాయత్ మౌసం సేవా’ మొబైల్ యాప్ విడుదల చేసింది. -
పఠనాలయం సద్వినియోగం... కల సాకారం
[ 28-03-2024]
గ్రంథాలయ పుస్తకాలతోనే ఏకకాలంలో రెండు ఉద్యోగాలు సాధించగలిగాను. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ నిర్వహించిన ఫలితాల్లో పీజీటీ సాంఘికశాస్త్రం, జూనియర్ కళాశాలలో పౌరశాస్త్రం లెక్చరర్గా ఉద్యోగాలకు ఎంపికయ్యాను -
పంచాయతీల ఖజానా ఖాళీ
[ 28-03-2024]
ఓవైపు ఖజానా ఖాళీ, మరోవైపు సమస్యలు పంచాయతీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. జమయ్యే నిధులకు మించిన వ్యయం చేయడంతో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. -
ఓటు నమోదుకు ప్రత్యేక సాధారణ సెలవు
[ 28-03-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు
తాజా వార్తలు (Latest News)
-
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా