టిఫా సదుపాయం.. గర్భిణులకు వరం
గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో ‘టిఫా’ సదుపాయం అందుబాటులోకి రావడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన గర్భిణులకు తిప్పలు తప్పాయి.
న్యూస్టుడే, గోదావరిఖని పట్టణం
గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో ‘టిఫా’ సదుపాయం అందుబాటులోకి రావడంతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన గర్భిణులకు తిప్పలు తప్పాయి. గర్భంలో శిశువు ఆరోగ్య స్థితిగతులపై 18 నుంచి 23 వారాల్లోగా ‘టిఫా’(టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫెటల్ ఎనామలీస్) స్కానింగ్ తప్పని సరి. నవంబరు చివరి వారం నుంచి గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో ‘టిఫా’ స్కానింగ్ సేవలు మొదలయ్యాయి. గతంలో ఈ స్కానింగ్ కోసం గోదావరిఖనితో పాటు కరీంనగర్, మంచిర్యాలలోని ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఖర్చుతో కూడుకొని ఉండటంతో ఆర్థిక భారం పడేది. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారు అత్యధికంగా నిరుపేదలే. వారికి ఇబ్బందులు తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తోంది.
స్కానింగ్ చేస్తున్న వైద్యురాలు డాక్టర్ సుప్రియ
ఎంతో ప్రయోజనం...
గర్భంలో శిశువు ఎదుగుదల సరిగా లేకపోవడంతో పాటు శారీరక, మానసిక వైకల్యం ఉన్నట్లయితే ‘టిఫా’ స్కానింగ్లో తెలిసే అవకాశముంటుంది. అందుకు అనుగుణంగా చికిత్సలు నిర్వహించే అవకాశముంది. అందుకే తప్పనిసరిగా ప్రతి గర్భిణీ ‘టిఫా’ స్కానింగ్ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో ‘టిఫా’ స్కానింగ్ మిషన్తో పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసేందుకు ఒక్కరే రేడియోగ్రాఫర్ ఉండడంతో ప్రతి రోజు సుమారుగా 50 వరకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తుండగా ‘టిఫా’ మాత్రం ఒకటి, తప్పనిసరైతే రెండు వరకు చేస్తున్నారు. టిఫా కోసం వచ్చే గర్భిణుల వివరాలను నమోదు చేసుకుంటూ వారికి తేదీని కేటాయిస్తున్నారు.
సిబ్బంది కొరత నివారిస్తే మేలు
స్కానింగ్కు సంబంధించి ఎన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చినా కీలకమైన రేడియోగ్రాఫర్ల నియామకం తప్పనిసరి. లేకుంటే సేవలు నామమాత్రమే కానున్నాయి. గోదావరిఖని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో టిఫా, అల్ట్రాసౌండ్, సీటీస్కాన్ సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ రేడియాలజీ విభాగంలో మాత్రం ఒక్కరే ఉండడంతో ఆశించిన మేరకు స్కానింగ్ సేవలు ప్రజలకు అందడం లేదు. సార్వజనిక ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో ఒక ఆచార్యులు, ఇద్దరు సహ ఆచార్యులు, ఐదుగురు సహాయక ఆచార్యులు ఉండాల్సి ఉండగా గోదావరిఖనిలో మాత్రం ఒకే సహాయక ఆచార్యులు ఉన్నారు. స్కానింగ్కు రద్దీ ఎక్కువగా ఉండగా అవసరమైన వారికి ప్రత్యేక తేదీ, సమయం కేటాయించి సేవలు అందిస్తున్నారు. సీటీస్కాన్ కోసం ఓ ఒప్పంద ఉద్యోగికి శిక్షణ ఇచ్చి నిర్వహణ చేపట్టనున్నట్లు సమాచారం.
సీటీస్కాన్ ప్రారంభానికి సన్నాహాలు
సింగరేణి కాలరీస్ నిధులతో గోదావరిఖని ప్రభుత్వ సార్వజనిక ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సీటీస్కాన్ సేవలను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల ట్రయల్ రన్ పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేశారు. మరో వారం రోజుల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్రమాదాల్లో గాయపడి నిత్యం అనేక మంది వైద్యం కోసం ఆసుపత్రికి వస్తుంటారు. తలకు తీవ్ర గాయాలైన సమయంలో తప్పనిసరిగా సీటీస్కాన్ అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో వారిని ప్రైవేటుకేంద్రాలకు లేదంటే కరీంనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి పంపించడం చేస్తుంటారు. దూరాభారంతో ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉండగా ప్రైవేటులో ఈ స్కాన్కు అధికంగా ఖర్చవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ సేవలు మొదలైతే ప్రజలకు ఇబ్బందులు తప్పనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో