పంచాయతీలకు శుభవార్త
గత ఎనిమిది నెలలుగా పంచాయతీలు నిధుల లేమితో నీరసించాయి. గ్రామాల్లో ఏ అభివృద్ధి పనైనా డబ్బులతో కూడుకొని ఉంటుంది.
15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల
న్యూస్టుడే, కరీంనగర్ కలెక్టరేట్
దుర్శేడు గ్రామపంచాయతీ కార్యాలయం
గత ఎనిమిది నెలలుగా పంచాయతీలు నిధుల లేమితో నీరసించాయి. గ్రామాల్లో ఏ అభివృద్ధి పనైనా డబ్బులతో కూడుకొని ఉంటుంది. సర్పంచులు అప్పులు తెచ్చి పనులు నిర్వహిస్తున్న సందర్భంలో కేంద్రం అందించే 15వ ఆర్థిక సంఘం మొదటి దఫా నిధులు విడుదల చేసి పంచాయతీలు కొత్తగా తీసిన ఖాతాలకు జమ చేసింది. ఈ నిర్ణయంతో సర్పంచులకు ఊరట లభించినట్లయింది. త్వరలో పూర్తి మొత్తంలో విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఎన్ని నిధులు విడుదలయ్యాయనే ప్రత్యేక కథనం.
ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి..
పంచాయతీలకు కేంద్ర మూడు నెలలకోమారు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తుంది. అయితే గత ఏప్రిల్ నుంచి జమ కాకపోవడంతో రాష్ట్రం నుంచి ప్రతి నెలా వచ్చేవి కూడా మూడు నెలలుగా అందకపోవడంతో సర్పంచులకు, కార్యదర్శులకు నిర్వహణ భారమైంది. ఎనిమిది నెలల అనంతరం మంజూరు కావడంతో ఊరట లభించినట్లయింది. పంచాయతీలకు కేంద్రం నిధులు విడుదల చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే.. ఖాజానా శాఖ ద్వారా పంచాయతీ ఖాతాల్లో జమ అయ్యేవి. రాష్ట్ర ప్రభుత్వం మధ్యలో ఉండేది. కేంద్రం పంచాయతీలకు నేరుగా విడుదల చేయాలనే ఆలోచన చేసింది. పంచాయతీలతో కొత్తగా బ్యాంకు ఖాతాలను తెరిపించింది. ఆ ఖాతాలకు ఇప్పుడు నిధులు విడుదల చేసింది.
తప్పిన ఫ్రీజింగ్ బాధలు..
కేంద్రం ఇచ్చే నిధులను నేరుగా ఆయా పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తుండడంతో ఖాతాల ఫ్రీజింగ్ నుంచి బయట పడినట్లయింది. గతంలో కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా వేరే అవసరాలకు వినియోగించుకునేది. పంచాయతీ ఖాతాలను ఫ్రీజింగ్లో ఉంచేది. ఇలా మూడు, నాలుగు నెలల వరకు ఖాతాలు ఫ్రీజింగ్లో ఉంచేది. పంచాయతీలో డబ్బులున్నా అవసరానికి వినియోగించుకోలేని పరిస్థితి నెలకొనేది. కానీ ప్రస్తుతం ఖాతాలను తెరిపించి నేరుగా జమ చేస్తుండటంతో ఆయా సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి మొత్తం జమ చేయాలి
- రుద్రభారతి, సర్పంచి, జూబ్లీనగర్, కరీంనగర్ గ్రామీణ మండలం
ప్రస్తుతం కేంద్ర నేరుగా నిధులు ఖాతాలు సవ్యంగా ఉన్నాయా లేదా అనేదాని కోసం ట్రయల్రన్ నిర్వహించి మొదటి విడత విడుదల చేశారు. రావాల్సిన పూర్తి మొత్తం డబ్బులు త్వరగా అందజేస్తే పల్లె ప్రజలకు మేలు చేసిన వారవుతారు. ఇప్పటికే గ్రామాల్లో విద్యుత్తు బిల్లులు బకాయిపడి ఉన్నాయి. ట్రాక్టర్ బ్యాంకు రుణం, పారిశుద్ధ్య సిబ్బంది వేతనాలు ఇవ్వన్నీ చెల్లించడానికి కష్టమవుతోంది. ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేయాలి.
కొత్త బ్యాంకు ఖాతాల్లో జమ
-వీరబుచ్చయ్య, జిల్లా పంచాయతీ అధికారి, కరీంనగర్
పంచాయతీల్లో కొత్తగా తీసిన బ్యాంకు ఖాతాలన్నీ పీఎఫ్ఎంఎస్కు అనుసంధానం చేశాం. ఖాతాలన్నీ సవ్యంగా ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి ప్రతి పంచాయతీకి కొన్ని నిధులు జమ అయ్యాయి. త్వరలో పూర్తి మొత్తం రానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!