లోపించిన భద్రత.. నిబంధనలకు పాతర
కరీంనగర్ స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి.
స్మార్ట్సిటీ వరద కాలువ నిర్మాణంలో నిర్లక్ష్యం
న్యూస్టుడే, కార్పొరేషన్, కరీంనగర్ పట్టణం
కరీంనగర్ స్మార్ట్సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. ప్రధానంగా వరద కాల్వ నిర్మాణ పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతీది కన్సల్టెన్సీ, సంబంధిత ఏజెన్సీనే పర్యవేక్షణ చేస్తుందని అంటున్న నగరపాలిక ఇంజినీరింగ్ అధికారులు..కనీసం ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన వారే కరవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పనులు జరుగుతున్న చోట స్థానికులకు అవగాహన కల్పించకపోవడం, ప్రమాదాలు జరిగితే బాధ్యుల ఎవరనే విషయాన్ని గుర్తించడం లేదు. ఇదే తరహాలో తిరుమల్నగర్లో కార్మికులు వరద కాల్వ పనులు చేస్తుండగా బుధవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇంటి గోడ కూలి ఓ కార్మికుడు చనిపోవడం ఆ ప్రాంతవాసులను కలచి వేసింది. ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవడంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి.
గణేశ్నగర్ బైపాసు, హనుమాన్నగర్లో ప్రధాన వరద కాల్వ నిర్మాణ పనులకు డిసెంబరు 26న ఎడాపెడా తవ్వడంతో ఓ అపార్టుమెంట్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్, స్తంభాలు కుప్పకూలాయి. రాత్రిపూట కావడంతో అటు రాకపోకలు సాగించలేదు. లేదంటే భారీ ప్రమాదం జరిగేది.
కదులుతున్న పునాదులు..
వరదకాల్వ నిర్మాణ పనులను స్మార్ట్సిటీలో ప్రాధాన్యం ఇచ్చారు. ఈ పనులు ప్రారంభించిన సదరు ఏజెన్సీ పాత కాల్వల గుండా తవ్వడం ప్రారంభించారు. ఇంటి గోడలకు అనుకొని తవ్వుతుండటంతో పునాదులు కూడా కదులుతున్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. లోతుగా తవ్వుతుండటంతో ఇంటి పునాదులు ఆ మేరకు ఎలా ఉంటాయని ప్రశ్నిస్తున్నారు. మట్టి కూలి ప్రమాదకరంగా మారుతున్నాయని ఆగ్రహిస్తున్నారు. తిరుమల్నగర్లో ఇదే పరిస్థితి ఉండగా గణేశ్నగర్ బైపాసు రోడ్డులో కూడా అలాగే తవ్వారు.
పనుల్లో జాప్యం
ఎడాపెడా తవ్వుతుండగా వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించడం లేదు. ఒకటెండ్రు చోట్ల త్వరతిగతిన చేస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో సాలక అల్లి వదిలేస్తున్నారు. రాకపోకలు సాగించడం కూడా గగనంగా మారుతోంది. ప్రస్తుతం తిరుమల్నగర్, గణేశ్నగర్ బైపాసు రహదారి, కట్టరాంపూర్ రోడ్డు, కోతిరాంపూర్ ప్రధాన రహదారి, రాజా థియేటర్ వైపు, పాసుపోర్టు కార్యాలయం వైపు రోడ్లు, డ్రైనేజీల పనులు సాగుతున్నాయి. గణేశ్నగర్ బైపాసు, తిరుమల్నగర్ చుట్టూ పనులు చేస్తుండగా రాకపోకలు సాగించే ప్రజలు నానావస్థలు పడుతున్నారు.
ఈనెల 1న సాయంత్రం 5 గంటలకు తిరుమల్నగర్లో అంతర్గత ప్రధాన కాల్వ నిర్మాణ పనులు చేస్తుండగా ఇంటికి సంబంధించిన ప్రహరీ సాలక అల్లుతున్న కార్మికులపై పడింది. ఆ సమయంలో అక్కడ ముగ్గురు కార్మికులు ఉండగా ఇద్దరికి గాయాలు కాగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మృతి చెందాడు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ఆందోళన నెలకొంది.
అప్రమత్తత ఏదీ?
* వరదకాల్వ నిర్మాణ పనులు చేస్తున్న సమయంలో అటుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా భద్రత చర్యలు తీసుకోవాలి.
* బారికెడ్లు, రెడ్ రిబ్బన్లు వంటివి ఏర్పాటు చేయాల్సి ఉండగా అది కనిపించడం లేదు. ఆ వైపు పనులు జరుగుతున్నట్లుగా హెచ్చరిక బోర్డులు ఉండాలి.
* ఫ్లెక్సీలతో రాసి ఎక్కడో మూలన ప్రదర్శిస్తుండటంతో అవి ప్రజలకు స్పష్టంగా కనిపించడం లేదు.
* పని చేస్తున్న కార్మికులకు రక్షణ చర్యలు తీసుకోవాలి. తలకు కచ్చితంగా హెల్మెట్లు ధరించేలా పర్యవేక్షించడం లేదు.
* అనుకొని ఘటన జరిగితే వారి కుటుంబానికి నష్ట పరిహారం అందేలా బీమా సౌకర్యం ఉండాలి. ప్రతి ఒక కార్మికుడికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి.
* పనులు చేస్తున్న ప్రాంతంలో కచ్చితంగా కంపెనీ తరపున అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలి.
ముందస్తుగానే భద్రతపై సూచిస్తున్నాం
స్మార్ట్సిటీ పనులు చేస్తున్న సమయంలో సంబంధిత ఏజెన్సీకి ముందస్తుగానే రక్షణ, భద్రత చర్యలు తీసుకునేలా ఎప్పటికప్పుడూ ఆదేశాలు ఇస్తున్నాం. పనులు జరుగుతున్న సమయంలో బోర్డులు ఉంటాయి. బిట్ల వారీగా పనులు చేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. త్వరగా పూర్తి చేయిస్తాం.
నాగ మల్లేశ్వరరావు, ఎస్ఈ, నగరపాలిక
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.