ఒగ్గుకథ.. ఐలయ్యకు ప్రాణపదం
ఒగ్గు కథపై మక్కువతో 15వ ఏటే ఆ కళను తన ఒంట పట్టించుకున్నారు. మొదట్లో జగ్గు ఊపే పాత్ర పోషించి మహిళా పాత్రల వేషం వేస్తూ కథలు చెప్పేవారు.
కేంద్ర సంగీత నాటక పురస్కారానికి ఎంపిక కావడంతో సర్వత్రా హర్షం
గంగాధర, న్యూస్టుడే
ఒగ్గరి అయిలయ్యను సత్కరిస్తున్న ఎమ్మెల్యే రవిశంకర్
ఒగ్గు కథపై మక్కువతో 15వ ఏటే ఆ కళను తన ఒంట పట్టించుకున్నారు. మొదట్లో జగ్గు ఊపే పాత్ర పోషించి మహిళా పాత్రల వేషం వేస్తూ కథలు చెప్పేవారు. దాదాపు 45 ఏళ్లు దేశ, విదేశాల్లో వందలాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు మిద్దె రాములుకు ఆయన ఒగ్గు కళలో మెలకువలు నేర్పించారు. ఒగ్గు కథలతో ఎందరో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రశంసలు అందుకున్నారు. ఆయనే కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మారుమూల గ్రామం ర్యాలపల్లికి చెందిన ఒగ్గరి ఐలయ్య (80). ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా అందిస్తున్న కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురిని సిఫారసు చేయగా అందులో ఒగ్గరి ఐలయ్య ఒకరు.
పల్లె నుంచి దిల్లీ వరకు..
పేదరికంతో కుటుంబాన్ని పోషించుకోవడమే ఇబ్బందిగా మారిన ఆ రోజుల్లో తాను ఒగ్గు కథను జీవనోపాధిగా ఎంచుకున్నారు. 15 నుంచి 60 ఏళ్ల వయసు వరకు ఊరూరా ఒగ్గు కథలు చెప్పారు. మల్లన్న దేవుడి పట్నాల్లో ఒగ్గు కథలకు ప్రాధాన్యం దక్కగా.. ఈయన బృందానికే ఆ అవకాశం దక్కేది. దిల్లీలో నాలుగుసార్లు, హిమాచల్ప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో ఒగ్గు కళతో అక్కడి ప్రజలు, అభిమానులను ఐలయ్య మెప్పించారు. 1990లో మారిషస్ దేశంలోనూ తన బృందంతో ప్రదర్శించిన ఒగ్గు కథలు అలరించాయి. అప్పట్లో యూట్యూబ్ ఛానళ్లు, ఇతర సాధనాలు పెద్దగా లేకున్నా క్షేత్రస్థాయి ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ తనకు ఇష్టమైన అభ్యర్థులకు ఒగ్గు కథల ద్వారా ప్రచారం చేపట్టి ఇందిరాగాంధీ, పీవీ నర్సింహారావు వంటి ప్రముఖులతో సత్కారాలు పొందారు. ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు మూఢనమ్మకాలు, బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, ఇతర సామాజిక అంశాలపై ప్రజలను జాగృతం చేశారు. 45 ఏళ్లపాటు ఒగ్గు కథల్లో వేషాలతో అలరించిన ఆయన ప్రస్తుతం బృందంలో ఒకరిగా ఉంటూ జగ్గు, డప్పు వాయిస్తున్నారు. పలువురు యువకులకు ఒగ్గు కళలో నైపుణ్యం కల్పించేలా శిక్షణ ఇచ్చారు. దిల్లీలో త్వరలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతులమీదుగా కేంద్ర పురస్కారం అందుకోనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తనను గుర్తించడం సంతోషంగా ఉందని, ప్రాణం ఉన్నంతవరకు ఒగ్గుకళను విడిచేది లేదని ఈ సందర్భంగా ఐలయ్య పేర్కొన్నారు. ఆయనను స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కురుమ యువచైతన్య సమితి జిల్లా అధ్యక్షుడు పెద్ది శ్రీనివాస్, తదితరులు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!