నమూనా బడులు.. అరకొరగా పనులు
సర్కారు బడుల్లో కార్పొరేట్కు దీటుగా బోధన అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది.
‘మన ఊరు.. ’పై నిరంతరం సమీక్షించినా ఆలస్యమే..
4న మండలానికి రెండు పాఠశాలలు ప్రారంభం
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
సర్కారు బడుల్లో కార్పొరేట్కు దీటుగా బోధన అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ‘మన ఊరు- మన బడి’ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మౌలిక వసతులు కల్పించేందుకు తొలి విడతలో జిల్లాలో 191 పాఠశాలలకు అవకాశం కల్పించారు. ఇందులో మండలానికి రెండు పాఠశాలలను నమూనాగా తీసుకొని పనులు పూర్తి చేయడంతో పాటు జనవరిలో ప్రారంభించాలని భావించారు. పనులు ఆలస్యం కావడంతో ఈ నెల 4న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు పాఠశాలల్లో పనుల తీరుపై పరిశీలన్మాతక కథనం.
అన్నీ అడ్డంకులే..
జిల్లాలో పాఠశాలల అభివృద్ధి పనులకు అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఉపాధిహామీలో చేసిన పనులకు బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. పనుల నిర్వహణపై జిల్లా స్థాయిలో సమీక్షించినా ఫలితం లేకపోయింది. పలు చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేసి పైపై పూతలు అద్దుతున్నారు. పెయింటింగ్, ఎలక్ట్రిషియన్ పనులు నాసిరకంగా చేస్తున్నారు. ఫర్నిచర్, గ్రీన్ చాక్బోర్డు, డ్యూయల్ బెంచీల సరఫరాలో జాప్యం నెలకొంది. సామగ్రిని రాష్ట్ర స్థాయిలోనే కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేస్తుండటంతో ఆలస్యమవుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖాళీ స్థలంలో నాణ్యత లేని మొరం చల్లుతున్నారు. జిల్లాలో మంథని బాలురు, పత్తిపాక, గర్రెపల్లి, బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలలకు 12 ఎల్ఈడీ టీవీలు సరఫరా చేశారు. ఒక్కో పాఠశాలకు మూడు కేటాయించారు.
అందని డ్యూయల్ బెంచీలు
బ్రాహ్మణపల్లి బడి ముందు పోసిన మొరం
పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలలో రూ.22 లక్షలతో భోజనశాల, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీ పనులు చేశారు. ఎలక్ట్రిషియన్, పెయింటింగ్, తాత్కాలిక మరమ్మతు పనులు పూర్తయ్యాయి. గ్రీన్ చాక్బోర్డు, ఎల్ఈడీ టీవీలు పంపిణీ చేశారు. డ్యూయల్ బెంచీలు సరఫరా కావాల్సి ఉంది. రాఘవపూర్ ప్రాథమిక పాఠశాలలో పనులు పూర్తి చేయడంతో బెంచీలు సరఫరా అయ్యాయి.
నిర్మాణాలు సరే.. సామగ్రి ఏదీ!
కాచపల్లి ప్రాథమిక పాఠశాల
సుల్తానాబాద్: గర్రెపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.14 లక్షల నిధులతో నిర్మించిన డైనింగ్హాల్, విద్యుత్తు నవీకరణ తదితర మరమ్మతు పనులు పూర్తయ్యాయి. కదంబాపూర్ కాచపల్లి ప్రాథమిక పాఠశాలలో రూ.7 లక్షలు కేటాయించారు. మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణం తదితర పనులు తుది దశకు చేరాయి. బెంచీలు, గ్రీన్ చాక్బోర్డు కూడా రావాల్సి ఉంది.
రంగులద్దినా పాత ఫర్నీచరే..
కాల్వశ్రీరాంపూర్: కాల్వశ్రీరాంపూర్ ఉన్నత పాఠశాలకు రూ.26.20 లక్షలు, కిష్టంపేట బడికి రూ.11.50 లక్షలు మంజూరయ్యాయి. కాల్వశ్రీరాంపూర్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఫర్నీచర్, గ్రీన్ చాక్బోర్డు, సోలార్ ప్యానెల్, కిష్టంపేటలో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఫర్నీచర్, గ్రీన్చాక్ బోర్డు సమకూర్చలేదు. పాఠశాలల్లో అన్ని వసతులు సమకూరకుండానే ప్రారంభిస్తుండటంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
కొనసాగుతున్న నిర్మాణాలు
ఓదెల: మండలంలో గుండ్లపల్లె, చిన్నకొమిర పాఠశాలలను నమూనాగా ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో విద్యుద్దీకరణ, తాగునీటి వసతి, రంగులద్దడం వంటి పనులు ఇటీవల పూర్తయ్యాయి. కుర్చీలు, డ్యూయల్ డెస్కు బెంచీలు, గ్రీన్చార్ట్ బోర్డులు, ఎల్ఈడీ టీవీలు ఇంకా రాలేదు. వంట గదులు నిర్మాణ దశలో ఉన్నాయి. గుండ్లపల్లెలో పాఠశాల చుట్టుపక్కల రైతుల వ్యవసాయ భూములుండగా హద్దులు నిర్ణయించకపోవడంతో ప్రహరీ నిర్మాణానికి నోచుకోలేదు.
మెరుగైన వసతులు
ధర్మారం: పత్తిపాక ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు రూ.24.41 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో పాఠశాలలో తాగునీటి వసతి, విద్యుద్దీకరణ పనులు, భోజనశాల నిర్మాణం ఇతరత్రా మరమ్మతు పనులు చేపట్టారు. మూడు తరగతి గదుల్లో డిజిటల్ ప్రొజెక్టర్లు బిగించారు. ఆవరణనూ పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఆకర్షణీయంగా రంగులు వేయించారు. పనులన్నీ పూర్తయ్యాయి. గతంతో చూస్తే చాలా వరకు వసతులు మెరుగయ్యాయి.
రూపురేఖలు మారుతున్నాయి
మాధవి, జిల్లా విద్యాధికారి
జిల్లాలోని 28 నమూనా పాఠశాలల్లో పనులు పూర్తి చేశాం. సామగ్రి సరఫరా అవుతోంది. పనులు పూర్తయిన చోట బడుల రూపురేఖలు మారుతున్నాయి. విద్యార్థులకు మౌలిక వసతుల కొరత తీరనుంది. ఈ నెల 4న ప్రారంభించనున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం
[ 18-04-2024]
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణోత్సవాన్ని ఆలయ వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
నేటి నుంచి నామినేషన్లు షురూ!
[ 18-04-2024]
ఎన్నికల సమరంలో అసలైన ఘట్టం గురువారం నుంచి మొదలవనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ నెల రోజుల కిందటే వెలువడినప్పటికీ నేడు వెలువడే అధికారిక నోటిఫికేషన్తో అసలు అంకం షురూ అవనుంది. -
ప్రచార పర్వానికి కాంగ్రెస్ సిద్ధం!
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి గురువారం నామపత్రాల స్వీకరణ కార్యక్రమం ప్రారంభమవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో ప్రచార కసరత్తు ప్రారంభించింది. -
కొప్పుల మొదటిసారి.. జీవన్ మూడోసారి
[ 18-04-2024]
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో వేర్వేరు పార్టీలు, వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న తాటిపర్తి జీవన్రెడ్డి, కొప్పుల ఈశ్వర్లకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందిన జీవన్రెడ్డి స్వగ్రామం పెగడపల్లి మండలం బతికెపల్లి. -
క్లిక్ దూరంలో సమగ్ర సమాచారం
[ 18-04-2024]
ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ రూపొందించింది. ceotelangana.nic.in లో ఓటరు నమోదుతో పాటు సవరణలు, తొలగింపులు తదితర అంశాలుంటాయి. -
రెండు సార్లు ఎంపీ.. సాధారణ జీవనం
[ 18-04-2024]
వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికైనా చివరి శ్వాస వరకు పల్లెటూరులోనే సాధారణ జీవితం గడిపారు జువ్వాడి రమాపతిరావు. 1916లో గన్నేరువరంలో జన్మించిన ఆయన వివాహం అనంతరం అత్తగారి ఊరైన గంగాధర మండలం సర్వారెడ్డిపల్లికి వచ్చి స్థిరపడ్డారు. -
ఎన్నికల పరిశీలకులొస్తున్నారు
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలను స్వేచ్ఛగా, శాంతియుతంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారుల పర్యవేక్షణ పెంచింది. -
హాట్రిక్ విజేత..అరుదైన ఘనత
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలో నలుగురు నేతలు వరుసగా మూడు సార్లు లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా హ్యాట్రిక్ రికార్డు సొంతం చేసుకున్నారు. కరీంనగర్ నుంచి ముగ్గురు, పెద్దపల్లి నుంచి ఒకరు గెలుపొంది రాజకీయాల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. -
అక్కడ స్థానికేతరులే అధికం
[ 18-04-2024]
1962లో ఆవిర్భవించిన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు ఒక్కసారి మినహా అన్ని ఎన్నికల్లో స్థానికేతరులే గెలుపొందారు. 1980లో 7వ లోక్సభ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించిన కోదాటి రాజలింగం మాత్రమే స్థానికుడు. -
వసతుల మెరుగుకు కార్యాచరణ
[ 18-04-2024]
ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, రామగుండం నగరపాలికల్లో కనీస మౌలిక వసతులు మెరుగుపర్చడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ప్రధానంగా తాగునీరు, భూగర్భ మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటారు. -
ఆదాయంలో జమ్మికుంట మార్కెట్ టాప్
[ 18-04-2024]
పంటలకు పెరిగిన మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా పాత బకాయిలు జమకావటం, చెక్పోస్టులు, గిడ్డంగుల అద్దెలు, లైసెన్సులు, మార్కెట్లకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల ద్వారా లభించే ఆదాయంతో ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల వ్యవసాయ మార్కెట్ మినహా కరీంనగర్, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లు మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన ఆర్థిక ఆదాయ లక్ష్యాన్ని అధిగమించాయి. -
ఓటరు దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం
[ 18-04-2024]
నామినేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ సూచించారు. బుధవారం ఆయన నిర్వహించిన పెద్దపల్లి నుంచి కలెక్టర్ ముజమ్మిల్ఖాన్, అదనపు కలెక్టర్లు అరుణశ్రీ, శ్యామ్ప్రసాద్లాల్లు పాల్గొన్నారు. -
మిల్లుల్లోనే బియ్యం.. ధాన్యానికేదీ స్థలం?
[ 18-04-2024]
గత వానాకాలం సీజన్కు సంబంధించిన బియ్యానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో మిల్లుల్లోనే నిల్వలు పేరుకుపోయాయి. గత సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను మిల్లర్లు పూర్తి చేయాలనే గడువును జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పొడిగిస్తున్నారు.