యాసంగి విద్యుత్తు ప్రణాళిక ఏదీ?
యాసంగి వ్యవసాయ సాగు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 2,07,054 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది.
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి
పంటల సాగుకు దుక్కిదున్నుతున్న రైతు
యాసంగి వ్యవసాయ సాగు ప్రణాళిక రూపొందించారు. జిల్లాలో 2,07,054 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. సాగుకు కీలకమైన ఎస్సారెస్పీ నీటి సరఫరాను సైతం ఈ నెల 25 నుంచి విడుదల చేసేందుకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు అత్యంత కీలకమైన విద్యుత్తు సరఫరాకు మాత్రం యాసంగి ప్రణాళిక తయారు కాలేదు.
సాగునీటి సరఫరాలో మార్పులుండేనా?
జిల్లాలో వరి 1,92,809 ఎకరాల్లో, మిగిలిన ఎకరాల్లో కందులు, వేరుశెనగ, పెసలు, మినుముల పంటలు సాగు కానున్నాయి. సేద్యానికి సరిపడా విత్తనాలు, ఎరువులను వ్యవసాయశాఖ రైతులకు అందుబాటులో ఏర్పాటు చేసింది. టన్నుల వారీగా యూరియా 7,102, డీఏపీ 453, కాంప్లెక్స్ 4,277, ఎంఓపీ, ఇతరాలు కలిపి 625 టన్నుల్లో సిద్ధం చేశారు. విత్తనాల వారీగా బీపీటీ 3,144, ఆర్ఎన్ఆర్ 1,098, హెచ్ఎంటీ సోనా 250.9, జేజీఎల్ 2011, కేఎన్ఎం 130, ఇతరత్రా 1014 టన్నుల నిల్వలు ఏర్పాటు చేశారు. ఎస్సారెస్పీ నీటిని ఈ నెల 25 నుంచి ఒక తడి, జనవరిలో రెండు, ఫిబ్రవరిలో రెండు, మార్చిలో రెండు, ఏప్రిల్లో ఇంకో రెండు తడులు సరఫరా చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వేసవిలో నీటి తడుల అవసరాలను బట్టి పలు మార్పులు, చేర్పులు ఉండనున్నాయి.
అన్నదాతల్లో ఆందోళన
ప్రభుత్వం ఇప్పటికే 24 గంటల విద్యుత్తు సరఫరా అందిస్తుండగా పంట కోతల తర్వాత దాదాపు 10 నుంచి 12 గంటల విద్యుత్తు సరఫరా మాత్రమే అందిస్తున్నారు. రాత్రివేళల్లో సరఫరా నిలిపివేస్తుండగా ఉదయం, మధ్యాహ్నం అప్పుడప్పుడు రెండు, మూడు గంటలు మాత్రమే అందిస్తున్నారు. ఇప్పటికే నారుమళ్లు సిద్ధం చేస్తుండగా జనవరి మొదటి వారం నుంచి నాట్లు వేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్తు సరఫరా లేకుంటే సాగు ప్రశ్నార్థకం కానుంది. వరికి నీటికి అవసరం ఎక్కువ కావడం జనవరిలో నాట్లు ఊపందుకుంటే ఏప్రిల్ వరకు దిగుబడి వచ్చే అవకాశాలుంటాయి. మార్చిలో ఉష్ణోగ్రతల ఉద్ధృతి పెరిగితే నీటి తడుల సంఖ్య పెరుగుతుంది. ఇలాగే వ్యవసాయ విద్యుత్తు సరఫరా ఉంటే సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వారంలో ప్రణాళిక రూపొందిస్తాం - సుదర్శన్, జిల్లా విద్యుత్తు శాఖాధికారి
పంట కోతల అనంతరం ప్రస్తుతం సాగు కోసం విద్యుత్తు అవసరం తక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 47 వేల విద్యుత్తు కనెక్షన్లు ఉండగా కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే మంజూరు చేస్తున్నాం. వారం రోజుల్లో విద్యుత్తు సరఫరాకు సంబంధించిన ప్రణాళిక రూపొందిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు