అక్కను హత్య చేసిన తమ్ముడి అరెస్ట్
అక్కను హత్య చేసిన తమ్ముడిని అరెస్ట్ చేసినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తంగళ్లపల్లి మండలంలోని పద్మానగర్ గ్రామానికి చెందిన గజ్వెల్లి శివరామకృష్ణ...
సిరిసిల్ల (విద్యానగర్), న్యూస్టుడే: అక్కను హత్య చేసిన తమ్ముడిని అరెస్ట్ చేసినట్లు సిరిసిల్ల రూరల్ సీఐ ఉపేందర్ తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తంగళ్లపల్లి మండలంలోని పద్మానగర్ గ్రామానికి చెందిన గజ్వెల్లి శివరామకృష్ణ తాగుడుకు బానిసై ప్రతిసారి తల్లిదండ్రులతో గొడవ పడుతూ ఉండేవాడని, వద్దు అని మందలించిన సొంత అక్క గాలి కవితను శుక్రవారం సాయంత్రం కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు చెప్పారు. తండ్రి గజ్వెల్లి యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆదివారం నిందితుడు గజ్వెల్లి శివరామకృష్ణను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అతని నుంచి కత్తి, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
KK pathak: నోరు పారేసుకున్న సీనియర్ ఐఏఎస్.. సర్వీసు నుంచి తొలగించాలని డిమాండ్
-
Movies News
Kasinathuni Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
India News
Child Marriages: అరెస్టులకు సిద్ధం.. 4000 మందిపై కొనసాగుతున్న విచారణ
-
Sports News
IND vs PAK: పాక్ ఆటగాళ్లను భారత అభిమానులు ఎంతో గౌరవిస్తారు: ఉమర్ అక్మల్
-
India News
PM-KUSUM: ‘పీఎం కుసుమ్’ పథకం 2026 వరకు పొడిగింపు
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!