కార్మికులకు సామాజిక భద్రతే లక్ష్యం
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించి వివిధ సంక్షేమ పథకాలను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈశ్రమ్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది.
ఈ-శ్రమ్లో నమోదుకు చర్యలు
ఈ-శ్రమ్ గురించి వివరిస్తున్న అధికారి
న్యూస్టుడే, ధర్మపురి గ్రామీణం: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించి వివిధ సంక్షేమ పథకాలను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈశ్రమ్ నమోదు ప్రక్రియను ప్రారంభించింది. పథకంలో చేరిన ప్రతి ఒక్కరికి 12 అంకెల యూనివర్సల్ నెంబరు ఇస్తారు. ఈ కార్డు తీసుకున్న వారికి రానున్న రోజుల్లో అన్ని రకాల సామాజిక భద్రత పథకాలతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటు ఈశ్రమ్లో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షల ప్రమాద బీమా అందించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 4,47,545 మంది కార్మికులు ఈశ్రమ్లో నమోదు చేసుకున్నారు. ఈ పథకంలో ప్రభుత్వ ఉద్యోగులు, పీఎఫ్, ఈఎస్ఐ, ఆదాయపు పన్ను కట్టేవారు మినహా ప్రతి ఒక్క కార్మికుడు చేరేందుకు అర్హులవుతారు. ఉమ్మడి జిల్లాలో అత్యధిక మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీరికి లబ్ధి చేకూర్చేందుకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేయడంతో పాటు ఇతర శాఖల సహాయాన్ని తీసుకుంటున్నారు. అర్హులైన వారని ఈశ్రమ్లో చేర్చే విధంగా కృషి చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల సహాయంతో వేలాది మంది కార్మికుల పేర్లను నమోదు చేయించారు.
అన్ని వర్గాల వారికి...
అసంఘటిత రంగంలో ఉన్న అత్యధిక మందికి సామాజిక భద్రత కలిగించే పథకం ఈశ్రమ్. కార్మికుల సంక్షేమానికి అనేక రకాల పథకాలున్నప్పటికీ పలు వృత్తుల్లో ఉన్న వారు ఈశ్రమ్లో పేరు నమోదు చేయించుకునేందుకు అర్హులు. రైతులు, కుల వృత్తులు చేసుకునే వారు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందేవారు, సేవారంగం, ఇళ్లలో పనిచేసేవారు, కొరియర్ బాయ్స్, ఉపాధి హామీ కూలీలు, ఆశా వర్కర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇందులో చేరడం వల్ల సామాజిక భద్రత ఉంటుంది.
పరిహారం విషయంలో అందని ఆదేశాలు
ఈ శ్రమ్లో నమోదు చేసుకొని ప్రమాదాలకు గురైన వారి కుటుంబ సభ్యులు పొందే బీమా పరిహారం విషయంలో ఇంకా ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో అనేక మంది పరిహారం కోసం ఎదురు చూస్తున్నారు. పరిహారం విషయానికి సంబంధించి ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి కార్మిక శాఖ సమావేశంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
రాజారం కృష్ణసాగర్, సహాయ కార్మిక శాఖాధికారి, జగిత్యాల
అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈశ్రమ్లో నమోదు చేసుకొని లబ్ధి పొందాలి. అర్హులైన ప్రతీ ఒక్కరూ దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక చొరవ తీసుకొని నమోదు చేయిస్తున్నాం. ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, నామినీ వివరాలతో సీఎస్సీ కేంద్రాలు, మీసేవ, అన్లైన్ ద్వారా లేదా స్మార్ట్ఫోన్లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పరిహారం విషయంలో ఆదేశాలు రాగానే లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పత్తి రైతులు, వ్యాపారుల ఆందోళన
[ 23-04-2024]
ఎన్నికల కోడ్ పేరుతో తనిఖీలు నిర్వహించి బ్యాంకుల నుంచి డబ్బును తీసుకొస్తున్న తమను ఇబ్బందులకు గురి చేయవద్దని జమ్మికుంట పత్తి మార్కెట్ వద్ద వ్యాపారులు, పత్తి రైతులు ఆందోళనకు దిగారు. -
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
[ 23-04-2024]
పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ముత్తారం మండలం ఓడేడు పరిధిలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. -
పిల్లల అల్లరిని దారి మళ్లించండి
[ 23-04-2024]
పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. -
మోదీ వ్యాఖ్యల్లో ఓటమి భయం
[ 23-04-2024]
లోక్సభ మొదటి దశ ఎన్నికల తీరును చూసిన ప్రధాని మోదీ ఓటమి భయంతో దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తుందని వ్యాఖ్యానించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. -
నాలుగో రోజు 25 నామినేషన్లు
[ 23-04-2024]
నామినేషన్ల ప్రక్రియ నాలుగో రోజు సోమవారం కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ స్థానాలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. -
హామీలను విస్మరించిన ప్రభుత్వం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ అన్నారు. -
సెప్టెంబరులో చక్కెర కర్మాగారం తెరిపిస్తాం
[ 23-04-2024]
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. -
అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా!
[ 23-04-2024]
ప్రాంతానికి కొత్త కావచ్చు, రాజకీయాలకు, ప్రజా సేవకు కొత్తకాదని, అవకాశమిస్తే పార్లమెంట్ పరిధిని అభివృద్ధి చేసి చూపిస్తానని నిజామాబాద్ భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
దారులన్నీ కొండగట్టుకే
[ 23-04-2024]
తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి దీక్షాపరులు తరలివస్తున్నారు. -
ఓటరు నమోదులో ఫలించిన చైతన్యం
[ 23-04-2024]
ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కు నమోదుకు యువతలో నూతనోత్సాహం ఉరకలేసింది. -
ప్రత్యేక నిధులు.. తీరనున్న ఇక్కట్లు
[ 23-04-2024]
రామగుండం నగరపాలక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు అమృత్-2.0, యు.ఐ.డి.ఎఫ్.(అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్) నిధులతో పరిష్కారం కానున్నాయి. -
కాంగ్రెస్ నైజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
[ 23-04-2024]
భారాస పాలనలోనే అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ ఫలాలు అందుకున్నారని, గడిచిన నాలుగు నెలల కాలంలో సంక్షేమ పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ పాలకుల నైజాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. -
లెక్కలు తేలేనా?
[ 23-04-2024]
జిల్లా వస్త్ర పరిశ్రమకు గత ప్రభుత్వం సంక్షేమ, పాఠశాల విద్యాశాఖలకు సంబంధించిన వస్త్రోత్పత్తుల ఆర్డర్లు ఇచ్చింది. -
నిధులున్నా ప్రారంభం కాని పనులు
[ 23-04-2024]
గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు రవాణా వ్యవస్థ మెరుగుపరిచి రెండు జిల్లాల గ్రామాలను అనుసంధానం చేయాలనే లక్ష్యంతో తారు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
అమాత్యులుగా ఆ నలుగురు
[ 23-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి లోక్సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM