తనిఖీలు మమ.. చర్యలు భ్రమ
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో ప్రైవేటు ఆస్పత్రుల్లోని సేవలు, అనుమతులు, ఇతరత్రా వసతులపై పరిశీలించేందుకు నెలన్నర రోజుల కిందట పక్షం రోజులపాటు వరుసగా తనిఖీలు నిర్వహించారు.
నెలన్నర రోజులు దాటినా తాఖీదులకే పరిమితం
ఉమ్మడి జిల్లాలో తూతూ మంత్రంగానే ఆసుపత్రుల పరిశీలన
ఈనాడు, కరీంనగర్
జమ్మికుంట ఆసుపత్రిలో రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు
వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలో ప్రైవేటు ఆస్పత్రుల్లోని సేవలు, అనుమతులు, ఇతరత్రా వసతులపై పరిశీలించేందుకు నెలన్నర రోజుల కిందట పక్షం రోజులపాటు వరుసగా తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో అధికారులు బృందాలుగా విడిపోయి పరిశీలనలు జరిపారు. తమ దృష్టికి వచ్చిన లోపాలను నమోదు చేసుకోవడంతో పాటు అనుమతి పత్రాలు లేని వాటికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఒకటి రెండు ఆస్పత్రులను సీజ్ చేస్తున్నామని ప్రకటించారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2010 ప్రకారం భవనాల తీరు, రోగులకు అందే సేవలపై లోతుగా పరిశీలనలు చేపట్టారు. తనిఖీలు నిర్వహించిన ఆస్పత్రుల్లో 35 శాతం మేర నిబంధనలను అతిక్రమిస్తున్నాయనే విషయాన్ని తనిఖీ బృందాలు గుర్తించాయి.
నివేదికతో సరి..
దంత వైద్యశాలతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని రకాల వైద్య సేవలపై పరిశీలించారు. ముఖ్యంగా కరీంనగర్లో ఆస్పత్రుల సంఖ్యను చూసి వైద్యాధికారులే విస్తుపోయారు. అనుమతి పత్రాల్లో ఉన్న పేరు కాకుండా ఇతర పేర్లతో నడుస్తున్నవి కొన్ని ఉండగా, అర్హత లేని వైద్యులు, సరైన వసతులు లేనివి మరికొన్ని ఉన్నట్లు తేలింది. కాగా ఇప్పటికీ సదరు ఆస్పత్రులపై చర్యలు తీసుకునే విషయంలో మాత్రం ఇంకా నిర్లక్ష్యమే కనిపిస్తోంది. జిల్లాల్లో నిబంధనలను ఉల్లంఘించిన తీరుపై వాస్తవాలు వివరిస్తూ నివేదికలను రాష్ట్ర స్థాయి అధికారులకు పంపించామని, వారి ఆదేశాల మేరకే చర్యలుంటాయని ఉమ్మడి జిల్లాలోని వైద్యాధికారులు చెబుతున్నారు.
అప్పుడు...
సెప్టెంబరు చివరి వారం నుంచి అక్టోబరు రెండో వారం వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా ఒకటే హడావుడి. వైద్య ఆరోగ్య శాఖ అధికారులంతా ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీల్లో తలమునకలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆస్పత్రులపై కొరడా ఝుళిపించారు. గంటల తరబడి దస్త్రాలు, అనుమతుల పత్రాల గురించి ఆరా తీశారు. గుర్తింపు లేని వాటి విషయంలో కన్నెర్ర చేస్తూ ఆగమేఘాల మీద తాఖీదులు అందజేశారు. బృందంలోని ఏ ఒక్కరిని పలకరించినా ‘చర్యలు తప్పవు’ అనేలా దూకుడు కనిపించింది.
ఇప్పుడు..
* తనిఖీలు జరిగి నెలన్నర రోజులు గడుస్తున్నా.. ఏ ఒక్క అధికారి కూడా సదరు ప్రైవేటు ఆస్పత్రుల కథ ఏమిటనే విషయమై స్పష్టతనివ్వలేకపోతున్నారు. దవాఖానాల్లో దగా తీరు నిజమేనని తెలిసినా.. నిబంధనలకు విరుద్ధంగా వాటిని నడిపిస్తున్నారని గుర్తించినా.. తామేమీ చేయలేమన్నట్లుగా మిన్నకుంటున్నారు. కనీసం అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదు. నోటీసులు అందించడంతోనే తమ పని అయిపోయిందన్నట్లుగా చేష్టలుడిగి చూస్తున్నారు. దీంతో తాఖీదులు తమనేం చేస్తాయనుకుంటూ పలు ఆస్పత్రుల యాజమాన్యాలు యథావిధిగా నడిపిస్తున్నాయి. తమను ఎవరేం చేయగలరనే తీరును చేతల్లో చూపిస్తున్నాయి.
గుర్తించిన లోపాలు ఇలా..
* చాలా ఆసుపత్రుల్లో చుట్టూ అగ్నిమాపక వాహనం తిరిగే పరిస్థితులు లేవు.
* అగ్ని ప్రమాదం జరిగితే నిరోధించడానికి చాలా చోట్ల ఉపకరణాలు కనిపించలేదు.
* బహుళ అంతస్థుల్లో ఏర్పాటు చేసిన కొన్ని ఆసుపత్రుల్లో రోగులకు భద్రత కరవైంది.
* కొన్ని చోట్ల ఆపరేషన్ థియేటర్, ప్రసూతి గదులు సక్రమంగా లేనట్లు తేలింది.
* చాలా చోట్ల నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి ఆవరణలోనే ల్యాబ్లు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
* బోర్డుల్లో పేర్కొన్న వైద్యులు వాస్తవంగా సేవలందించడం లేదనేది బృందాల దృష్టికి వచ్చింది.
* అర్హత లేకున్నా కొందరు వైద్యులు చికిత్స అందిస్తున్న విషయం కొన్ని చోట్ల వెల్లడైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?