logo

రాజన్న క్షేత్రానికి భక్తుల తాకిడి

దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల తాకిడి నెలకొంది.

Published : 28 Nov 2022 03:40 IST

స్వామివారి దర్శనానికి క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు

వేములవాడ, న్యూస్‌టుడే: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రానికి ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల తాకిడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వచ్చారు. ఆలయ పరిసరాలు, ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, ప్రసాదాల విక్రయ కేంద్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కొందరు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. దాదాపు 20 వేల మంది స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షణ చేశారు. బద్దిపోచమ్మ, భీమేశ్వరాలయాలను భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని