నిరుద్యోగ యువతకు టాస్క్ చేయూత
డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఇతర ఉన్నత కోర్సులు అభ్యసించిన తర్వాత ప్రతి ఒక్కరి లక్ష్యం కొలువు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ అవకాశం ఉండకపోవడంలో చాలామంది ప్రైవేటు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ రంగాల వైపు దృష్టి సారిస్తున్నారు.
నైపుణ్యాల పెంపునకు ప్రత్యేక శిక్షణ
శిక్షణ పొందుతున్న అభ్యర్థులు
న్యూస్టుడే, తెలంగాణచౌక్ (కరీంనగర్): డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఇతర ఉన్నత కోర్సులు అభ్యసించిన తర్వాత ప్రతి ఒక్కరి లక్ష్యం కొలువు. ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ అవకాశం ఉండకపోవడంలో చాలామంది ప్రైవేటు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ రంగాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ కొలువు రావాలన్నా నైపుణ్యం, విషయ పరిజ్ఞానం, సృజనాత్మకత, ఆంగ్లభాషపై పట్టు అవసరం. ఉమ్మడి జిల్లా నుంచి ఏటా వేల సంఖ్యలో ఇంజినీరింగ్, డిగ్రీ పట్టాలు తీసుకుంటున్నారు. ఉద్యోగ సాధనలో సరైన నైపుణ్యాలు లేక వెనుకబడుతున్నారు. అలాంటి వారికి టాస్క్ (తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ నాలెడ్జ్) చేయూతనిస్తోంది. కరీంనగర్లోని ప్రాంతీయ శిక్షణ కేంద్రం (ఐటీటవర్)లో సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ రంగాల్లో ఉచిత శిక్షణ అండగా ఉంటుంది.
రంగాల వారీగా బ్యాచ్లు..
డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ చదివిన వారు సాఫ్ట్వేర్ రంగం వైపు అడుగులు వేయాలనుకునే వారికి కరీంనగర్లోని ఉజ్వల పార్క్ సమీపంలో ఐటీ టవర్లో టాస్క్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఉంటుంది. అభ్యర్థులు ఎంచుకున్న రంగాల వారీగా జాబితా తయారు చేస్తారు. తర్వాత బ్యాచ్ల వారీగా అభ్యర్థుల చరవాణికి సందేశం వస్తుంది. టాస్క్ పలు కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. దరఖాస్తు, శిక్షణ, కంపెనీల్లో ఉన్న ఉద్యోగావకాశాలు ఎలాంటి అర్హతలు కావాలో పూర్తి వివరాలు కూడా సంబంధిత వెబ్సైట్లో లభిస్తాయి. ప్రస్తుతం కళాశాలల్లో చదువుతున్న వారికి ఇందులో అవకాశం ఉండదు. టాస్క్ ఆధ్వర్యంలో ఆయా కళాశాలల వారీగా విద్యార్థుల పేర్లు నమోదు చేసుకుంటే అక్కడే శిక్షణ ఇస్తారు. బీటెక్ విద్యార్థుల ప్రాజెక్టు సంబంధించి సాయంత్రం వేళల్లో సలహాలు ఇస్తున్నారు. ఇది సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
ప్రత్యేకతలు..
కరీంనగర్ ఐటీ టవర్లో ఏర్పాటు చేసిన టాస్క్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రత్యేకమైంది. రెండు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్లు, సమావేశ మందిరం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా తీర్చిదిద్దారు. ప్రతి బ్యాచ్కు 50 మంది చొప్పున ఇప్పటి వరకు 700 మందికి పైగా ఇక్కడ శిక్షణ తీసుకున్నారు. ఉద్యోగాలు సాధించిన వారు ఉన్నారు. ఫిబ్రవరి నుంచి కొత్త బ్యాచ్లు మొదలయ్యాయి.
గ్రామీణ ప్రాంతాల వారికి వరం
హైదరాబాద్లాంటి నగరాల్లో ఉండే వారికి అనేక కోచింగ్ సెంటర్లు ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండి చదువుకునే వారికి అలాంటి సౌకర్యం ఉండదు. పట్టణాలకు వెళ్లడం అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి పరిస్థితుల్లో నైపుణ్యాలు లేక చాలామంది కొలువులకు దూరమవుతున్నారు. గ్రామీణ యువతకు టాస్క్ ఆధ్వర్యంలో శిక్షణ వరంగా మారింది. జావా, ఇతర ప్రోగ్రామింగ్ కోర్సులను హైదరాబాద్లాంటి ప్రాంతాల్లో నేర్చుకుంటే లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. అవే కోర్సులకు ఇక్కడ ఉచితంగా నేర్పిస్తున్నారు. ఇక్కడ తర్ఫీదు పొందిన అనేక మంది వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు సాధించారు.
అన్ని విధాలుగా శిక్షణ..
ఉద్యోగ అన్వేషణలో ఉన్న యువతను అన్ని విధాలుగా సన్నద్ధం చేయడానికి వివిధ అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కొవాలో ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం, భావవ్యక్తీకరణ, అనర్గళంగా మాట్లాడటం, బేసిక్ ఇంగ్లిష్ వంటివి నేర్పిస్తారు. బ్యాంకు ఉద్యోగాలకు సంబంధించి రెండు నెలలపాటు శిక్షణ ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ప్రోగ్రామింగ్, కోడింగ్ కోర్సులు అందిస్తున్నారు. పుల్స్టాక్ జావా, వెబ్ టెక్నాలజీస్, కోడింగ్ స్కిల్, సీ ప్రోగ్రామింగ్, ఆల్గారిథమ్, డేటా స్ట్రక్చర్, డేటాబేస్ ప్రోగ్రామింగ్ వంటి కోర్సులను అందిస్తున్నారు.
టీసీఎస్లో కొలువు సాధించా
- వికాస్, టీసీఎస్ ఉద్యోగి
ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత కరీంనగర్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం(ఐటీ టవర్)లో నెల రోజులపాటు జావా కోర్సులో మెలకువలు నేర్చుకున్నా. సమాచార నైపుణ్యాలూ నేర్పించారు. ఇంటర్వ్యూలో నెగ్గి టీసీఎస్లో కొలువు సాధించి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను. వేలల్లో పెట్టి కోర్సులు నేర్చుకోకుండా ఉచితంగా తర్ఫీదు పొంది.. కొలువు సాధించడం సంతోషంగా ఉంది.
శిక్షణ ఉపయోగపడింది
- సయ్యద్ జమీరుద్దీన్, యాక్సెంచర్ ఉద్యోగి
మాది కరీంనగర్. బీకాం కంప్యూటర్ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత టాస్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన జావా ఫుల్స్టాక్ కోర్సు ఉచితంగా శిక్షణ తీసుకున్నాను. ఇక్కడ ఉద్యోగం సాధించేలా మెలకువలు నేర్పించారు. యాక్సెంచర్ ఇండియాలో కొలువు సంపాదించాను. సాఫ్ట్వేర్ రంగం వైపు రావాలనుకుంటున్న యువతకు ఇది ఒక వరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్