నిధులు వ్యయం.. పథకాలు అస్తవ్యస్తం
మత్య్సకారుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలు చేస్తున్నాయి. వారికి ఉపాధి కల్పనే లక్ష్యంగా నిధులు వెచ్చిస్తున్నాయి.
మత్స్య సహకార సంఘాల్లో పెరిగిన రాజకీయ జోక్యం
పాలకవర్గాల ఏర్పాటుపై నేతల వద్దకు పంచాయితీలు
ఈనాడు డిజిటల్, పెద్దపల్లి: మత్య్సకారుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు అమలు చేస్తున్నాయి. వారికి ఉపాధి కల్పనే లక్ష్యంగా నిధులు వెచ్చిస్తున్నాయి. ఏటా చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వదలడంతో పాటు యంత్రాలు అందజేయడం, సహకార సంఘాల ఆధ్వర్యంలో ఉపాధి కల్పించడం తదితర వసతులు కల్పిస్తోంది. సమున్నత ఆశయంతో అమలు చేస్తున్న పథకాలు పలు చోట్ల పక్కదారి పడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో అక్రమాలు జరుగుతున్నాయి.
జిల్లాలో చేప పిల్లల సరఫరాలో జాప్యానికి తోడు పంపిణీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. ఏటా జూన్, జులై నెలల్లోనే 100 శాతం పంపిణీ పూర్తి కావాల్సి ఉండగా గతేడాది డిసెంబరు వరకు కొనసాగింది. దీనికి తోడు పంపిణీ ప్రక్రియ నిర్లక్ష్యంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా మత్స్య సహకార సంఘాల్లోనూ రాజకీయ నాయకుల జోక్యం పెరిగింది. పార్టీల వారీగా సొసైటీలు ఏర్పడుతుండటంతో చేపల క్రయ విక్రయాల విషయంలో విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆధిపత్య ధోరణితో తరచూ నియోజకవర్గ ప్రజాప్రతినిధుల వద్దకు పంచాయతీలు వెళ్తున్నాయి.
రోడ్లపైనే విక్రయాలు
* స్థానికంగా చేపల ఉత్పత్తితో పాటు ఇక్కడే విక్రయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పిల్లల పంపిణీ చేపట్టింది. మార్కెటింగ్ కోసం ప్రభుత్వం కేటాయించిన వాహనాలు, ఇతర స్టాళ్లను లబ్ధిదారులు ఎప్పుడో ఇతరులకు విక్రయించారు.
* రామగుండం, పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ పట్టణ ప్రాంతాల్లో రహదారులపైనే చేపలు విక్రయిస్తున్నారు. ధర్మారంలో సమీకృత చేపల మార్కెట్ ఏర్పాటు చేస్తామని గతంలో చేసిన ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదు.
* ఇప్పటివరకు చెరువుల్లో వేసిన చేపపిల్లలు మార్చి, ఏప్రిల్ నెలాఖరు వరకు పెరిగి విక్రయానికి సిద్ధమవుతాయి. రోహు, బొచ్చ, బంగారుతీగ జాతికి చెందిన చేపలను గతేడాది స్థానికంగా మార్కెటింగ్ చేసే సౌకర్యాలు లేక పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేయాల్సి వచ్చింది.
అనుయాయులకే అందలం
* జిల్లావ్యాప్తంగా 1000 చెరువులుండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.49 కోట్ల చేప పిల్లల పంపిణీ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 143 మత్య్స సహకార సంఘాలుండగా దాదాపు 8 వేల మంది సభ్యులున్నారు.
* చెరువు శిఖాన్ని బట్టి సొసైటీలు ఏర్పాటు చేసుకునే అవకాశాలున్నాయి. జిల్లాలో 266 పంచాయతీలుండగా 143 మత్య్స సహకార సంఘాలు ఏర్పడ్డాయి.
* నిబంధనల ప్రకారం నిర్ణీత కాలానికి ప్రతి సంఘానికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఓటర్ల జాబితా రూపొందించడం, అనర్హులైన సభ్యులను తొలగించడం వంటివి చేపట్టాల్సి ఉంటుంది.
* ఇవేవీ లేకుండానే ఎమ్మెల్యేల కనుసన్నుల్లోనే సంఘాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇతరులకు అవకాశం ఇవ్వకుండా పార్టీల కార్యకర్తలూ, బంధుమిత్రులకు ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
* గతంలో సుల్తానాబాద్లో, ఇటీవల ఓదెల మండలంలో మత్స్య సహకార సంఘం సభ్యులు శాసనసభ్యుడి వద్దకు వచ్చి అక్రమాలపై ఫిర్యాదు చేశారు. కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. మరో పార్టీకి చెందిన సొసైటీ సభ్యులు సైతం ఆ పార్టీ నాయకుడిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు.
ఆన్లైన్లోనే అన్ని వివరాలు
-భాస్కర్, జిల్లా మత్య్సశాఖ అధికారి
త్వరలో మత్య్స సహకార సంఘాలతో పాటు జిల్లాలో మా శాఖ ఆధ్వర్యంలోని అన్ని కార్యకలాపాలను డిజిలీకరణ చేస్తాô. సొసైటీల ఆధ్వర్యంలో చేపల ఉత్పత్తి, విక్రయాలు తదితర అన్ని అంశాలనూ ఆన్లైన్లో పొందుపరుస్తాం. సొసైటీల్లో అక్రమాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఎన్నికల్లో రాజకీయ జోక్యాలున్నట్లు నిర్ధారణ అయితే రద్దు చేస్తాం. ధర్మారంలో రూ.50 లక్షలతో చేపల మార్కెట్ ఏర్పాటుకు నిధులున్నా, స్థలం అందుబాటులో లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్లమెంట్ సభ్యత్వం పునరావాస కేంద్రమా?: వినోద్కుమార్
[ 20-04-2024]
తెలంగాణ తెచ్చిన భారాస పార్టీ పార్లమెంట్లో ఉండాల్సిన అవసరం ఉందని కరీంనగర్ లోక్సభ భారాస అభ్యర్థి బి. వినోద్ కుమార్ అన్నారు. -
జమ్మికుంటలో వర్షం.. అప్రమత్తమైన అన్నదాతలు
[ 20-04-2024]
జమ్మికుంటలో వర్షం కురిసింది. దీంతో స్థానిక పాత వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడవకుండా అన్నదాతలు, మార్కెట్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
రెండో రోజు నలుగురు నామినేషన్
[ 20-04-2024]
కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు రెండో రోజు శుక్రవారం కేవలం నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్ స్థానం కోసం భాజపా అభ్యర్థి బండి సంజయ్ తరఫున ఆ పార్టీ నాయకులు ఎన్నికల అధికారికి నామపత్రాలను అందజేశారు. -
ఆర్ఎం కార్యాలయానికి ఆరుగురు ఉద్యోగుల సరెండర్
[ 20-04-2024]
హుజూరాబాద్ ఆర్టీసీ డిపోనకు చెందిన ఆరుగురు ఉద్యోగులను కరీంనగర్ ఆర్ఎం కార్యాలయానికి సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. స్థానిక డిపోలో పనిచేసే డ్రైవర్ రవీందర్ వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఈ నెల 15న అనిశా అధికారులకు చిక్కిన విషయం విదితమే. -
ఉక్కపోతతో తల్లీబిడ్డల ఉక్కిరిబిక్కిరి
[ 20-04-2024]
భానుడి భగభగలకు ఉదయం 9 గంటలు దాటితే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎండలు 40 డిగ్రీల కంటే అధికంగానే ఉంటున్నాయి. -
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరం
[ 20-04-2024]
కాంగ్రెస్ నేతలకు మానసిక చికిత్స అవసరమని హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు అన్నారు. వారికి చికిత్స అందేలా చూడాలని శుక్రవారం కరీంనగర్లో ఎంపీ, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్కి వినతిపత్రం అందజేశారు. -
గంగుల, బండిల స్నేహం అందరికీ తెలుసు
[ 20-04-2024]
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్ల మధ్య స్నేహం అందరికీ తెలుసునని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను ఓడించేందుకు గంగుల కమలాకర్ భాజపాతో కుమ్మకైనట్లు ఆరోపించారు. -
వారసత్వ సంపద పరిరక్షణకు ఓటేద్దాం
[ 20-04-2024]
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటేనే ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు, వారసత్వ కట్టడాలకు పెట్టింది పేరు. శాతవాహనులు, కాకతీయులు, నిజాముల కాలంలో నిర్మించిన కోటలు, మెట్ల బావులు, ఆలయాలు ఇక్కడ కనిపిస్తాయి. -
ఇదీ అన్నదాత ఎజెండా!
[ 20-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. భిన్న వ్యవసాయ ఉత్పత్తులతో రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. దేశ విదేశాలకు ఎగుమతి చేసే పసుపు, మామిడి, మొక్కజొన్న, సన్న వరి, చెరకు, ఆవాలు, ఎర్రజొన్న, తెల్లజొన్న, సజ్జ తదితర పంటల దిగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నా అన్నదాతను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. -
ఒక ఎంపీ.. అయిదు జిల్లాలు
[ 20-04-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు గతంలో ఒకే జిల్లా పరిధిలో ఉండేవి. తెలంగాణ ఆవిర్భావం అనంతరం జిల్లాల పునర్విభజనతో ఎంపీ స్థానం అయిదు జిల్లాలకు విస్తరించింది. -
నీటి తొట్టిలో పడి బాలుడి మృతి
[ 20-04-2024]
ఇటుక బట్టీ వద్ద నీటి తొట్టిలో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన విషాదం నింపింది. కుటుంబసభ్యులు పోలీసుల కథనం ప్రకారం.. -
శిక్షణ తరగతులు సద్వినియోగం చేసుకోండి
[ 20-04-2024]
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కేజీబీవీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థినులకు కరీంనగర్ కేజీబీవీలో నిర్వహిస్తున్న ఎప్సెట్ శిక్షణ తరగతులను సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు అధికారి మల్లయ్య భట్టు శుక్రవారం సందర్శించారు. -
కరీంనగర్లో రూ.15.81 లక్షల పట్టివేత
[ 20-04-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా శుక్రవారం పోలీసులు కరీంనగర్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.15.81 లక్షల నగదును పట్టుకున్నట్లు కమిషనర్ కార్యాలయం తెలిపింది. -
ఇంటి నుంచే ఓటింగ్పై అధికారులకు శిక్షణ
[ 20-04-2024]
ఇంటినుంచే ఓటింగ్పై పాటించాల్సిన నిబంధనలపై అధికారులకు మంథని శాసనసభ సెగ్మెంట్ అధికారి హనుమనాయక్ అవగాహన కల్పించారు. శుక్రవారం మంథని ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులకు శిక్షణ ఇచ్చారు. -
అడుగడుగునా తనిఖీలతో ప్రలోభాలకు అడ్డుకట్ట
[ 20-04-2024]
ఎన్నికల్లో డబ్బు, మద్యం, మాదకద్రవ్యాల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. లోక్సభ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలో జిల్లా సరిహద్దు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
పెరుగుతున్న పసిడి ధరలు... తగ్గుతున్న వ్యాపారం
[ 20-04-2024]
బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకి వెళుతున్నాయి. గతంలో పెళ్లి ముహూర్తాల సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టేవి. దీనికి భిన్నంగా మార్కెట్లో ప్రస్తుతం పసిడి ధర పది గ్రాములు(తులం) రూ.76,000 వరకు పలుకుతోంది. -
కిట్టు సరే.. పరీక్ష చేసేవారేరీ?
[ 20-04-2024]
కలుషిత నీటితో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దీంతో ప్రజలకు శుద్ధ జలం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అక్కడక్కడ పైపులు పగిలి లీకేజీతో కలుషితమైన నీరు సరఫరా అయ్యే అవకాశం ఉంది. -
ఆరేళ్లుగా ఉపాధి కరవు
[ 20-04-2024]
వలసల నివారణకు అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల కోసం ఆరేళ్లుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఆ కుటుంబాలకు పనులు కల్పించడం లేదు. -
ప్రజలు మళ్లీ మోసపోవద్దు
[ 20-04-2024]
భాజపా అభ్యర్థి అర్వింద్ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్-ఇండియా, రోహింగ్యాంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. -
‘పసుపు బోర్డు పేరుతో మోసం’
[ 20-04-2024]
పసుపు బోర్డు పేరుతో ఎంపీ ధర్మపురి అర్వింద్ రైతులను మోసం చేశారని కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఆరోపించారు. ఇప్పుడు కూడా మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు