logo

జమ్మికుంటలో నటి ఈషా సందడి

జమ్మికుంటలో కాసం ఫ్యాషన్‌ షోరూం, నూతన వస్త్రాలయాన్ని ఆదివారం సినీ నటి ఈషారెబ్బా ప్రారంభించారు.

Published : 05 Dec 2022 05:45 IST

వస్త్రాలయాన్ని ప్రారంభిస్తున్న సినీ నటి ఈషారెబ్బా, కాసంగ్రూపు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు

జమ్మికుంట, న్యూస్‌టుడే: జమ్మికుంటలో కాసం ఫ్యాషన్‌ షోరూం, నూతన వస్త్రాలయాన్ని ఆదివారం సినీ నటి ఈషారెబ్బా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఆమెతో కలిసి నిర్వాహకులు మల్లికార్జున్‌, ఓంనమశివాయ, కేధరనాథ్‌, శివ, మున్సిపల్‌ ఛైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు జ్యోతి వెలిగించారు. సినీ నటి మాట్లాడుతూ తాను వరంగల్‌ అమ్మాయినేనని, పరిసర ప్రాంతంలోని జమ్మికుంటకు మొదటిసారి రావటం ఆనందంగా ఉందన్నారు. అభిమానులకు అభివాదం చేస్తూ జోష్‌ నింపగా అక్కడివారు సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని