ప్రయోగం.. ప్రజా ప్రయోజనం
చిట్టి బుర్రలో మెరిసిన ఆలోచనలు సమకాలీన అంశాలపై పరిశోధనల వైపు మళ్లించాయి. విద్యార్థుల మేధస్సుకు ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోడవడంతో ఆవిష్కరణలు ఔరా అనిపించాయి.
రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక పోటీలకు ఎంపిక
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
చిట్టి బుర్రలో మెరిసిన ఆలోచనలు సమకాలీన అంశాలపై పరిశోధనల వైపు మళ్లించాయి. విద్యార్థుల మేధస్సుకు ఉపాధ్యాయుల ప్రోత్సాహం తోడవడంతో ఆవిష్కరణలు ఔరా అనిపించాయి. రేపటి పౌరుల ప్రతిభ చూపరులను ఆకట్టుకుంది. రెండు రోజుల కిందట పెద్దపల్లిలో జరిగిన 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ వైజ్ఞానిక పోటీల్లో వీరి ప్రదర్శనలు ముందువరుసలో నిలిచాయి. జిల్లా స్థాయిలో చాలా మంది విద్యార్థులు పోటీ పడగా అత్యుత్తమ ప్రదర్శనతో ఆరు ప్రాజెక్టు నమూనాలు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాయి.
ల్యాబ్కు పంపకుండానే లవణాల గుర్తింపు
-మానస, పదో తరగతి, జడ్పీ పాఠశాల రాగినేడు, పెద్దపల్లి మం.
మనం తాగే నీటిలో శరీరానికి అవసరమైన లవణాలు తగిన మోతాదులో లేకుంటే కీళ్లు, మోకాళ్లు, జీర్ణకోశ సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. స్వచ్ఛమైన నీటిలో 250-500 శాతం ఖనిజ లవణాలుండాలి. ఆర్వో ప్లాంటులో ఇవి కేవలం 50లోపే ఉంటుండగా మిషన్ భగీరథలో 300-400 శాతం ఉన్నాయి. నీటి నమూనాలను ప్రయోగశాలకు పంపించకుండానే టీడీఎస్(టోటల్ డిసాల్వ్ సాలిడ్స్) పరికరంతో సులువుగా లవణాల శాతాన్ని గుర్తించవచ్చు.
వ్యర్థాలకు అర్థం.. పరిసరాలు శుభ్రం
-రష్మిత, 8వ తరగతి, బీసీ గురుకుల పాఠశాల, పెద్దపల్లి
ఇళ్లలో ఉపయోగించే చాలా వస్తువులు వ్యర్థాలుగా మారిన తర్వాత అధిక మొత్తంలో పోగవడం పర్యావరణానికి సమస్యగా మారింది. వ్యర్థాలను వృథాగా వదిలేయకుండా తిరిగి వాడుకలోకి తేవడం ద్వారా అపరిశుభ్రత తొలగించవచ్చు. ఇందుకోసం ‘వేస్ట్ ఫ్రమ్ ది వేస్ట్ థింగ్ రీసైక్లింగ్ యూసింగ్’ విధానం ఉపయుక్తంగా ఉంటుంది. పనికిరాని దుస్తులతో బోధనోపకరణాలు, కాగితపు డబ్బాలతో అలంకార సామగ్రికి జీవం పోయవచ్చు.
రసాయన ఎరువుల వాడకంపై అవగాహన
-సాయిమాధవ్, 9వ తరగతి, ఆదర్శ పాఠశాల, ధర్మారం
రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే పంటలకు రసాయన ఎరువులను పిచికారీ చేస్తుండటంతో అనారోగ్యానికి గురవుతున్నారు. విష స్వభావ సూచికలను పట్టించుకోవడం లేదు. క్రిమిసంహారక మందు డబ్బాలపై ఉండే ఎరుపు రంగు సూచిక మందు అత్యంత విషపూరితమైనదని సూచిస్తుంది. ఫెరామన్ ట్రాప్స్(లింగాకర్షక బుట్టలు), దీపపు తెరలు విధానంతో రైతుల్లో రసాయన ఎరువుల వినియోగంపై అవగాహన పెంచవచ్చు. విషపూరిత రసాయనాలను గుర్తించేలా చేయవచ్చు.
ఆహార నియమాలతో ఆరోగ్య రక్షణ
-శ్రీజ, 9వ తరగతి, అల్ఫోర్స్ పాఠశాల, సుల్తానాబాద్
చాలా రకాలైన అనారోగ్యాలకు ఆహార అలవాట్లే కారణం. ఇవి అనేక రోగాలకు కారణమవుతున్నాయి. ఆరోగ్య నియమాలు పాటించడంపై నిర్లక్ష్యం వల్ల ఆసుపత్రుల పాలై ఆర్థికంగా నష్టపోతున్నారు. ‘ది హెల్త్ అండ్ ఫైన్లెస్ ఆఫ్ స్కూల్ రింగ్స్ గుడ్ హెల్త్’ విధానంలో ఆహార నియమాలను తెలుసుకోవచ్చు. వీటిని పాటించడం ద్వారా పరిసరాల పరిశుభ్రత పెంపొందించడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
మిశ్రమ పంటలతో సాగు లాభదాయకం
-సాత్విక, 8వ తరగతి, జడ్పీ ఉన్నత పాఠశాల, రొంపికుంట, కమాన్పూర్ మం.
పూర్వకాలంలో మాదిరిగా మిశ్రమ పంటల సాగు ఇప్పుడు చేయడం లేదు. కమతాల్లో ఒకే రకమైన పంట సాగు చేస్తుండటంతో అతివృష్టి లేదా అనావృష్టి సమయంలో రైతులు నష్టపోతున్నారు. చిరుధాన్యాలైన జొన్న, కంది, శనగ, గోధుమ వంటి పంటలు సాగు చేస్తే లాభాలు గడించవచ్చు. పోషకాహార ఉత్పత్తుల సాగు పెరగనుంది. పంట దిగుబడులతో పాటు పశుగ్రాసం కొరత తీరుతుంది. ఏక కాలంలో వివిధ పంటల సాగుతో ఖర్చులు తగ్గుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా