తెరపైకి మరో ఆదాయ మార్గం
రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయం పెంచుకోవాల్సి ఉంటుంది.. లేదంటే ఆస్తిపన్ను, నల్లా బిల్లులపై ఆధారపడితే సాధారణ నిధులకు లోటు ఏర్పడే అవకాశాలు ఉంటాయి..
బల్దియాలో కొత్తగా ప్రకటనల బోర్డులు
రహదారుల మధ్య ఏర్పాటు చేసిన క్యాంటీలివర్ ప్రచార బోర్డులు
న్యూస్టుడే, కరీంనగర్ కార్పొరేషన్: రోజురోజుకు పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయం పెంచుకోవాల్సి ఉంటుంది.. లేదంటే ఆస్తిపన్ను, నల్లా బిల్లులపై ఆధారపడితే సాధారణ నిధులకు లోటు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.. అలాకాకుండా ముందస్తుగా పుర, నగరపాలికలకు రావాల్సిన ఆదాయంపై దృష్టి సారిస్తే పాలన వ్యవహారాలకు ఎలాంటి చిక్కులు ఉండవు. ఇలాంటి పరిస్థితిలో సొంత ఆదాయం సమకూర్చుకోవాలని ఆదేశాలు అందుతుండడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధి విస్తరించింది. గతంలో 50 డివిజన్లు ఉండగా ప్రస్తుతం 60కి పెరగడంతో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత పాలకవర్గంపై పడింది. ఇందుకు నిధులు అవసరముండగా ఆర్థిక సంఘం, పట్టణ ప్రగతి నిధులు ఏడాదికి ఒకసారి విడుదల అవుతున్నాయి. వీటిని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టే అభివృద్ధి పనులకు మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు అత్యవసరమయ్యే రహదారులు, మురుగుకాలువల నిర్మాణాలు, పండగల ఖర్చులు, విద్యుత్తు బిల్లులు, ఒప్పంద ఉద్యోగులు, కార్మికుల జీతాలు, ఇతర పనులకు సాధారణ నిధులే దిక్కు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా డివిజన్లలో చేపట్టిన వాటికి బిల్లులు ఇవ్వాలంటే కాసుల నిల్వ ఉండాలి. దీనికోసం వివిధ రకాల పన్నులు రాబట్టుకోవాల్సిన అవసరముంది.
ఆస్తిపన్నులే కీలకం
నగర పరిధిలో ప్రచార బోర్డులు, ట్రేడ్ లైసెన్స్లు, యూజర్ ఛార్జీలు నుంచి వచ్చే ఆదాయం తక్కువగా ఉండగా ఆస్తిపన్నుల రూపంలో వచ్చే ఆదాయం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం నివాసిత గృహాల సంఖ్య పెరగడం, భువన్ యాప్ ద్వారా కొలతలు నమోదు చేయడం, అంతస్తుల ప్రకారం ఇంటి నెంబర్లు కేటాయించి మదించడం, అనుమతులు లేకుండా నిర్మించే ఇళ్లకు అదనంగా పన్నులు వసూలు చేస్తుండటంతో ఆస్తి పన్ను పెరిగింది. రెండేళ్ల కిందటి వసూళ్లకు ఈ ఏడాది రెట్టింపు కావడంతో ఆదాయం పెరిగినట్లే.
డివైడర్ల మధ్య..
స్మార్ట్సిటీలో భాగంగా ఏర్పాటు చేయాల్సిన ప్రచార బోర్డులు, బస్ షెల్టర్లను ఆయా ఏజెన్సీలకు టెండర్ ప్రక్రియ ద్వారా అప్పగించారు. 14.5 కిలోమీటర్ల దూరంలో డివైడర్ల మధ్య ప్రచార బోర్డులు ఏర్పాటు చేసుకోవడానికి పలు సంస్థలు పోటీ పడ్డాయి. కొత్తవి, పాతవి కలిపి మొత్తం 70 వరకు ఉన్నాయి. ఆర్అండ్బీ సూచించిన స్థలాల్లో ఎన్వోసీ ఆధారంగా నగర పాలక అనుమతులు జారీ చేసింది. సదరు సంస్థ వీటిని నిర్మించుకుంటాయి. లైటింగ్ బోర్డులు కాగా డిపాజిట్తోపాటు ఏడాదికి చదరపు మీటర్ చొప్పున వసూలు చేయనున్నారు. ప్రచార బోర్డులపై ప్రచారం చేసినా, చేయకపోయినా ఏడాది మొత్తానికి ఫీజు కట్టాల్సిందే. పైగా ఏడాదికి పది శాతం చొప్పున ఫీజు పెంచుతారు. అంతేకాకుండా నగరపాలక, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ఆ బోర్డులను ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది.
ఏడాదికి రూ.1.10 కోట్లు వచ్చేలా..
హైదరాబాద్, వరంగల్ మహానగరాల్లో ఇలాంటి క్యాంటీలివర్ బోర్డులు, బస్ షెల్టర్ల ద్వారా ఆదాయం పొందుతుండగా ఇక్కడ మాత్రం ఆలస్యం చేశారు. ఇటీవల పాలకవర్గ సభ్యులతోపాటు నగర మేయర్ వై.సునీల్రావు సైతం ఆదేశాలు జారీ చేశారు. బల్దియాకు వచ్చే ఆదాయం రాబట్టుకోవాలని, కొత్త మార్గాలపై అన్వేషించాలని నిర్ణయం తీసుకోవడంతో చర్యలు చేపట్టారు. ఒక్కో క్యాంటీలివర్కు ఏడాదికి సుమారు రూ.78,800 చొప్పున ఆదాయం వస్తుంది. ఇదే తరహాలో బస్షెల్టర్లపై ప్రచారానికి పన్నులు వసూలు కానున్నాయి. రెండింటికి కలిపి ఏడాదికి రూ.1.10 కోట్లు ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్