బస్సు ఢీకొని ఆటో డ్రైవర్ దుర్మరణం
అదుపు తప్పి బోల్తా పడిన ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందగా అందులో ప్రయాణిస్తున్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్గటూరులో శనివారం సాయంత్రం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
చంద్రమౌళి
వెల్గటూరు, న్యూస్టుడే : అదుపు తప్పి బోల్తా పడిన ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ మృతి చెందగా అందులో ప్రయాణిస్తున్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్గటూరులో శనివారం సాయంత్రం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కుమ్మరిపల్లి వైపు నుంచి వెల్గటూరుకు వస్తున్న ఆటో రైస్మిల్లు సమీపంలోని టీ ఫైబర్ గ్రిడ్ కేబుల్ కోసం తవ్విన గుంతను తప్పించబోయి అదుపు తప్పి రహదారి కుడివైపు వరకు వచ్చి బోల్తా పడింది. సరిగ్గా అదే సమయంలో ఎదురుగా వెల్గటూరు నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు ఈ ఆటోను ఢీకొంది. దీంతో ఆటో ముందు భాగం బస్సు కింద పడి నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో జగదేవుపేటకు చెందిన ఆటో డ్రైవర్ క్యాతం చంద్రమౌళి (38)కి, ఇందులో ప్రయాణిస్తున్న చెన్న అర్చనకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా చంద్రమౌళి మార్గమధ్యంలో మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. జీవనోపాధి కోసం కొన్నేళ్లు ఇరాక్ వెళ్లి వచ్చిన చంద్రమౌళి రెండేళ్లుగా ఆటో నడుపుతూ జీవనోపాధి పొందుతున్నాడు. ప్రమాదంలో కుటుంబ పెద్దను కోల్పోవడంతో కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది.
ప్రాణ సంకటంగా ప్రమాదకర గుంతలు
రహదారి పక్కన ప్రమాద హెచ్చరికలు లేకుండా కేబుల్ కోసం తవ్విన గుంతలను అలాగే వదిలేయడం ప్రమాదాలకు కారణమవుతోంది. కుమ్మరిపల్లి వైపు నుంచి వచ్చేటప్పుడు ఎడమ వైపు సగభాగం మేరకు గుంతకు సంబంధించిన మట్టి, రాళ్లు ఉన్నాయి. కుమ్మరిపల్లి నుంచి వెల్గటూరు వరకు అయిదారు చోట్ల రహదారి పక్కన ఇలా ప్రమాదకరంగా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం జగదేవుపేటకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తికి చెందిన ఆటో కూడా బోల్తా పడింది. పోలీసులు సాయంత్రం వేళలో ఇదే ప్రదేశంలో వాహన తనిఖీలు చేస్తుంటారు. వాహన చోదకుల వద్ద పత్రాలు లేకుంటే జరిమానాలు విధించే పోలీసు శాఖ ఈ గుంతలను కూడా పట్టించుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరీంనగర్ కాంగ్రెస్ టికెట్ ఎవరి చేతికి?.. మల్లగుల్లాలు పడుతున్న అధిష్ఠానం
[ 29-03-2024]
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఆ పార్టీ అధిష్ఠానం మల్లగుల్లాలు పడుతోంది.. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు ఖరారవగా.. హస్తం పార్టీ తరఫున బరిలో నిలిచేదెవరో తెలియకపోవడంతో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు అభ్యర్థి తేలేదెప్పుడు.. అని ఆందోళన చెందుతున్నారు. -
కనుల పండువగా శివయ్య కల్యాణం
[ 29-03-2024]
ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో గురువారం శివ కల్యాణోత్సవం కనుల పండువగా జరిగింది. -
ఆందోళన వద్దు.. అవకాశాలు కోకొల్లలు!
[ 29-03-2024]
విద్యార్థులు ప్రాథమిక విద్య నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పదో తరగతి పూర్తి చేశారు. ఒకట్రెండు రోజుల్లో పరీక్షలు కూడా పూర్తి చేసి ఉన్నతవిద్య వైపు అడుగులు వేయనున్నారు. -
అవసరాల మేరకు ఏదీ అనుసంధానం!
[ 29-03-2024]
ఈ రెండు అంశాల్లోనే కాదు. ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో ద.మ.రై.అధికారులు ఆది నుంచీ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. రైల్వే ఉద్యోగుల అవసరాలు, అధికారులు, నాయకులు లాబీయింగులతోనే కొత్త హాల్టింగులు, ఇతర వసతులు కల్పిస్తున్నారు. -
కరీంనగర్ బస్స్టేషన్ ఆస్తి పన్ను రూ.1.88 కోట్లు చెల్లింపు
[ 29-03-2024]
ఆస్తిపన్ను బకాయిలపై 90 శాతం రాయితీ గడువు మూడు రోజుల్లో ముగుస్తుందని నగరపాలక కమిషనర్ బోనగిరి శ్రీనివాస్ తెలిపారు. -
భార్య చేతిలో భర్త హతం
[ 29-03-2024]
భర్త మద్యానికి బానిసై శారీరకంగా.. మానసికంగా వేధిస్తున్నాడని వేదనకు గురైన ఓ భార్య తనకు తెలిసిన ఇద్దరి సహాయంతో తాళ్లతో కట్టేసి.. కళ్లలో కారం చల్లి... ఒంటిపై వేడి నీళ్లు పోసి తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయి మృతి చెందాడు. -
లోక్సభ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పరీక్ష
[ 29-03-2024]
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 15 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని శాసనమండలి సభ్యుడు, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్రెడ్డి అన్నారు. -
వేసవి గట్టెక్కేనా!
[ 29-03-2024]
జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్ పట్టణాలకు డబ్బాలోని గ్రిడ్ ద్వారా మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అవుతోంది. ధర్మపురి పట్టణానికి డబ్బా నుంచి పైపులైన్లు వేసినా చివరి ప్రాంతం కావడంతో నీరు సరఫరా సక్రమంగా కావడం లేదు. -
మట్టి గుట్టలు మాయం!
[ 29-03-2024]
మండలంలోని వరద కాలువ మట్టిని కొందరు గుత్తేదార్లు, స్తిరాస్థి వ్యాపారులు అక్రమంగా తరలించుకుపోతుండటంతో మట్టికట్టలు మాయమవుతున్నాయి. -
నిధులు దూరం.. నిర్వహణ భారం
[ 29-03-2024]
వ్యవసాయ శాఖ సేవలను రైతులకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గత ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలను నిర్మించింది. శాఖాపరంగా రైతులకు ఆధునిక సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇవ్వాలనేది ప్రధాన లక్ష్యం. -
లక్ష్యానికి చేరువగా సింగరేణి
[ 29-03-2024]
సింగరేణి సంస్థ తొలిసారిగా 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి చేరువ అవుతోంది. మూడేళ్లుగా ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంస్థ ఇప్పటివరకు ఆ మేరకు బొగ్గు ఉత్పత్తిని చేరుకోలేకపోయింది. -
బయో మైనింగ్ ప్రక్రియకు అవాంతరాలు
[ 29-03-2024]
పెరుగుతున్న నగరీకరణ.. అందుకు అనుగుణంగా పారిశుద్ధ్య నిర్వహణ ప్రభుత్వ యంత్రాంగానికి సవాల్గా మారుతోంది. ఈ క్రమంలో చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేసేందుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
భాజపా పాలనపై ప్రజల్లో విసుగు
[ 29-03-2024]
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించాలని భారాస ఎంపీ అభ్యర్థులు ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్, కొప్పుల ఈశ్వర్లు అన్నారు. -
మతం పేరిట కేసీఆర్ రాజకీయం చేయలేదు: కేటీఆర్
[ 29-03-2024]
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పదేళ్లలో ఏ రోజు కూడా మతం పేరిట రాజకీయం చేయలేదని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని దోచుకుంది భారాసనే: ఆది శ్రీనివాస్
[ 29-03-2024]
తెలంగాణ ఏర్పడిన తరవాత రూ.16 వేల కోట్ల నిల్వ బడ్జెట్తో రాష్ట్రాన్ని అప్పగిస్తే భారాస తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రాబంధుల్లా దోచుకుందని, రూ.6.67 లక్షల కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజలపై మోపిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్