సర్వాంగ సుందరం!
ఈ ఫొటోలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలోని ప్రాథమిక పాఠశాల. మరో చిత్రంలో గతంలో పాఠశాల స్వరూపాన్ని చూడవచ్చు.
నేటి నుంచి ‘మన ఊరు- మన బడి’ పాఠశాలలు ప్రారంభం
న్యూస్టుడే, మెట్పల్లి, మేడిపల్లి
ఈ ఫొటోలో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది మేడిపల్లి మండలం తొంబర్రావుపేటలోని ప్రాథమిక పాఠశాల. మరో చిత్రంలో గతంలో పాఠశాల స్వరూపాన్ని చూడవచ్చు. ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం కింద పాఠశాలల్లో సదుపాయాల కల్పనకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేయడంతో పాఠశాలల స్వరూపాలే మారిపోతున్నాయి. జిల్లాలో తొలి విడత 274 పాఠశాలలను ఈ కార్యక్రమం కింద ఎంపిక చేయగా ఫిబ్రవరిలో జిల్లాలో 19 పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. మిగిలిన పాఠశాలల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయించి మలిదశ కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు.
‘మన ఊరు-మన బడి’ కింద పాఠశాలల స్వరూపాలే మారిపోనున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చి దిద్దాలన్న సంకల్పం ఈ కార్యక్రమం ద్వారా నెరవేరనుంది. గత ఏడాదే పాఠశాలల పనులు ప్రారంభమైనా వివిధ కారణాలతో కాస్తంత ఆలస్యమైనా నిర్మాణాలు ఈనాటికి పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ‘మన ఊరు- మన బడి’ కింద పాఠశాలలు ప్రారంభించాలంటూ ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. నియోజకవర్గాల వారీగా ప్రారంభానికి సిద్ధమైన పాఠశాలలను అందుబాటులోని మంత్రులు, శాసనసభ్యులు, కలెక్టర్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 274 పాఠశాలలు తొలివిడతగా ఎంపిక చేశారు. అంచనా వ్యయాన్ని బట్టి పాఠశాలలను 3 కేటగిరీలుగా వర్గీకరించారు. కాగా జిల్లాలో ప్రస్తుతానికి 19 పాఠశాలలు ప్రారంభానికి సిద్ధమైనట్లు అధికారులు నివేదించారు. ‘మన ఊరు మన బడి కింద నిర్దేశించిన 12 పనులతో పాటు, మైదానం అభివృద్ధి, పచ్చదనం పెంపు, లాన్, గార్డెనింగ్ పనులు చేపట్టారు. పనులు పూర్తయిన పాఠశాలలను ఫిబ్రవరి 1న ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయా పాఠశాలలను ప్రారంభించనున్నారు. సర్పంచుల పర్యవేక్షణలో కొన్ని పనులు పూర్తి చేయించారు. గ్రీన్బోర్డ్, డ్యూయల్ డెస్క్, ప్రధానోపాధ్యాయుల కుర్చీ, టేబుల్, ఉపాధ్యాయుల కుర్చీలు, టేబుల్స్ హైదరాబాద్ నుంచి తెప్పించేలా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో నిర్ణయించారు. పాఠశాలల్లో రంగులు కూడా హైదరాబాద్లోని ఓ సంస్థ ఆధ్వర్యంలో వేయించారు. ప్రస్తుతానికి కాస్తంత ఫర్నీచర్ మినహా సామగ్రి పాఠశాలలకు చేరింది. ఒకట్రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ఫర్నీచర్ పాఠశాలలకు చేరనుందని అధికారులు పేర్కొన్నారు.
ప్రారంభించనున్న పాఠశాలలు ఇవే..
జగిత్యాల: ఎంపీపీఎస్ ధరూరు (బీజే కాలనీ), ఎంపీపీఎస్ సంగంపల్లి, ప్రభుత్వ పీఎస్ ఫోర్టు ఉర్దూమీడియం, ఎంపీపీఎస్ చలిగల్ తె.మీ.
మెట్పల్లి: ఎంపీపీఎస్ శివాజీనగర్
కోరుట్ల: జడ్పీహెచ్ఎస్ ఎకిన్పూర్, జడ్పీహెచ్ఎస్ మాదాపూర్
మేడిపల్లి: ఎంపీపీఎస్ తొంబర్రావుపేట, ఎంపీపీఎస్ కల్వకోట
గొల్లపల్లి: ఎంపీపీఎస్ చెందోలి, ఎంపీపీఎస్ రాఘవపట్నం
మల్యాల: ఎంపీపీఎస్ రామన్నపేట, జడ్పీహెచ్ఎస్ రామన్నపేట
రాయికల్: జడ్పీహెచ్ఎస్ రాయికల్, ఎంపీపీఎస్ కుమ్మర్పల్లి
సారంగాపూర్: ఎంపీపీఎస్ పెంబట్ల, ఎంపీపీఎస్(ఎస్) పెంబట్ల
వెల్గటూర్: ఎంపీపీఎస్ బీసీ కాలని గొడిశెలపేట, ఎంపీపీఎస్ కొత్తపేట
దశలవారీగా అన్ని పాఠశాలలు: జగన్మోహన్రెడ్డి, డీఈవో
జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ పథకం కింద ఎంపిక చేసిన అన్ని పాఠశాలలను దశలవారీగా సుందరంగా తీర్చిదిద్దుతాం. ప్రస్తుతానికి 19 నమూనా పాఠశాలల పనులు పూర్తయ్యాయి. ఫర్నీచర్ రావాల్సి ఉంది. ఫిబ్రవరి 1న వాటిని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. జిల్లాలోని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో ముందుకు వెళ్తాం. ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
[ 29-03-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. -
కనుల పండువగా శివయ్య కల్యాణం
[ 29-03-2024]
ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. -
ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
[ 29-03-2024]
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. -
అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
[ 29-03-2024]
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. -
కరీంనగర్ బస్స్టేషన్ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు
[ 29-03-2024]
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. -
భార్య చేతిలో భర్త హతం
[ 29-03-2024]
భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. -
లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
వేసవి గట్టెక్కేనా!
[ 29-03-2024]
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్ ద్వారా మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. -
మట్టి గుట్టలు మాయం!
[ 29-03-2024]
మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-03-2024]
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. -
లక్ష్యానికి చేరువగా సింగరేణి
[ 29-03-2024]
సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. -
బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
[ 29-03-2024]
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాజపా పాలనపై ప్రజల్లో విసుగు
[ 29-03-2024]
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, కొప్పుల ఈశ్వర్లు అన్నారు. -
మతం పేరిట కేసీఆర్ రాజకీయం చేయలేదు: కేటీఆర్
[ 29-03-2024]
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్
[ 29-03-2024]
తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి