మురుగు శుద్ధికి పడని అడుగులు!
‘తక్షణమే మురుగు జలాల శుద్ధికి చర్యలు తీసుకోనట్లయితే కఠిన చర్యలు తప్పవని’ కాలుష్య నియంత్రణ మండలి, గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించినా’... ‘నగరంలో మురుగు జలాల శుద్ధి కేంద్రాల ఏర్పాటునకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని’ నగర మేయర్ ప్రభుత్వాన్ని కోరినా సంబంధిత అధికారుల్లో చలనం రావడం లేదు.
ప్రతిపాదనల్లోనే పనులు... నత్తనడకన నిర్మాణాలు
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం
రామగుండంలో పూర్తికాని మురుగు జలాల శుద్ధి కేంద్రం
‘తక్షణమే మురుగు జలాల శుద్ధికి చర్యలు తీసుకోనట్లయితే కఠిన చర్యలు తప్పవని’ కాలుష్య నియంత్రణ మండలి, గ్రీన్ ట్రిబ్యునల్ హెచ్చరించినా’... ‘నగరంలో మురుగు జలాల శుద్ధి కేంద్రాల ఏర్పాటునకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయాలని’ నగర మేయర్ ప్రభుత్వాన్ని కోరినా సంబంధిత అధికారుల్లో చలనం రావడం లేదు. శ్రీపాద ప్రాజెక్టు నిర్మాణంలో సుందిళ్ల బ్యాక్ వాటర్తో మల్కాపూర్లోని రామగుండం నగరపాలిక మురుగు జలాల శుద్ధి కేంద్రం ముంపునకు గురికావడంతో పరిహారంగా రూ.11.25 కోట్లు ఇస్తే మరోచోట మురుగు జలాల శుద్ధి కేంద్రం నిర్మించుకుంటామని రామగుండం నగరపాలిక కోరినా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా గోదావరినది జలాలు కలుషితమవుతున్నాయి. తమవంతు బాధ్యతగా ఆయా ప్రాంతాల నుంచి వెలువడే మురుగు జలాల శుద్ధి కోసం సింగరేణి, ఎన్టీపీసీ యాజమాన్యాలు ప్రత్యేకంగా మురుగు జలాల శుద్ధి కేంద్రాలను నిర్మించుకోగా రామగుండం నగరపాలిక మాత్రం తమ బాధ్యతను విస్మరిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిధులు కేటాయించినా...
జీరో డిస్ఛార్జి సీవరేజ్ సిస్టమ్ కోసం రామగుండం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే ప్రత్యేక నిధుల్లోంచి రూ.12 కోట్లు కేటాయించినా అంచనాలే పూర్తి కాలేదు. గోదావరిఖని ప్రాంతం నుంచి వెలువడుతున్న మురుగు జలాల శుద్ధి కోసం మల్కాపూర్ శివారులో మురుగు జలాల శుద్ధి కేంద్రం నిర్మాణానికి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.97 కోట్లు కేటాయించారు. రామగుండం ప్రాంతం నుంచి వెలువడే మురుగు జలాల శుద్ధికి కేంద్రం నిర్మాణం కోసం డి.ఎం.ఎఫ్.టి. నిధులు రూ. 2.86 కోట్లు కేటాయించగా మల్కాపూర్లో శుద్ధి కేంద్రం ఊసే లేదు. రామగుండంలో నిర్మాణం కొంత మేరకు జరిగినప్పటికీ గుత్తేదారునకు బిల్లులు చెల్లించకపోవడంతో సుమారు ఏడాదిగా పనులు నిలిపివేశారు. ఎలాగోలా బిల్లులు చెల్లించడంతో ఇటీవలె పనులను తిరిగి ప్రారంభించారు. గోదావరిఖనిలో ప్రధాన మురుగు కాలువపైన గ్రీన్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ఎకో చైన్స్ విధానంలో మురుగు జలాలను శుద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నప్పటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. గోదావరిఖనిలోని రెండు ప్రధాన మురుగు కాలువల నుంచి వెలువడే మురుగు జలాలను శుద్ధి చేసేలా సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకుంది. నగరంలోని ప్రధాన మురుగు కాలువల్లో ప్రవహించే మురుగు జలాల శుద్ధి కోసం రూ.47 కోట్లు కేటాయించాలంటూ నగర మేయర్ డాక్టర బంగి అనిల్కుమార్ కొన్ని నెలల క్రితం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, కేంద్ర పట్టణాభివృద్ది మంత్రిని కలిసి వినతిపత్రాలు సైతం సమర్పించారు.
స్వచ్ఛ సర్వేక్షన్లోనూ..
నగరంలో మురుగు జలాల శుద్ది కేంద్రాలు లేకపోవడంతో స్వచ్ఛ సర్వేక్షణ్ మార్కుల కేటాయింపులోనూ రామగుండం నగరపాలిక వెనకబడుతోంది. సంపూర్ణ పారిశుద్ధ్యం, చెత్త నిర్వహణతో పాటు మురుగు జలాల శుద్ధి స్వచ్ఛ సర్వేక్షణ్లో కీలకమైన అంశంగా ఉంది. చెత్త నిర్వహణ అటకెక్కడంతో పాటు మురుగు జలాల శుద్ధి కేంద్రాల ఏర్పాటునకు చర్యలు తీసుకోకపోవడంతో ఈ విభాగంలో మార్కులను కోల్పోవాల్సి వస్తుంది. నగరంలో మురుగు జలాల శుద్ధి కేంద్రాలు ఉంటే స్వచ్ఛ సర్వేక్షణ్ల ‘వాటర్ ప్లస్’ కేటగిరీలో సుమారు 1000 మార్కులు వచ్చే అవకాశముంది. రామగుండంలో మురుగు జలాల శుద్ధి కేంద్రాలు లేకపోవడంతో ఈ మార్కులను కోల్పోవాల్సి రాగా ర్యాంకింగ్లో వెనకబడాల్సి వస్తోంది.
మానవ వ్యర్థాల్లోంచి ఎరువు...
మురుగు జలాల శుద్ధితో పాటు మానవ వ్యర్థాల నిర్వహణలోనూ ప్రత్యేక దృష్టి సారిస్తున్న ప్రభుత్వం ప్రత్యేకంగా మానవ వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పది నగరాల్లో రూ.16 కోట్లతో ఎఫ్.ఎస్.టి.పి. కేంద్రాల నిర్మాణం చేపట్టారు. దీనిలో భాగంగా గోదావరిఖని మల్కాపూర్ శివారులో రూ.1.6 కోట్లతో ఎఫ్.ఎస్.టి.పి. కేంద్రం ఏర్పాటు చేశారు. పనులు దాదాపుగా పూర్తికాగా కొద్ది పాటి పనులతో వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. కాగా ఈ విషయంలోనూ జాప్యం నెలకొంటోంది. కేంద్రం వినియోగంలో లేకపోవడంతో పాటు రక్షణ వ్యవస్థ లేదు. కేంద్రంలోని మరుగుదొడ్లు, మూత్రశాలలను ధ్వసం చేయడంతో పాటు అందులోని సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. నగరంలోని సెఫ్టిక్ ట్యాంకుల్లోంచి తీసుకొచ్చిన వ్యర్థాలను కేంద్రానికి తీసుకురాగానే ప్రత్యేక విధానంతో శుద్ధిచేసి ఎరువును తయారు చేస్తారు. అనంతరం జలాలను తిరిగి గోదావరిలోకి వదిలేస్తారు. దీంతో నదీ జలాలు కలుషితం కాకుండా ఉండే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
[ 29-03-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. -
కనుల పండువగా శివయ్య కల్యాణం
[ 29-03-2024]
ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. -
ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
[ 29-03-2024]
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. -
అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
[ 29-03-2024]
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. -
కరీంనగర్ బస్స్టేషన్ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు
[ 29-03-2024]
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. -
భార్య చేతిలో భర్త హతం
[ 29-03-2024]
భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. -
లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
వేసవి గట్టెక్కేనా!
[ 29-03-2024]
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్ ద్వారా మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. -
మట్టి గుట్టలు మాయం!
[ 29-03-2024]
మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-03-2024]
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. -
లక్ష్యానికి చేరువగా సింగరేణి
[ 29-03-2024]
సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. -
బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
[ 29-03-2024]
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాజపా పాలనపై ప్రజల్లో విసుగు
[ 29-03-2024]
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, కొప్పుల ఈశ్వర్లు అన్నారు. -
మతం పేరిట కేసీఆర్ రాజకీయం చేయలేదు: కేటీఆర్
[ 29-03-2024]
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్
[ 29-03-2024]
తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM