ధరణి దగాలో కొత్త కోణాలు?
తిమ్మిని బమ్మి చేయడంలో సిద్ధహస్తులమని నిరూపించారు. ఉన్నతాధికారులనే కంగుతినిపించారు. భూ మోసాల్లో కొత్త కోణాలను ఆవిష్కరించారు.
లోలోపలే తప్పును సరిదిద్దే ప్రయత్నం
ఈనాడు, కరీంనగర్
తిమ్మిని బమ్మి చేయడంలో సిద్ధహస్తులమని నిరూపించారు. ఉన్నతాధికారులనే కంగుతినిపించారు. భూ మోసాల్లో కొత్త కోణాలను ఆవిష్కరించారు. కాసుల కక్కుర్తి కోసం ఉన్నతాధికారుల కళ్లుగప్పారు. జిల్లాలో సంచలనాన్ని రేకెత్తించిన ధరణి రికార్డులో పేరు మార్పిడి వ్యవహారంలో కొందరు అక్రమార్కుల తీరిది. రెవెన్యూ శాఖనే కంగు తినిపించేలా జరిగిన ఘోర తప్పిదాన్ని సరిదిద్దుకునే పనిలో ఉన్నతాధికారులున్నారు. శాఖకు అప్రతిష్ఠ తెచ్చేలా జరిగిన ఈ లోపంపై లోలోపల గుస్సా చేస్తూనే అసలు పాత్రధారులెవరు..? సూత్రధారులెవరనే కోణంలో విచారణను ఇన్నాళ్లుగా కొనసాగించారు. విచారణలో బాధ్యులుగా గుర్తించిన ఇద్దరు పొరుగు సేవల సిబ్బందిపై వేటు వేసినట్లు తెలిసింది. వీరి వెనుక ఉండి అసలు ఈ భూబాగోతాన్ని నడిపించిన ఓ తహసీల్దార్ ప్రమేయంపైనా నజర్ పెట్టారు. పలుమార్లు విచారించడంతో కొన్ని ‘కొత్త’ మోసాలు బయటపడినట్లు తెలిసింది.
అసలేం జరిగిందంటే..
కరీంనగర్కు దగ్గరలో ఉన్న ఓ మండల కేంద్రంలోని విలువైన భూమి పట్టాలో రాత్రికి రాత్రి పేరు మారిపోయింది. ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న 1.07 గుంటల జాగ ధరణి రికార్డుల్లో అసలు యజమాని స్థానంలో మరొకరి పేరు వచ్చి చేరింది. బాధితుల నుంచి ఎలాంటి అర్జీ లేకుండానే లోలోపల నడిచిన ఈ వ్యవహారం భూమోసాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. జిల్లా కలెక్టరుకు తెలియకుండానే ఆయన పేరిట డిజిటల్ సంతకంతో ఈ తతంగం నడిచింది. భూయజమానులు తమ పేరు స్థానంలో వేరే వ్యక్తి పేరు వచ్చిన విషయమై జిల్లా రెవెన్యూ అధికారులను కలవడంతో అక్రమం వెలుగులోకి వచ్చింది. ఇంటి దొంగను గుర్తించేందుకు.. గుట్టు తేల్చేందుకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు నడుంబిగించారు. ఈ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. బాధితుడికి న్యాయం చేస్తామనేలా భరోసా ఇచ్చారు. ఈ మోసంలో బాధ్యులను కనుక్కునే బాధ్యతను కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులకు అప్పగించారు. గత కొన్నాళ్లుగా విచారణల పేరిట అక్రమాన్ని గుర్తించే పనిలో ఉన్న పోలీసులకు కీలక సమాచారం లభించినట్లు తెలిసింది. ఓ తహసీల్దార్తోపాటు ధరణి పోర్టల్ను పర్యవేక్షించే ఇద్దరు సిబ్బంది ప్రమేయమున్నట్లు ఉన్నతాధికారులు గుర్తించినట్లు సమాచారం. ధరణిని పర్యవేక్షించే ఇద్దరు ఉద్యోగుల పాత్ర పక్కాగా ఉందని తెలియడంతో వారిద్దరిని విధుల నుంచి తొలగించారు. తహసీల్దార్ను కూడా పలుమార్లు విచారించారు. అయినా ఎక్కడా కాగితం రూపంలో ఆయన తప్పు చేసినట్లు తెలియలేదనే భావనతో ఆయనపై చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. గతంలో ఇలాంటి తప్పిదాలలో ఆ అధికారి హస్తం ఉందనే విషయాన్ని మాత్రం ఉన్నతాధికారులు గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మమ అనిపించేలా చర్యలు
భూ దందా విపరీతంగా జరిగే మండలం అవడంతో ఆ అధికారి వ్యవహారమే ప్రత్యేకంగా ఉంటుందనేది రెవెన్యూ శాఖలోనే వినిపిస్తున్న మాట. భూరికార్డుల విషయంలో తనకున్న పట్టును ఆసరాగా చేసుకుని చేతివాటాన్ని చూపించారనే ఆరోపణలున్నాయి. ఇతని చర్యలతో బాధపడ్డ భూ యజమానులు పలుమార్లు ఉన్నతాధికారులతోపాటు మానవ హక్కుల సంఘాలను ఆశ్రయించిన సందర్భాలున్నాయి. అయినా ఆయన ఎవరికీ భయపడననే డాబుని మాత్రం అందరి ముందు చూపిస్తారు.. ప్రభుత్వ భూములు పరులపరమైన కేసుల్లోనూ ఈయన హస్తముందనే ఆరోపణలున్నాయి. తనకు కొందరు రాజకీయ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే తీరుని మాటల్లో ప్రదర్శిస్తాడనే ప్రచారముంది. ఆయనపై ప్రజావాణి సహా ఇతర సందర్భాల్లో ఎన్ని ఫిర్యాదులు అందినా ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఈధరణి రికార్డులో పేరు మార్పు వ్యవహారంలోనూ శాఖాపరంగా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులే వెనుకడుగేసే పరిస్థితి కనిపిస్తుందనే ప్రచారం జిల్లాలో జరుగుతోంది. టాస్క్ఫోర్స్ విచారణను కూడా నిలిపివేసినట్లు సమాచారం. ఈ విషయమై మాట్లాడేందుకు జిల్లా ఉన్నతాధికారులు నిరాకరిస్తుండటం గమనార్హం.!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకా.. వెంకటస్వామికి ఆ పేరెలా వచ్చింది?
[ 24-04-2024]
కాంగ్రెస్ పార్టీ దివంగత, కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి ‘కాకా’గానే ఎక్కువ మందికి సుపరిచితులు. ఆయనకు ఈ పేరు రావడం వెనుక ఆసక్తికర అంశం ఉంది. -
యాప్ కష్టాలు
[ 24-04-2024]
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన యాప్ల్లో సమాచారం నిక్షిప్తం చేయాల్సి ఉంది. -
నిర్వహణ భారం.. కమీషన్లో కోత
[ 24-04-2024]
కేంద్రాల నిర్వహణ భారంగా మారగా.. వచ్చిన కమీషన్లో కోత విధించడంతో నిర్వాహకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. -
ఇక ట్వంటీ20 పోరు!
[ 24-04-2024]
పోలింగ్ తేదీకి బుధవారం నుంచి సరిగ్గా ఇరవై రోజులుంది.. అచ్చంగా ట్వంటీ20 క్రికెట్ ఆటలోని 20 ఓవర్ల మాదిరి సమరం. -
మిగిలింది రెండు రోజులే!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలి అంకం రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల స్వీకరణ పూర్తవనుంది. -
నకిలీ పత్రాలు సృష్టించి.. ఇల్లు ధ్వంసం
[ 24-04-2024]
నకిలీ పత్రాలు సృష్టించి, ఇంటిని ధ్వంసం చేసి, దాడికి పాల్పడిన అయిదుగురిని కరీంనగర్ కొత్తపల్లి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. -
పార్టీ పెద్దల సమ్మతితోనే రాజేందర్ నామినేషన్
[ 24-04-2024]
పార్టీ పెద్దల సమ్మతితోనే తామంతా కలిసి కాంగ్రెస్ తరఫున వెలిచాల రాజేందర్రావుతో నామినేషన్ వేయించామని, గెలిపిం చుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. -
అతివల ఉపాధికి ఆదరువేదీ!
[ 24-04-2024]
రాష్ట్రంలో 6 లక్షల మంది బీడీ కార్మికులుండగా అత్యధికంగా నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నారు. -
ఆ పది మందికే 50 శాతం ఓటర్ల మద్దతు
[ 24-04-2024]
ఎన్నికల్లో ప్రత్యర్థి కంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా విజయం సాధించినట్లే. అయితే గెలుపొందిన అభ్యర్థికి నియోజకవర్గంలోని ఎంత మంది ఓటర్ల మద్దతు ఉందనేది పోటీలో ఉన్న అభ్యర్థులు, నమోదైన పోలింగ్ శాతాన్ని బట్టి మారుతుంది. -
ఆయుధాలు అప్పగించారు..
[ 24-04-2024]
వ్యక్తిగత భద్రత కోసం లైసెన్సు తీసుకొని వెంట ఉంచుకున్న ఆయుధాలను ఉమ్మడి జిల్లావాసులు ఠాణాలకు అప్పగించారు. -
మాతాశిశుకు తప్పని ఉక్కపోత
[ 24-04-2024]
చంటి బిడ్డలు, బాలింతలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వేసవి ఉక్కపోత తప్పడం లేదు. -
బ్యాలెట్ యుద్ధానికి చకచకా సన్నద్ధం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
పనులకు ఆటంకాలు.. రాకపోకలకు అవస్థలు
[ 24-04-2024]
రెండు జిల్లాల సరిహద్దులోని మానేరు వాగు దాటడానికి ఇరువైపులా గ్రామాల ప్రజలు దశాబ్దాల తరబడి నానా అవస్థలు పడుతున్నారు. -
తైబజార్... చిరు వ్యాపారుల బేజార్
[ 24-04-2024]
పురపాలక సంఘంలో తైబజార్ గుత్తేదారు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడు.
తాజా వార్తలు (Latest News)
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ