logo

పెగడపల్లి ఎస్సై,హెడ్‌కానిస్టేబుల్‌పై చర్యలు

పెగడపల్లి ఎస్సై శ్వేత, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌రెడ్డిపై జిల్లా ఎస్పీ ఎ.భాస్కర్‌ చర్యలు తీసుకున్నారు. రెండ్రోజుల క్రితం పెగడపల్లి మండలం ఆరవెల్లి సర్పంచి లక్ష్మణ్‌ను ఠాణాకు తీసుకెళ్లి దూషించగా విషయం తెలిసిన రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు

Published : 02 Feb 2023 06:01 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: పెగడపల్లి ఎస్సై శ్వేత, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌రెడ్డిపై జిల్లా ఎస్పీ ఎ.భాస్కర్‌ చర్యలు తీసుకున్నారు. రెండ్రోజుల క్రితం పెగడపల్లి మండలం ఆరవెల్లి సర్పంచి లక్ష్మణ్‌ను ఠాణాకు తీసుకెళ్లి దూషించగా విషయం తెలిసిన రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం ప్రదర్శించారు. విషయాన్ని జిల్లా ఎస్పీ భాస్కర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విచారణ జరిపిన ఎస్పీ ఎస్సై శ్వేత, హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌రెడ్డిని జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్డ్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని