రోడ్లపైనే వ్యాపారం
చిరు వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ రోడ్లపైన, కూడళ్లలో వ్యాపారాలు నిర్వహించకుండా వీధి వ్యాపారులకు దుకాణాల సముదాయాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
నిరుపయోగంగా దుకాణ సముదాయాలు
న్యూస్టుడే, మెట్పల్లి
మెట్పల్లి పట్టణంలో రోడ్డుపై తోపుడుబండ్లు
చిరు వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ రోడ్లపైన, కూడళ్లలో వ్యాపారాలు నిర్వహించకుండా వీధి వ్యాపారులకు దుకాణాల సముదాయాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పట్టణ ప్రగతి నిధులతో దుకాణాల సముదాయాలను నిర్మించి వ్యాపారులకు కేటాయించినా వ్యాపారం సరిగా నడవదని ఆసక్తి చూపడంలేదు. జగిత్యాల పురపాలక సంఘంలో షెడ్లు నిర్మించినా వ్యాపారుల గుర్తింపునకు సర్వే కొనసాగుతుండగా కోరుట్ల, మెట్పల్లి పురపాలికల్లో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన దుకాణాల సముదాయలు వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. రోడ్లపైనే వ్యాపారం కొనసాగిస్తుండడంతో పాదచారులు, వాహనచోదకులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
జోన్ల ఏర్పాటు కాగితాలకే పరిమితం
పురపాలికల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం దుకాణాల సముదయాలను నిర్మించడంతోపాటు వ్యాపారాలకు జోన్ల పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చింది. మెప్మా ఆధ్వర్యంలో పురపాలికల్లో సీసీలు, ఆర్పీలు సర్వే నిర్వహించి వీధి వ్యాపారులను గుర్తించి మూడు రకాల జోన్లు ఏర్పాటు చేశారు. పురపాలికల్లో జోన్ల విధానం ఎక్కడా అమలు కావడంలేదు. జోన్ల ఏర్పాటు కాగితాలకే పరిమితమైంది.
గ్రీన్జోన్: ఎలాంటి ట్రాఫిక్ అతరాయం కలగని ప్రదేశాలు, జనం రద్దీలేని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను కొనసాగించడానికి అనుమతి ఇస్తారు.
ఆరెంజ్జోన్: ఓ మోస్తరు నుంచి మధ్యస్తంగా జనం రద్దీ ఉంటూ వాహనాల రాకపోకలు సాగించే ప్రధాన అంతర్గత రహదారులు, కూడళ్లను ఆరెంజ్ జోన్గా గుర్తించి ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు రెండు పర్యాయాలు వ్యాపారం నిర్వహించుకోవచ్చు.
రెడ్జోన్: ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు, సినిమా హాళ్లు ప్రధాన కూడళ్లు ఉండే ప్రాతాలను రెడ్ జోన్లుగా పరిగణిస్తారు. ఈ ప్రాంతాల్లో ఎలాంటి వీధి వ్యాపారాలు నిర్వహించడానికి అనమతి ఇవ్వరు.
పట్టణంలోని ప్రభుత్వ గోదాములకు వెళ్లే దారి పక్కన పట్టణ ప్రగతిలో రూ.5 లక్షలు వెచ్చించి వీధి వ్యాపారుల కోసం దుకాణాల సముదాయాన్ని నిర్మించి 25 షెడ్లు ఏర్పాటు చేశారు. అద్దె నిర్ణయించి చిరు వ్యాపారులకు కేటాయించారు. అక్కడ కొనే వారుండరని దుకాణం ఏర్పాటు చేసుకుంటే నష్టాలు వస్తాయని ఆసక్తి చూపడంలేదని ఓ వ్యాపారి తెలిపారు.
ఇది కోరుట్ల పట్టణంలోని కల్లూర్ రోడ్డులో రూ.15 లక్షలతో వీధి వ్యాపారులకు నిర్మించిన దుకాణ సముదాయం. 12 షెడ్లు ఏర్పాటు చేసి వ్యాపారులకు కేటాయించారు. దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్రస్తుతం ఓ షెడ్డులో ఓ వ్యాపారి పండ్ల దుకాణం నిర్వహిస్తున్నారు. మిగతా షెడ్లన్నీ నిరుపయోగంగా ఉన్నాయి.
అవగాహన కల్పిస్తాం
సునీత, మెప్మా డీఎంసీ, జగిత్యాల
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి పురపాలక సంఘాల్లో వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక దుకాణాల సముదాయం ఏర్పాటు చేశాం. జగిత్యాలలో వ్యాపారుల గుర్తింపుకు సర్వే జరుగుతోంది. మెట్పల్లి, కోరుట్లలో వ్యాపారులకు కేటాయించినా నిర్వహణకు ముందుకు రావడంలేదు. వారికి అవగాహన కల్పిస్తాం. దుకాణాల సముదాయాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
[ 19-04-2024]
‘నిజామాబాద్ నియోజకవర్గం పద్మవ్యూహంలా ఉంది. నన్ను అభిమన్యుడిని చేస్తారో.. అర్జునుడిని చేస్తారో అంతా మీ చేతుల్లో ఉంది’ అని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుతో నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. -
మొదటిరోజు ఆరు నామినేషన్లు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామపత్రాలను దాఖలు చేశారు. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు కోట శ్యామ్కుమార్, పోతూరి రాజేందర్లు -
350 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్
[ 19-04-2024]
హుజూరాబాద్లో పట్టుబడ్డ 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు గురువారం సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాలలోని శ్రీరాజరాజేశ్వర రైస్మిల్లులో 1,347 బస్తాల బియ్యాన్ని లారీలో లోడ్ చేసి... -
కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కృషి చేయండి
[ 19-04-2024]
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపునకు కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ధర్మపురి పట్టణంలోని ఓ వేడుక మందిరంలో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల... -
గీతదాటితే కొరడా ఝళిపిస్తారు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆ మేరకు ఉమ్మడి జిల్లాలో రాజకీయ పార్టీల ప్రచార పర్వం వేడెక్కనుంది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)ని తీసుకొచ్చింది. -
కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు : మంత్రి
[ 19-04-2024]
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కష్టపడ్డ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులను ఇస్తామని, అవసరమైతే పక్క రాష్ట్రం నుంచి భిక్షాటన చేసైనా పదవులను తెచ్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్గౌడ్ అన్నారు. -
నాలుగేళ్లా.. రెండేళ్లా!
[ 19-04-2024]
సింగరేణి గుర్తింపు సంఘం కాలపరిమితిపై సందిగ్ధం నెలకొంది. గెలిచిన అనంతరం సంఘానికి అధికారిక పత్రం ఇప్పటి వరకు అందలేదు.గుర్తింపు ఎన్నికలకు ముందు కాలపరిమితిపై స్పష్టత లేకపోవడంతో ఫలితాల అనంతరం కార్మిక శాఖ -
గంట ముందే పోలింగ్ ప్రారంభం
[ 19-04-2024]
గోదావరి పరీవాహక ప్రాంతం.. అంతర్రాష్ట్ర సరిహద్దు.. దట్టమైన అడవులు విస్తరించిన పెద్దపల్లి లోక్సభ పరిధిలో కొన్ని ప్రాంతాల్లో ముందస్తు పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
రహదారి నిర్మించారు.. సమస్యలు మరిచారు
[ 19-04-2024]
గుంతల రహదారితో ఇబ్బందులు ఎదురవుతుండటంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. దీంతో పక్కా రోడ్డు నిర్మాణంతో రవాణా సదుపాయం మెరుగైంది. దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం లభించింది. -
స్థలం కేటాయించారు.. ఆసుపత్రి నిర్మాణం విస్మరించారు
[ 19-04-2024]
తంగళ్లపల్లి మండలం టెక్స్టైల్ పార్కు వద్ద బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేసే ఈఎస్ఐ ఆసుపత్రికి పదేళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 13 ఎకరాల స్థలం కేటాయించింది. -
ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. -
స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి
[ 19-04-2024]
అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. -
ఇంటి నుంచే నామినేషన్
[ 19-04-2024]
ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం -
17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం
[ 19-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. -
ఫోన్ ట్యాపింగ్లో ఎవరినీ వదిలేది లేదు
[ 19-04-2024]
రాముడిపై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఎంపీ బండి సంజయ్ నిరూపిస్తే సజీవ దహనం చేసుకుంటానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ పొన్నం ప్రభాకర్ అన్నారు. -
వామ్మో.. ఇదేం ఎండ!
[ 19-04-2024]
జనం బెదిరేలా ఎండ ఠారెత్తిస్తోంది. ఉమ్మడి జిల్లాను ఉక్కపోతతో ఉడికిస్తోంది. రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గురువారంతో మరింతగా పెరిగాయి. -
గంజాయి మాయం కేసులో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురి సస్పెన్షన్తో కలకలం
[ 19-04-2024]
సారంగాపూర్ పోలీసుస్టేషన్ నుంచి గంజాయి మాయమైన సంఘటనలో ఇద్దరు ఎస్సైలు సహా నలుగురు సస్పెన్షన్కు గురవడం కలకలం రేపింది. -
చిట్టీల పేరిట ఆర్ఎంపీ డబ్బు వసూళ్లు
[ 19-04-2024]
శంకరపట్నం మండలం కొత్తగట్టులో ఓ ఆర్ఎంపీ సుమారు రూ.70 లక్షలతో ఉడాయించినట్లు ఆలస్యంగా తెలిసింది. బాధితుల కథనం ప్రకారం..
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్