బృహత్తర ప్రణాళికపైనే ఆశలు
భక్తుల కొంగుబంగారం..కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న ఆలయంపై ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వరాలజల్లు కురిపించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మల్యాల, న్యూస్టుడే: భక్తుల కొంగుబంగారం..కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న ఆలయంపై ఎట్టకేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వరాలజల్లు కురిపించడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి హామీ ఇవ్వడంతో జిల్లావాసులు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొండగట్టులో భక్తులకు సరైన వసతులులేక అసౌకర్యానికి గురవుతున్నారని, తరచూ ఆయా పార్టీల నాయకులు ఆందోళనలు చేయడం పరిపాటిగా మారింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట పరిధిలోని ఈ ఆలయం డిప్యూటీ కమిషనరు హోదాకలిగి, ఏటా రూ.20కోట్లకుపైగా ఆదాయం సమకూరుతుండగా భక్తుల ఇక్కట్లు మాత్రం తీరడంలేదు. ఆలయ పరిధిలో మాస్టర్ప్లాను అమలు చేయాలన్న ప్రతిపాదనలు ఏళ్ల తరబడి అమలుకు నోచని వైనంపై పలుమార్లు ‘ఈనాడు’లో కథనాలు ప్రచురితమయ్యాయి. ముఖ్యమంత్రిగా 8 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ మొదటిసారిగా జగిత్యాల బహిరంగ సభలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు కేటాయించడంతోపాటు యాదాద్రి తరహాలో తీర్చి దిద్దుతామని పేర్కొనడంతో వివిధ పార్టీల నాయకులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
చేపట్టాల్సిన పనులు..
కొండగట్టులో వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి ‘మాస్టర్ ప్లాను అమలు చేయాల్సి ఉంది. దాదాపు 20 ఏళ్ల క్రితమే మాస్టర్ ప్లాను కోసం ఉన్నతాధికారులు పలుమార్లు ప్రణాళికలు రూపొందించినా అమలుకు నోచలేదు. దీంతో ఆలయం పక్కన కొన్ని నిర్మాణాలు చేపట్టి కూల్చేయడం మళ్లీ నిర్మించడం వల్ల నిధుల దుర్వినియోగం జరుగుతోంది. ఆలయానికి ప్రాకార మండపం విస్తరించి, భక్తులు సేదతీరడానికి డార్మిటరీ హాళ్లు, బస చేయడానికి దాదాపు వంద గదుల నిర్మాణం చేపట్టాలి. కొండ దిగువ నుంచి మెట్లదారి పక్కన కొండపైకి ‘రోప్వే’ నిర్మాణం చేపట్టాలి. కొండపైన హనుమాన్ దీక్షాపరులు మాలవిరమణ చేయడానికి అవసరమైన మండప నిర్మాణం, పురాతన మెట్లదారిని అభివృద్ధి పర్చాల్సి ఉంది. కొండపైన భక్తులు తమ వాహనాలు నిలుపుకోవడానికి స్థలం సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ‘వై’ జంక్షను సమీపంలోని ఘాట్రోడ్డుపక్కన ప్రభుత్వ స్థలం ఉన్నప్పటికీ దానిని పార్కింగ్ కోసం వినియోగించుకోకపోవడంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి నాలుగైదు ఎకరాల్లో భూమిని చదును చేసి పార్కింగ్ కోసం వినియోగించాలి. కొండపైన జింకల పార్కు ఏర్పాటు చేయాలి. కొండగట్టు అంజన్న పేరిట 43ఎకరాల విలువైన భూములుండగా..నాలుగేళ్ల క్రితం కొండగట్టు ప్రాంతంలోని మరో 333 ఎకరాల ప్రభుత్వ భూములను కూడా అప్పటి జిల్లా కలెక్టరు శరత్ ఆలయానికి స్వాధీనం చేశారు. భక్తుల కోసం సత్రాలను, అతిథి గృహ భవనాలను నిర్మించాలి. అన్నదాన సత్రం, ప్రసాదం తయారీ కోసం ప్రత్యేక భవనాలు అవసరం. దాదాపు నాలుగేళ్ల క్రితం కొండగట్టు ఘాట్రోడ్డు పక్కన ఆర్టీసీ బస్సు బోల్తా పడి 65 మంది వరకు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తర్వాత బాధిత కుటుంబాలను విస్మరించారని ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారిని ఆదుకుని, ఘాట్రోడ్డును డబుల్రోడ్డుగా విస్తరించి కొన్ని చోట్ల ప్రమాదకరమైన వాలు, మూలమలుపులను సరిచేయాల్సి ఉంది. నిపుణులు సూచించినదాని ప్రకారం కొండపైకి మరో ఘాట్రోడ్డు నిర్మాణం చేపట్టాల్సిన అవసరాన్ని పరిశీలించాలి. దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఆలయాన్ని యాదాద్రి తరహాలో రూపొందించాలని భక్తులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!