పట్టుదల ముందు వైకల్యం బలాదూర్
అంగ వైకల్యం తమ ఆశయానికి అడ్డురాదని నిరూపిస్తున్నారు జిల్లాకు చెందిన క్రీడాకారులు. ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన జాతీయస్థాయి పారా త్రోబాల్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన రాష్ట్ర జట్టులో బోయినపల్లి మండలం మల్లాపూర్కు చెందిన మంత్రి మనోహర్, రుద్రంగికి చెందిన సింగారపు బాబు, కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన వెంకటేశ్ ఉన్నారు.
పారాలింపిక్స్లో రాణిస్తున్న జిల్లా యువకులు
న్యూస్టుడే, బోయినపల్లి
పారా త్రోబాల్ పోటీల్లో క్రీడాకారులు (పాతచిత్రం)
అంగ వైకల్యం తమ ఆశయానికి అడ్డురాదని నిరూపిస్తున్నారు జిల్లాకు చెందిన క్రీడాకారులు. ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన జాతీయస్థాయి పారా త్రోబాల్ ఛాంపియన్షిప్లో విజేతగా నిలిచిన రాష్ట్ర జట్టులో బోయినపల్లి మండలం మల్లాపూర్కు చెందిన మంత్రి మనోహర్, రుద్రంగికి చెందిన సింగారపు బాబు, కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన వెంకటేశ్ ఉన్నారు. చిన్నతనం నుంచి అంగవైకల్యం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికి ఆసక్తి ఉన్న క్రీడలను మాత్రం వదల్లేదు. కుటుంబ పోషణ కోసం పనులు చేసుకుంటూ ఖాళీ సమయంలో సాధన చేస్తూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. జాతీయ పోటీల్లో సత్తా చాటిన క్రీడాకారులపై కథనం.
డ్రైవింగ్, సెంట్రింగ్ పనులు చేస్తూ..
మల్లాపూర్ గ్రామానికి చెందిన మంత్రి మనోహర్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. గ్రామంలో తోటి స్నేహితులు వాలీబాల్ ఆడుతుండగా నిత్యం చూడటంతో తనకు ఆడాలన్న ఆసక్తి కలిగింది. పుట్టుకతో ఒక కాలు చిన్నగా ఉండటంతో వాలీబాల్ ఆడటానికి సంశయించేవాడు. గ్రామానికి చెందిన మాధవరెడ్డి ప్రోత్సాహంతో సకలాంగులతో కలిసి వాలీబాల్ ఆడటం ప్రారంభించాడు. రుద్రంగికి చెందిన బాబుతో పరిచయం ఏర్పడటంతో పారా త్రోబాల్ నేషనల్ పోటీల్లో పాల్గొంటున్నాడు. 2014 నుంచి ఇప్పటి వరకు పదిహేను సార్లు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. పారా త్రోబాల్లో డిఫెన్సింగ్ ఆటగాడిగా రాణిస్తున్నాడు. చిన్నతనంలోనే తండ్రి మృతి చెందాడు. కుటుంబ పోషణ కోసం డ్రైవింగ్, సెంట్రింగ్ పనులకు వెళ్తున్నాడు. ఖాళీ సమయంలో వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. పోటీలకు వెళ్లిన సమయంలో రూ.15 వేలు ఖర్చు అవుతుందని, తానే భరిస్తున్నట్లు మనోహర్ తెలిపాడు. ప్రభుత్వం, దాతలు సహకరించి ప్రోత్సహించాలని కోరాడు.
పంచాయతీ కార్మికుడిగా పని చేస్తూనే...
కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన వెంకటేశ్కు చిన్నతనం నుంచి కాలు, చేయి వైకల్యం ఉంది. ఎంబీఏ పూర్తి చేసిన పంచాయతీ కార్మికుడిగా పని చేస్తున్నాడు. రుద్రంగికి చెందిన బాబు ప్రోత్సాహంతో 2015 నుంచి రాష్ట్ర జట్టు నుంచి జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్నాడు. వాలీబాల్తోపాటు క్రికెట్, చదరంగం, క్యారం ఆటలపై ఆసక్తి ఉన్న వెంకటేశ్ ఇటీవల జిల్లా స్థాయి చెస్ పోటీల్లో సత్తా చాటి మొదటి స్థానంలో నిలిచాడు. ఎంబీఏ పూర్తి చేసినప్పటికి కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గ్రామ పంచాయతీ కార్మికుడిగా పని చేస్తున్నట్లు తెలిపాడు. పోటీలకు వెళ్లిన సమయంలో ఖర్చులకు డబ్బులు సమకూర్చుకోవడం భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
పెయింటింగ్ వేస్తూ...
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన సింగారపు బాబుకు చిన్నతనంలో కుడి కాలుకు పోలియో సోకింది. పదో తరగతి చదువుకున్న అనంతరం జీవనోపాధి వేటలో గల్ఫ్ వెళ్లిన బాబు స్వగ్రామానికి వచ్చిన అనంతరం క్రీడలపై దృష్టిసారించాడు. స్నేహితులు, స్థానిక యువకులతో కలిసి వాలీబాల్, బ్యాడ్మింటన్ సాధన చేశాడు. 19 సార్లు జాతీయ, 6 సార్లు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. శ్రీలంక, థాయిలాండ్, మలేషియా దేశాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని రెండు గోల్డ్, నాలుగు సిల్వర్ మెడల్స్ సాధించాడు. పారాలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతూ సకలాంగులకు అందిస్తున్న విధంగా తమకు ప్రభుత్వం అండగా నిలవాలని పోరాడుతున్నాడు. ప్రస్తుతం పెయింటింగ్ పనులు చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం