తొలిమెట్టు.. ఉడుంపట్టు
పిల్లల్లో అక్షర విజ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు విద్యాశాఖ చేపట్టిన ‘తొలిమెట్టు’ (ఎఫ్ఎల్ఎన్) సత్పలితమిస్తోంది. అధికారుల పర్యవేక్షణ ముమ్మరం చేయడంతో పురోగతి సాధ్యమవుతోంది.
వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ
పెరిగిన కనీస సామర్థ్యాలు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
విద్యార్థుల సాధన
పిల్లల్లో అక్షర విజ్ఞానాన్ని మెరుగుపరిచేందుకు విద్యాశాఖ చేపట్టిన ‘తొలిమెట్టు’ (ఎఫ్ఎల్ఎన్) సత్పలితమిస్తోంది. అధికారుల పర్యవేక్షణ ముమ్మరం చేయడంతో పురోగతి సాధ్యమవుతోంది. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తే ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలకు కొదవలేదు. ప్రాథమిక దశలో అక్షర పునాది పటిష్ఠం చేసేందుకు ఈ ఏడాది ఆగస్టు 16న ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. అంతకు ముందు కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కనీస సామర్థ్యాలు తెలుసుకునేందుకు అంతర్గత పరీక్ష నిర్వహించారు. తర్వాత నెలవారీగా పరీక్షలు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు నెలల ప్రగతి చూసుకుంటే కాస్తా గాడిలో పడినట్లయింది.
వారంలో అయిదు రోజుల సాధన
ప్రభుత్వ పాఠశాలల్లోని 3, 5వ తరగతి విద్యార్థులు చదవడం, రాయడం, చతుర్వేద ప్రక్రియలు కూడికలు, తీసివేతలపై పట్టు సాధించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. పాఠశాల విద్యాశాఖ కమిటీ, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేశారు. 1వ తరగతిలో నిమిషానికి 20 పదాలు, 2వ తరగతి పిల్లలు 25, 3వ, 4వ తరగతి పిల్లలు 40, ఐదో తరగతి విద్యార్థులు 50 పదాలను ధరాళంగా చదవాల్సి ఉంటుంది. వారంలో ఐదు రోజులు చదువు చెప్పి తర్వాత రోజు పరీక్ష కొనసాగుతోంది. ప్రతి నెల, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమీక్షిస్తున్నారు.
అక్షర పురోగతి
జిల్లాలో 353 ప్రాథమిక, 83 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 16,173 మంది చదువుతున్నారు. ప్రతి విద్యార్థిలోని కనీస సామర్థ్యాలను అంచనా వేస్తున్నారు. పాఠ్య పుస్తకాలను చదువున్నారా? రాయగలుతున్నారా? అనే విషయాలను ఉపాధ్యాయులు పరిశీలిస్తున్నారు. పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి కారణాలు తెలుసుకుని పంపించాలని వివరిస్తున్నారు. ఉపాధ్యాయులు నిరంతరంగా శ్రమిస్తుండటంతో నాలుగు నెలల ప్రగతి కంటే సగానికి పైగా పెరిగింది. విద్యార్థుల అక్షర ప్రగతిని ప్రత్యేక యాప్లో నిక్షిప్తం చేస్తున్నారు.
గణితంలో తడబాటు
గణిత అభ్యసన సామర్థ్యాల్లో విద్యార్థులు తడబడుతున్నారు. కూడిక, తీసివేతలు తప్ప మిగిలిన భాగహారం, గుణకారాల్లో వెనకబడ్డారు. ఆగస్టులో భాగహారంలో 5 శాతం ఉంటే నవంబర్లో ఒక్క శాతం కలుపుకొని, అంటే 6 శాతం మాత్రమే సాధించారు. గుణకారంలో 7 నుంచి 18 శాతానికి ఆంగ్లం చదవడంలో 18 నుంచి 25 శాతానికి చేరుకున్నారు. రాయడంలో 8 శాతానికి 16 పెరిగింది. చదవడంలో కంటే పిల్లలు రాయడంలో దృష్టిసారించలేకపోతున్నారు. పాఠాలు ఆర్థం చేసుకోవడం తక్కువే.
ప్రమాణాల పెంపే లక్ష్యం
- మాధవి, జిల్లా విద్యాధికారిణి
తొలిమెట్టులో విద్యార్థుల ప్రమాణాలు పెంపు లక్ష్యంగా పని చేస్తున్నాం. ప్రతి విద్యార్థి అక్షర ప్రగతిని అంచనా వేస్తున్నారు. విద్యార్థుల లోపాలను సరిదిద్దుకుంటున్నారు. నాలుగు నెలల ప్రగతిలో మెరుగుపడింది. అన్ని పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు