సమృద్ధి జలం.. సంరక్షణతోనే ఫలం
భౌగోళికంగా మెట్ట ప్రాంతం. రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల్లో జిల్లా మొదటి స్థానంలో ఉండేది. కఠిన శిలలు విస్తరించడంతో వర్షాలకు భూగర్భజలాలు పైకి రావడం, వినియోగిస్తున్నకొద్దీ త్వరగా పడిపోవడం జరుగుతోంది
ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
భౌగోళికంగా మెట్ట ప్రాంతం. రాష్ట్రంలోని కరవు పీడిత ప్రాంతాల్లో జిల్లా మొదటి స్థానంలో ఉండేది. కఠిన శిలలు విస్తరించడంతో వర్షాలకు భూగర్భజలాలు పైకి రావడం, వినియోగిస్తున్నకొద్దీ త్వరగా పడిపోవడం జరుగుతోంది. అయిదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. రాజరాజేశ్వర 27.5, అన్నపూర్ణ 3.5, ఎగువమానేరు జలాశయాలు 2 టీఎంసీల సామర్థ్యంతో ఉన్నాయి. వీటితోపాటు 625 చెరువులున్నాయి. మల్కపేట, అదనపు ఎత్తిపోతల పథకం పూర్తయితే నీటి వనరుల సామర్థ్యం మరింత పెరుగుతుంది. జిల్లాలో వ్యవసాయానికి 47,568 బావులు, బోరుబావులపైన ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. కారణం సాగునీటి వనరుల కింద కాల్వల వ్యవస్థ సక్రమంగా లేదు. పంటల సాగులో వరి గణనీయంగా పెరిగింది. నీటి సంరక్షణ చర్యలు చేపడుతున్నప్పటికీ గతంతో పోల్చితే భూగర్భజలాల వినియోగం భారీగా పెరిగిందని భూగర్భజలశాఖ ఏడీ గంగ నర్సింలు పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు నీటి వాటి వాడకం ఎలా ఉండాలనే దానిపై ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో వెల్లడించారు.
ఆందోళనకర పరిణామాలు లేవు
మూడేళ్ల క్రితం అధిక వర్షపాతంతో భూగర్భజలాలు సమృద్ధిగా ఉన్న ఏడాదే పంటలు చేతికొచ్చే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం మార్పు వచ్చింది. జిల్లా సాధారణ వర్షపాతం 915.3 మిల్లీమీటర్లకు 2020-2021లో 46 శాతం, 2021-2022లో 71 శాతం, 2022-2023 (జనవరి)లో 49 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 2016-17లో వానాకాలం సాధారణ సాగు విస్తీర్ణం 95 వేల ఎకరాలు కాగా అందులో వరి 44,709 ఎకరాలు. 2022 వానాకాలంలో సాగు 2,40,429 ఎకరాలు కాగా అందులో వరి 1,77,370 ఎకరాలు. ప్రస్తుత యాసంగిలో 1,68,763 ఎకరాలకు గాను 1,66,873 ఎకరాల్లో వరి వేసేవారు. మొత్తం సాగులో 98 శాతం వరి ఉంది. నీటి లభ్యత పెరుగుతున్న కొద్దీ సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. కారణం మూడేళ్లలో జిల్లా సగటు భూగర్భ జలమట్టం అన్ని కాలాల్లో 12 మీటర్ల లోపే ఉంటోంది. వీటిలో 70 శాతం లోపు వినియోగిస్తేనే సురక్షితంగా పరిగణిస్తాం. ఆ స్థాయి దాటితే తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో ఆందోళనకర పరిణామాలు లేవు. అయితే భవిష్యత్తు భూగర్భ జలాలు కలుషితం కాకుండా నాణ్యతా ప్రమాణాలు పడిపోకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత జిల్లా ప్రజలపై ఉంది.
నిరంతర వినియోగం తగ్గించాలి
నవంబరులో జిల్లా సగటున 3.67 మీటర్లు ఉంటే జనవరి నెలాఖరులోగా 6.43 మీటర్లకు చేరాయి. అంటే నెలకు సగటున మీటరు లోతుకు పడిపోతున్నాయి. యాసంగిలో వరి ఎక్కువగా సాగు చేశారు. వచ్చే మూణ్నెళ్లు అవసరం మేరకే వాడుకునే విధంగా ప్రణాళిక చేసుకోవాలి. ప్రస్తుతం భూగర్భ జలాల లభ్యత ఆశాజనకంగా ఉన్నప్పటికీ దీన్ని వినియోగిస్తున్న తీరు ఆందోళనకరంగా ఉంది. బోరుబావుల నిరంతర వినియోగం తగ్గించాలి. ఉపరితల కాల్వల ద్వారా నీటిని వినియోగిస్తే మంచిది. అది పంట దిగుబడులకు మేలు చేస్తుంది. అంతే కాకుండా అత్యంత లోతు నుంచి భూగర్భ జలాన్ని తోడేయడం వల్ల భూమి అంతర పొరల్లో అనేక మార్పులు సంభవించి భూమి కుంగిపోవడం, కంపించడం వంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా జరిగే ప్రమాదం ఉంది. వర్షపు నీరు పూర్తిగా భూమిలోకి ఇంకేలాగా వర్షపు నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించేలా రీఛార్జి గుంతలు తవ్వాలి.
ఏటా పెరుగుదల..
జిల్లాలో 2016 మేలో 17.95 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉండేవి. 2020 మేలో 11.07 మీటర్లకు చేరాయి. మూడేళ్లుగా జనవరిలో సగటున 5.96 మీటర్లలోనే ఉంటున్నాయి. 2021లో 6.30 మీటర్లు, 2022లో 5.16, 2023లో 6.43 మీటర్లగా ఉంది. ఒకప్పుడు కరవు పీడిత ప్రాంతమైన జిల్లాలో ఈ పరిణామం గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. జలాశయాల నిర్మాణం, మానేరు, మూలవాగులపై చెక్డ్యాంలతోపాటు ఊట కుంటలు, వివిధ రకాల ఇంకుడు గుంతలను నిర్మించడం వల్ల జిల్లాలో భూగర్భ జలమట్టం ఏటా గణనీయ పెరుగుదల నమోదవుతూనే ఉంటుంది.
జాతీయస్థాయిలో గుర్తింపు
జిల్లాలో ఒకే సంవత్సరం 6.03 మీటర్ల భూగర్భ జలాలు పైకి రావడం గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. దీనికి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు ఉపాధి హామీ పథకంలో చెరువులు, కుంటలు పూడికతీత, భూగర్భజలాలు ఇంకేలా కొండల ప్రాంతంలో రీఛార్జి కందకాలు తవ్వకం చేపట్టాలి. వీటన్నింటిని పూర్తిస్థాయిలో వినియోగించడంతోనే సాధ్యమైంది. ఇది భవిష్యత్తు ఐఏఎస్లకు ప్రేరణ కలిగించే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా జల విధానాన్ని ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ ఐఏఎస్ శిక్షణలో ఒక పాఠ్యాంశంగా చేర్చడం వల్ల జిల్లా జల విధానానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం
[ 19-04-2024]
కమాన్పూర్ మండలం రొంపికుంట ఉపకేంద్రం పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ట్రాన్స్ కో ఏఈ రాజేంద్ర కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు