కాలువలు ఇలా.. నీరు పారేదెలా?
ధ్వంసమైన లైనింగ్.. గండ్లతో బలహీనపడిన చిన్నకట్టలు.. కాలువలో మొలిచిన చెట్లు.. నిర్మిత సామర్థ్యంలో కనీసం సగం నీరు ప్రవహించడం ఆయా గ్రామాల పరిధిలో కష్టమవుతోంది.
ఈనాడు, కరీంనగర్
ధ్వంసమైన లైనింగ్.. గండ్లతో బలహీనపడిన చిన్నకట్టలు.. కాలువలో మొలిచిన చెట్లు.. నిర్మిత సామర్థ్యంలో కనీసం సగం నీరు ప్రవహించడం ఆయా గ్రామాల పరిధిలో కష్టమవుతోంది. జలవనరులు అధికంగా ఉన్న జిల్లాలో తూములు, అలుగులకు అనుబంధంగా ఏర్పాటైన చిన్ననీటి వనరుల విషయంలో నిధులు లేక నిర్లక్ష్యం కనిపిస్తోంది. అక్కడక్కడ ఉపాధి హామీ పథకంలో పిచ్చిమొక్కలను తొలగించి చిన్నపాటి పనులు జరిపించినా అవి ఉపయుక్తంగా మారలేదు. వర్షాకాలంలో వీటిలో పారాల్సిన నీళ్లని సమీప పొలాలతోపాటు ఇళ్ల మధ్యకు చేరిన సందర్భాలు జిల్లాలో ఉన్నాయి. ఈ తీరు మారాలంటే ఇప్పటికే గుర్తించిన పనులను ప్రాధాన్యం క్రమంగా చేపట్టాలి. కొత్త పనుల అంచనాకు తగినట్లుగా నిధుల ప్రతిపాదనలను మరోసారి పంపాలి. ఈ వేసవి పూర్తయ్యే లోపల ఉన్న ఈ మూడు నెలలను పనుల ప్రగతికి అనువైన కాలంగా మార్చుకోవాలి.
ఇది హుజూరాబాద్ మోడల్ చెరువు నుంచి కిందనున్న పంట పొలాలకు నీళ్లను పారించే చిన్నకాలువ. కొన్నేళ్ల కిందటి నుంచి మరమ్మతు అంటే ఎరుగక ఇలా అధ్వానస్థితికి చేరింది. దీన్ని బాగు చేయాలనే విషయాన్ని మర్చిపోవడంతో కాలువ లోతు మట్టితో పూడుకుపోవడంతోపాటు ఇరువైపులా పిచ్చిమొక్కలు పెరిగి రూపు కోల్పోతోంది. అన్నదాతలు పలుమార్లు విన్నవించుకున్నా.. నిధుల మంజూరు ఊసే లేక ఇబ్బంది తలెత్తుతోంది.
ఎక్కడికక్కడే ఇలా..
* ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి జిల్లాలోని గంగాధర మండలం నారాయణపూర్, గంగాధర జలాశయాలకు నీళ్లను అందించే రెండు కాలువలు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. 22 కి.మీ మేర పైపుల ఏర్పాటుతోపాటు గ్రావిటీ కాలువల పనులు ఏళ్లతరబడి కొనసాగుతుండటంతో అసౌకర్యం ఏర్పడుతోంది.
* ఎల్ఎండీ జలాశయం నుంచి 1500 నుంచి 3 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని తరలించే సామర్థ్యమున్న కాకతీయ కాలువల ఆధునికీకరణ ప్రక్రియ అటకెక్కింది. ఏడాది పొడవునా పలు జిల్లాలకు నీరందించే వీటిని బాగు చేయడానికి వందలాది కోట్ల రూపాయలు అవసరమని అంచనా వేశారు.
* కాకతీయ కాలువకు, చెరువులు, చెక్డ్యామ్లకు అనుబంధంగా మానకొండూర్, శంకరపట్నం, వీణవంక, హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, సైదాపూర్, చిగురుమామిడి, తిమ్మాపూర్ల పరిధిలోనే వందలాది కి.మీ మేర విస్తరించిన కాలువల చెంతన సిమెంట్ పనులే జరగక వ్యవస్థ దెబ్బతింటుంది.
* డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థతోపాటు తూములను చాలాచోట్ల బాగు చేయించాలి. చాలా ఊళ్లల్లో చివరి ఆయకట్టుకు నీరు అందడమనేది కష్టంగా మారుతోంది. పైగా సిమెంట్ లైనింగ్ ఉన్నవాటిలో పగుళ్లు, బుంగలు పడి సాగునీరంతా చాలాచోట్ల వృథా అవుతోంది. పలుచోట్ల ఇవి కుచించుకుపోయాయి.
ఇటీవల కురిసిన వర్షాలకు నూతనంగా నిర్మించిన కాలువ మట్టి ఇలా తొలిగిపోయింది. కాకతీయ కాలువకు అనుబంధంగా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామశివారులో దీన్ని గతేడాది కిందట జలధారలు పారేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. వరదల ఉద్ధృతితో రూపు కోల్పోయిన దీనికి ఇరువైపులా కొన్ని చోట్ల సిమెంట్ లైనింగ్ వేసి.. రోడ్డుకు అవతలి వైపు పంట పొలాలకు నీళ్లు వెళ్లే మార్గాన్ని మరమ్మతు చేయాల్సిన అవసరముంది.
సర్వే చేపడితేనే..
ఐదారేళ్ల కిందట కాలువల మరమ్మతుకు పంపిన ప్రతిపాదనల్లో అనుకున్న విధంగా నిధులు జిల్లాకు రావడంలేదనే మాటలను సంబంధిత పర్యవేక్షణ అధికారులే ఊళ్లకు వచ్చినప్పుడు ప్రజలకు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమస్య మరింత పెరిగిపోయింది. అందువల్ల మరోసారి 313 గ్రామాలతోపాటు పట్టణాల చెంతన ఉన్న వీటిని పూర్తి స్థాయిలో సర్వే చేపట్టాల్సిన అవసరముంది. దెబ్బతిన్న వాటిని గుర్తించడంతోపాటు బాగు చేసేందుకు నిధులను అంచనా వేయాలి. ప్రజాప్రతినిధులు చొరవచూపి నిధులు మంజూరు చేయించాలి. అలా చేస్తేనే వీటి రూపు మారే వీలుంటుంది. జిల్లాలో వీటి బాగుకు నిధులు వస్తున్నవాటిని బట్టి పనులు చేపడతామని.. ఇటీవల కొత్త మంజూరు లేక ఇబ్బంది నెలకొందని నీటి పారుదల శాఖ ఎస్ఈ శివకుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM