అక్రమ దందాకు అడ్డుకట్ట పడేదెన్నడు?
పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. గ్రామాల్లో దళారులు సిండికేట్గా మారి నల్లబజారుకు తరలిస్తున్నారు.
జిల్లాలో ఆగని రేషన్ దందా.. ఫలితం ఇవ్వని 6ఏ కేసులు
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి
పెద్దపల్లిలో పట్టుబడిన రేషన్ బియ్యం వాహనం
పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. గ్రామాల్లో దళారులు సిండికేట్గా మారి నల్లబజారుకు తరలిస్తున్నారు. వీరికి కొందరు రేషన్ డీలర్లు, ఎంఎల్ఎస్ పాయింట్ల అధికారులు, సిబ్బంది తోడవుతుండటంతో ప్రజా ధనం దుర్వినియోగమవుతోంది.
ప్రభుత్వం ప్రజా పంపిణీ కింద అందజేసే దొడ్డు బియ్యం తినడానికి చాలా మంది వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వారి నుంచి వేలిముద్రలు వేయించుకొని కిలోకు రూ.5 చొప్పున చెల్లించి డీలర్లు బియ్యాన్ని తీసుకుంటున్నారు. వాటిని బడా వ్యాపారులకు విక్రయిస్తూ అక్రమార్జనకు తెర తీస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్ల విషయానికొస్తే రేషన్ దుకాణాలకు ఇవ్వాల్సిన బియ్యం కోటాలో కోతలు విధిస్తూ వాటిని అమ్ముకుంటున్నారు. ప్రభుత్వం ఇదే దొడ్డు బియ్యానికి గరిష్ఠంగా రూ.32 వరకు కేటాయిస్తుండగా గతంలో పేదలకు రూపాయికి కిలో చొప్పున ఇచ్చేవారు. ప్రస్తుతం ఉచితంగా ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున అందజేస్తున్నారు. బియ్యం దందా చేస్తున్న వారిపై నిఘా అంతంత మాత్రంగానే ఉంది.
సూత్రధారులు పట్టుబడితేనే..
జిల్లాలోని కొన్ని బియ్యం మిల్లుల్లో రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తున్నారు. రైల్వే స్టేషన్ల ద్వారా ఇతర రాష్ట్రాలకు చేరవేసే వారిపై పర్యవేక్షణ కొరవడింది. నామమాత్రంగా తనిఖీలు జరిపి 6 ఏ కేసులు నమోదు చేస్తున్నారు. వాస్తవానికి ఇలా దొరికిన వారంతా చిరు వ్యాపారులు. ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరూ పట్టుబడటం లేదు. వారిపై ఉక్కుపాదం మోపితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది.
లొసుగులే ఆసరా
* అక్రమార్కులు కేసులకు భయపడటం లేదు. పౌరసరఫరాల చట్టం ప్రకారం వాహనంలో సరకును తరలిస్తూ వ్యక్తి పట్టుబడితే వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలిస్తారు. అనంతరం అతడిపై 6-ఏ కేసు నమోదు చేసి సరకు ఆధారంగా జరిమానా విధిస్తారు. చెల్లించిన అనంతరం వాహనాన్ని తిరిగి ఇచ్చేస్తారు. దీంతో ఎలాంటి శిక్ష లేకుండానే బయటకు వచ్చే అవకాశం ఉంది.
* పలుమార్లు వాహనాల ద్వారా బియ్యం తరలిస్తూ పట్టుబడితే వాహన యజమానులపై పీడీ కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. దీంతో వ్యాపారులు తమ పేర్లతో ఉన్న వాహనాలను ఉపయోగించడం లేదు. నెంబరు ప్లేట్లకు రంగులు పూయడం, మార్పులు చేర్పులు చేసి అధికారులనే తప్పుదోవ పట్టిస్తున్నారు.
* పట్టుకున్న బియ్యం తమది కాదంటూ వాదిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని కొందరు ప్రత్యేకంగా ప్రముఖ సంస్థలకు చెందిన రంగుల సంచుల్లో తరలిస్తుండటంతో స్వాధీనం చేసుకున్న బియ్యానికి, సాధారణ బియ్యానికి తేడా ఉండటం లేదు. దీంతో అధికారులు సరకును రేషన్ బియ్యంగా నిర్ధారించేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
* వీధుల్లో తిరుగుతూ రూ.8కి కిలో దొడ్డు బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న చిరు వ్యాపారులు రూ.10 చొప్పున దళారులకు విక్రయిస్తున్నారు. సుల్తానాబాద్, పెద్దపల్లిలతో పాటు జిల్లావ్యాప్తంగా చాలా చోట్ల దళారులు చెప్పిన చోటుకు వెళ్లి బియ్యం సేకరిస్తూ ఉపాధి పొందుతున్నారు.
* జిల్లాలో గత నాలుగేళ్లలో 6ఏ కింద మొత్తం 341 కేసులు నమోదు చేశారు. ఇందులో 9 కేసులు ఇంకా కోర్టుకు పంపించలేదు. మొత్తం 1,27,82,132 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకుని 1,26,02,632 క్వింటాళ్లను పౌరసరఫరాల శాఖకు అప్పగించారు. ఇంకా 1,79,500 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు.
జరిమానాలు విధిస్తున్నాం
ఎక్కడైనా రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నా, మిల్లుల్లో రీసైక్లింగ్ చేస్తున్నా సమాచారం అందిస్తే దాడులు నిర్వహిస్తున్నాం. బియ్యం స్వాధీనం చేసుకొని, కేసులు నమోదు చేస్తున్నాం. అక్రమ దందా చేసే డీలర్లు, మిల్లర్లు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. డీలర్లు ఎవరూ బియ్యానికి బదులు డబ్బులు ఇవ్వొద్దు.
వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా