ఇలా బిల్లు.. అలా చెల్లింపు
విద్యుత్తు బిల్లుల రీడింగ్ నమోదులో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) చర్యలు చేపట్టింది.
విద్యుత్తు మీటరు రీడింగ్ నమోదులో ఆధునిక సాంకేతికత
ఈ నెల నుంచే జిల్లాలో అందుబాటులోకి సేవలు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
ఆండ్రాయిడ్ యంత్రం
విద్యుత్తు బిల్లుల రీడింగ్ నమోదులో ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ఉత్తర విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) చర్యలు చేపట్టింది. వినియోగదారులకు పారదర్శక సేవలు అందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగంలోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు అమలవుతున్న స్పాట్ బిల్లింగ్ యంత్రాల స్థానంలో ఆండ్రాయిడ్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో సేవలు సత్వరమే అందడంతో పాటు తప్పులు లేకుండా రీడింగ్ వచ్చే అవకాశం ఉంది.
విద్యుత్తు రీడింగ్ బిల్లుల నమోదులో ఇకపై హెచ్చు తగ్గులకు ఆస్కారం ఉండదు. రీడింగ్ తీసిన వెంటనే వినియోగదారులు బిల్లు చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు. కొత్త విధానంలో రీడింగ్ ప్రక్రియ జిల్లాలో ఈ నెలలో ప్రారంభమైంది. కొత్త పద్ధతి ప్రకారం బిల్లుల నమోదులో తప్పులకు అవకాశం ఉండదని అధికారులు భావిస్తున్నారు. జిల్లాలోని మంథని, పెద్దపల్లి విద్యుత్తు డివిజన్ల పరిధిలో గృహ, వాణిజ్య, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సంబంధించి 2,24,052 కనెక్షన్లున్నాయి.
మంథనిలో కొత్త పరికరంతో రీడింగ్ తీస్తున్న ఎన్పీడీసీఎల్ అధికారి
రీడింగ్ తీసిన వెంటనే చెల్లించేలా..
విద్యుత్తు రీడింగ్ పరంగా సమస్యలకు చెక్ పెట్టేందుకు ఆండ్రాయిడ్ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. చరవాణి మాదిరిగా ఉండే పరికరాన్ని ప్రత్యేక సాప్ట్వేర్తో అనుసంధానించి బిల్లింగ్ సిబ్బందికి అందజేశారు. పాత పద్ధతి ప్రకారం ఒక ఉద్యోగి తన పరిధిలోని కనెక్షన్లకు మీటరు రీడింగ్ తీసి ఈఆర్వో కార్యాలయంలో అప్లోడ్ చేయాల్సి వచ్చేది. ఇందుకు రెండు, మూడు రోజుల సమయం పట్టేది. అప్పటివరకు వినియోగదారుకు ఆన్లైన్లో బిల్లు కనిపించేది కాదు. అలాగే వివరాలు అప్లోడ్ చేసే సమయంలో సాంకేతిక సమస్యలతో మొరాయించేవి. ఆండ్రాయిడ్ యంత్రాలతో బిల్లింగ్ తీసిన తర్వాత మళ్లీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఈఆర్వో కార్యాలయంలో అప్లోడ్ చేసిన తర్వాతనే బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. కొత్త పరికరాలతో రీడింగ్ తీసిన వెంటనే నేరుగా చెల్లించుకోవచ్చు.
త్వరలో చరవాణి ఆధారితంగా..
విద్యుత్తు రీడింగ్ను ప్రతి నెలా బిల్లింగ్ సిబ్బందితో పాటు ఎన్పీడీసీఎల్ అధికారులు నమోదు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త పద్ధతిలో కాకుండా అధికారులు తమ చరవాణితోనే రీడింగ్ తీసే విధానం త్వరలోనే ప్రారంభం అవుతుంది. చరవాణిలో నమోదైన రీడింగ్ను ప్రింట్ తీయడానికి ప్రత్యేక యంత్రాన్ని సమకూర్చనున్నారు. మొబైల్ను మీటరు వద్దకు తీసుకెళ్లగానే రీడింగ్ నమోదవుతుంది. వెంటనే ప్రింటర్ నుంచి రశీదు వస్తుంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ విధానం కొనసాగుతుండగా, డిసెంబరు నుంచి జిల్లాలో అమలు కానుంది.
ఇప్పటివరకు ఇలా..
* గతంలో గృహ, పారిశ్రామిక, ఇతర అవసరాలకు సంబంధించి మీటర్ల రీడింగ్.. దస్త్రాల ఆధారంగా ఉండేది.
* వినియోగదారుల ఇంటికి వెళ్లి దస్త్రంలో రీడింగ్ నమోదు చేసి బిల్లులు జారీ చేసేవారు.
* దీంతో సేవల్లో కొంత జాప్యం జరుగుతుండటంతో అనంతరం స్పాట్ బిల్లింగ్ యంత్రాలు వచ్చాయి.
* ఒప్పంద సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి పరికరాల సాయంతో రీడింగ్ నమోదు చేస్తున్నారు.
* అయితే కాలం చెల్లిన యంత్రాలు తరచూ మొరాయిస్తున్నాయి.
* ఒక యంత్రం పాడయితే సంబంధిత ఉద్యోగి పరిధిలో కనెక్షన్ల రీడింగ్ నిలిచిపోతోంది.
* ప్రత్యామ్నాయంగా మరొకరు వచ్చి రీడింగ్ నమోదు చేయాల్సి వస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
తప్పులకు అవకాశం లేదు
బి.సుదర్శన్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ
జిల్లాలో ఆండ్రాయిడ్ యంత్రాలతో రీడింగ్ నమోదు ప్రారంభించాం. ప్రత్యేక సాఫ్ట్వేర్తో కూడిన యంత్రాలు కావడంతో రీడింగ్లో తప్పులు దొర్లే అవకాశం లేదు. కొత్త విధానంపై ఎలాంటి ఫిర్యాదులు రావడం లేదు. వచ్చే నెల నుంచి మా శాఖ అధికారులు చరవాణి సాయంతో రీడింగ్ తీయనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!