పైసలు లేవు... పనులు చేసేదెట్లా?
ఈ చిత్రంలో కనిపిస్తున్నది కంచర్ల స్మశానవాటిక. రూ. 12.60 లక్షలతో నిర్మించి ఏడాదిన్నర అవుతుంది. ఎంబీ రికార్డు చేయలేదని పలుమార్లు మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచి ఆందోళన వ్యక్తం చేశారు.
సర్పంచుల ఆందోళన
వీర్నపల్లి, న్యూస్టుడే
వీర్నపల్లి సర్వసభ్య సమావేశంలో అధికారులను నిలదీస్తున్న సర్పంచులు
ఈ చిత్రంలో కనిపిస్తున్నది కంచర్ల స్మశానవాటిక. రూ. 12.60 లక్షలతో నిర్మించి ఏడాదిన్నర అవుతుంది. ఎంబీ రికార్డు చేయలేదని పలుమార్లు మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పీఆర్ ఏఈ ఎంబీ రికార్డు నమోదు చేశారు. పూర్తయిన నిర్మాణాలకు ఇప్పటికీ క్యూసీ కాకపోవడంతో పూర్తి స్థాయిలో నిధులు అందలేదు. ఈ పనిలో జీఎస్టీ పోను రూ. 1.50 లక్షల వరకు బిల్లు రావాల్సి ఉందని సర్పంచి చెబుతున్నారు. ఈయన ఒక్కరికే కాదు. జిల్లాలోని అందరి సర్పంచులకు బిల్లులు రాక నానా అవస్థలు పడుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధుల చెల్లింపులో ఆలస్యంతో గ్రామ పంచాయతీల నిర్వహణ ఇబ్బందిగా మారింది. పనులు చేసిన ప్రథమపౌరులు బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. తెచ్చిన అప్పులకు మిత్తీలు కట్టలేని పరిస్థితి నెలకొంది. పలు చోట్ల మండల సర్వసభ్య సమావేశాల్లో అధికారులను నిలదీస్తూనే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు రావాల్సిన పైసల కోసం నెలల తరబడి నిరీక్షిస్తున్నారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి నిర్వహణ, అభివృద్ధి పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనాభా ప్రాతిపదికన నిధులు విడుదల చేస్తున్నాయి. పారదర్శకంగా నిధుల వివరాలు ప్రజలకు తెలియజేయాలని కేంద్రం పీఎఫ్ఎంఎస్ (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్), గ్రామ స్వరాజ్ పోర్టల్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరులో జాప్యం జరుగుతోంది. కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు సైతం జులై నుంచి నిలిపివేసింది. దీంతో పల్లెల్లో పనులు ప్రశ్నార్థకంగా మారాయి. ఇటీవల కేంద్రం నుంచి 10 శాతం లోపు నిధులను పంచాయతీలో జమ చేసినట్లు అధికారులు చెబుతున్నా అవి ఎటూ సరిపోవని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.
రూ. 20.60 కోట్లకు పైగా రాక...
జిల్లాకు 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు మార్చి నుంచి, రాష్ట్ర ప్రభుత్వం అందించే నిధులు జులై నుంచి నిలిచిపోయాయి. 255 పంచాయతీలకు ప్రతి నెలా రూ. 4.12 కోట్లు రావాల్సి ఉండగా ఐదు నెలలుగా రావడం లేదు. రూ. 20.60 కోట్లకు పైగా విడుదల చేయాల్సి ఉంది. పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వివిధ పనులు, మరమ్మతులకు, కార్మికుల జీతాలు, చెత్త ట్రాక్టర్ల నిర్వహణకు డబ్బులను వడ్డీకి తెచ్చి ప్రథమ పౌరులు చెల్లిస్తున్నారు. దీంతో సర్పంచులపై ఆర్థిక భారం పడుతోంది. అలాగే వైకుంఠధామాలు నిర్మించి ఏళ్లు కావస్తున్నా క్యూసీ(క్వాలిటీ కంట్రోల్) జరగకపోవడంతో పూర్తిస్థాయిలో చెల్లింపులు జరగలేదు. ఒక్కో స్మశానవాటిక నిర్మాణంలో సర్పంచులకు సుమారు రూ. 2.50 లక్షలు రావాల్సి ఉంది. గ్రామాల్లో మరమ్మతులు, వివిధ పనులకు ఖర్చు చేసిన పైసలు రాలేదంటూ ఆరోపిస్తున్నారు. బంకుల్లో ఇంధనాన్ని అరువు తీసుకువస్తున్నామని చెబుతున్నారు. మిషన్ భగీరథ పనులకు బిల్లులు రాలేదంటూ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. పదవీ కాలం దగ్గరికొస్తుండటంతో పైసలు రావేమోనన్న ఆందోళనకు గురవుతున్నారు. పెట్టిన డబ్బులు రాకుంటే ఆత్మహత్యలే శరణ్యమని పలువురు సర్పంచులు మండల సర్వసభ్య సమావేశాల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక పరిస్థితి ఘోరంగా మారింది
- జగ్మాల్, ఎర్రగడ్డతండా సర్పంచి
పదవి చేపట్టిన ప్రారంభంలో మిషన్ భగీరథ పనులు చేసినా ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదు. క్యూసీ కాకపోవడంతో వైకుంఠధామాల బిల్లులు రాలేదు. దీంతో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారింది. పెట్రోలు బంకుల్లో ఇంధనాన్ని అరువు తీసుకుంటున్నాం. పారిశుద్ధ్య కార్మికులను బతిమిలాడి పనులు చేయిస్తున్నాం. పదవీ కాలం సమీపించింది. అసలు డబ్బులు వస్తాయో, రావోనన్న ఆందోళన అందరిలోనూ ఉంది. వెంటనే సర్పంచులకు రావాల్సిన బకాయిలను ఇప్పించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పంచాయతీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తే పల్లెలను అభివృద్ధి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
మలేరియా నిర్మూలనకు కృషి
[ 26-04-2024]
ప్రపంచ మలేరియా దినోత్సవం పురస్కరించుకుని గురువారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.