logo

కూరగాయలకు వెళ్లి.. విగతజీవిగా మారి!

పొలం వద్ద కూరగాయలు తేవడానికి వెళ్లిన మహిళ అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కాల్వశ్రీరాంపూర్‌ మండలం వెన్నంపల్లిలో చోటుచేసుకుంది.

Published : 05 Feb 2023 05:03 IST

వివాహిత అనుమానాస్పద మృతి.. హత్యేనని కుటుంబ సభ్యుల ఫిర్యాదు

సుమలత

కాల్వశ్రీరాంపూర్‌, న్యూస్‌టుడే: పొలం వద్ద కూరగాయలు తేవడానికి వెళ్లిన మహిళ అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కాల్వశ్రీరాంపూర్‌ మండలం వెన్నంపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన తొట్ల సుమలత(35) శుక్రవారం ఉదయం ఇంట్లో సమ్మక్కకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మధ్యాహ్నం వేళ పొలంలో ఉన్న కూరగాయలు తీసుకురావడానికి వెళ్లింది. సాయంత్రం అయినా ఆమె తిరిగి రాలేదు. పొలం వైపు వెళ్లిన కొందరికి అక్కడ సుమలత విగతజీవిగా పడి ఉండటం కనిపించింది. దీంతో భర్త రవితో పాటు గ్రామస్థులకు సమాచారం అందించగా వారు అక్కడికి వెళ్లి చూశారు. మృతురాలి ఒంటిపై, తలపై గాయాలు ఉండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలాన్ని సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై రాజవర్ధన్‌ పరిశీలించి మృతదేహాన్ని పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. సుమలతది హత్యేనని భర్త రవి, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని