ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేటు తరహా విద్య
గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేటు తరహా విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్కుమార్, జడ్పీ ఛైర్పర్సన్ వసంత అన్నారు.
చిన్నారులతో ఎమ్మెల్యే సంజయ్కుమార్, జడ్పీ ఛైర్పర్సన్ వసంత, అదనపు కలెక్టర్ మకరందు
రాయికల్, న్యూస్టుడే: గ్రామాల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేటు తరహా విద్యను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సంజయ్కుమార్, జడ్పీ ఛైర్పర్సన్ వసంత అన్నారు. రాయికల్ మండలంలోని కుమ్మరిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.18 లక్షల నిధులతో ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దగా ఎమ్మెల్యే సంజయ్కుమార్, జడ్పీ ఛైర్పర్సన్ వసంతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల నియోజకవర్గంలో తొలి విడతలో 75 పాఠశాలలకు మౌలిక వసతుల కోసం నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. కుమ్మరిపల్లి పాఠశాలలో నాగమల్ల శ్రీనివాస్ రూ.60 వేలతో నిర్మించిన సరస్వతి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం రామాజిపేటలో మడలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మూటపల్లి, ఆలూరు, అయోధ్య గ్రామాల్లో పలు కుటుంబాలను ఆయన పరామర్శించారు. అదనపు కలెక్టర్ మకరందు, ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, జడ్పీటీసీ అశ్విని, సర్పంచి స్వప్న, ఎంపీటీసీ నాగరాజు, ఆర్డీఏ సభ్యుడు సుధాకర్రావు, యాజమాన్య కమిటీ అధ్యక్షుడు రాజేందర్, డీఈవో జగన్మోహన్రెడ్డి, తదితరులున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Tamilisai soundararajan: శ్రీరాముడి పట్టాభిషేకానికి రైలులో భద్రాచలానికి బయలుదేరిన గవర్నర్
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (31/03/2023)
-
World News
African:ఆఫ్రికాలో కొత్త వైరస్.. ముక్కు నుంచి రక్తస్రావమైన 24 గంటల్లోనే ముగ్గురి మృతి
-
India News
Rajasthan: ‘గహ్లోత్జీ వారి మొర ఆలకించండి’.. ప్రైవేట్ వైద్యులకు సచిన్ పైలట్ మద్దతు!
-
Sports News
IND vs PAK: వన్డే ప్రపంచ కప్ 2023.. భారత్లో ఆడేది లేదన్న పాక్.. తటస్థ వేదికల్లోనే నిర్వహించాలట!
-
Crime News
Robbery: సినిమాలో చూసి.. రూ.47 లక్షలు కాజేసి..!