logo

విధి నిర్వహణలో ఉపాధ్యాయిని హఠాన్మరణం

విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయిని హఠాన్మరణం చెందిన విషాద ఘటన పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం చోటు చేసుకుంది.

Published : 19 Jan 2023 05:16 IST

సునీత

మంథని గ్రామీణం, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయిని హఠాన్మరణం చెందిన విషాద ఘటన పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం చోటు చేసుకుంది. తోటి ఉపాధ్యాయుల వివరాల ప్రకారం.. సైన్స్‌ టీచర్‌ తన్నీరు సునీత (37).. మంచిర్యాల నుంచి మంథని పాఠశాల విధులకు హాజరవుతున్నారు. విద్యార్థులకు పాఠం బోధించి స్టాఫ్‌ రూమ్‌కు వచ్చి ఒక్కసారిగా కుప్పకూలారు. అప్రమత్తమైన తోటి సిబ్బంది వెంటనే 108కు సమాచారం అందించారు. పాఠశాలకు చేరుకున్న 108 సిబ్బంది ఆమె అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. గుండెపోటు కారణంగానే మృతి చెందినట్లు భావిస్తున్నామని పేర్కొన్నారు. అప్పటి వరకు తమతో ఉన్న ఉపాధ్యాయురాలు క్షణాల వ్యవధిలోనే మృతిచెందడాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. సునీత భర్త అంతర్గాం మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తుండగా.. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని